సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, సాంస్కృతికశాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లెఖీ నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాను సందర్శించారు


ఆజాది కా అమృత్ మహోత్సవ్ నేపథ్యంలో స్వాతంత్ర్య సమరయోధుల జీవితం మరియు పోరాటంపై రికార్డులను డిజిటలైజ్ చేయడానికి ఎన్‌ఏఐ ప్రతిపాదించింది: శ్రీ జి. కిషన్ రెడ్డి

Posted On: 12 JUL 2021 6:05PM by PIB Hyderabad

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ రోజు న్యూ ఢిల్లీలోని జనపథ్ లో ఉన్న నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాను సందర్శించారు. కార్యక్రమంలో సాంస్కృతికశాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లెఖీ మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాఘవేంద్ర సింగ్ మరియు భారత జాతీయ ఆర్కైవ్స్ డైరెక్టర్ జనరల్ శ్రీ చందన్ సిన్హా  మరియు ఇతర అధికారుల సమక్షంలో రికార్డ్ మేనేజ్మెంట్, ప్రిజర్వేషన్ & డిజిటలైజేషన్ కార్యకలాపాల స్టాక్‌ను అందుకున్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రీసెర్చ్ రూమ్, ఓల్డ్ రిపోజిటరీ, ప్రిజర్వేషన్ రూమ్, ఓల్డ్ బిల్డింగ్ ఆఫ్ ఆర్కైవ్స్ మొదలైనవాటిని సందర్శించారు. భారత ప్రభుత్వానికి సంబంధించిన రికార్డుల సంపదను మరియు సున్నితమైన సేకరణలను తిలకించే అవకాశం తనకు దక్కిందని.. భారతదేశ అద్భుతమైన చరిత్ర మరియు సంస్కృతికి ఇవి నిదర్శనమని చెప్పారు.

నేషనల్ ఆర్కైవ్స్ ప్రపంచంలోనే అతిపెద్ద మరియు ప్రతిష్టాత్మక ఆర్కైవ్ కేంద్రాలలో ఒకటని అలాగే 800 మిలియన్ పేజీల రికార్డులు, 5.7 మిలియన్ ఫైల్స్ మరియు 1.2 లక్షల మ్యాప్‌లను అది కలిగి ఉందని శ్రీ కిషన్‌రెడ్డి చెప్పారు. భవిష్యత్ తరాల కోసం ఈ రికార్డులను భద్రపరచడం చాలా ముఖ్యం అన్నారు. భారత ప్రభుత్వ ముఖ్యమైన ఒప్పందాలు, విదేశీ ఒప్పందాలు మరియు దేశ పితామహుడు మహాత్మా గాంధీ యొక్క వ్యక్తిత్వం మరియు పనికి సంబంధించిన పత్రాలు మరియు బౌద్ధ సంస్కృతికి సంబంధించిన పత్రాలు నేషనల్ ఆర్కైవ్స్‌ చేత భద్రపరచబడ్డాయని తెలిపారు.

ఈ రికార్డుల డిజిటలైజేషన్ పనులు జరుగుతున్నాయని, స్వాతంత్ర్యం పొందిన 75 సంవత్సరాల జ్ఞాపకార్థం 'ఆజాది కా అమృత్ మహోత్సవ్' జరుపుకుంటున్న నేపథ్యంలో పనులు వేగవంతం అవుతాయని శ్రీ రెడ్డి అన్నారు. ఇది ఒక మెగా ప్రాజెక్ట్, తద్వారా దేశం మరియు ప్రపంచ ప్రజలు రికార్డుల పోర్టల్‌లో లభించే ఆర్కైవల్‌ను సులభంగా గ్రహించవచ్చు. ఇది విద్యా విలువలతో పాటు అవగాహన కల్పించడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు.

అమృత్ మహోత్సవ్ వేడుకల దృష్ట్యా..మన స్వాతంత్ర్య సమరయోధుల జీవితం, పోరాటానికి సంబంధించిన రికార్డులను ప్రాధాన్యత ప్రాతిపదికన డిజిటలైజ్ చేసే ప్రతిపాదన ఉందని, తద్వారా రాబోయే తరాలకు వారు చేసిన త్యాగాల గురించి తెలుస్తుందన్నారు.

మీడియాతో మాట్లాడుతూ "నేషనల్ ఆర్కైవ్స్ వద్ద ఉన్న అన్ని రికార్డులకు ప్రభుత్వం సంరక్షకుడని మరియు సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రాజెక్టు సమయంలో వాటి పూర్తి భద్రతను నిర్ధారిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.

నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా అనేది భారత ప్రభుత్వ పురాతన రికార్డుల రిపోజిటరీ మరియు నిర్వాహకులు మరియు నిపుణుల ఉపయోగం కోసం భద్రపరుస్తుంది.


 

*****



(Release ID: 1734934) Visitor Counter : 199