భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

రానున్న ఐదు రోజులలో దేశంలోని ఏ ప్రాంతంలోనూ వ‌డ‌గాలుల వీచే పరిస్థితి నెల‌కొని లేదు

Posted On: 24 JUN 2021 4:35PM by PIB Hyderabad

భార‌త వాతావ‌ర‌ణ శాఖ‌కు చెందిన జాతీయ వాతావ‌ర‌ణ కేంద్రం అంచ‌నా మేర‌కు
: (తేదీ: 24 జూన్, 2021, జారీ సమయం: 1600 గంటల భార‌త ప్రామాణిక కాల‌మానం స‌మ‌యానికి) ప్రస్తుత ఉష్ణోగ్రత స్థితి, వచ్చే ఐదు రోజులు హెచ్చరిక ఇలా ఉంది.
నిన్నటి గరిష్ట ఉష్ణోగ్రత దృశ్యం:
వ‌డ‌గాలులు: లేవు
గరిష్ట ఉష్ణోగ్రత: పంజాబ్ రాష్ట్రంలోని చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 40.0 డిగ్రీల సెల్సియ‌స్‌ కంటే కూడా ఎక్కువగా నమోదయ్యాయి; పశ్చిమ రాజస్థాన్, హర్యానా, ఛండీగఢ్ & ఢిల్లీలోనూ మరియు తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్య ప్రదేశ్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ల‌లోని జ‌న‌స‌మూహానికి దూరంగా ఉండే  వివిధ ప్రదేశాలలో అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. నిన్న గంగానగర్ ప్రాంతం (పశ్చిమ రాజస్థాన్ ) వద్ద అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 44.2°C గా నమోదైంది.
నేటి కనిష్ట ఉష్ణోగ్రత దృశ్యం:
వెచ్చని రాత్రి: లేన‌ట్టే.
కనిష్ట ఉష్ణోగ్రత: అస్సాం & మేఘాలయ, హర్యానా, ఛండీగఢ్‌, ఢిల్లీ మరియు మధ్య మహారాష్ట్ర మరియు ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్ & సిక్కిం మీదుగా వివిక్త ప్రదేశాలలో కనిష్ట ఉష్ణోగ్రతల‌ సాధారణం (1.6 ° C నుండి నుండి 3.0 ° C) వరకు ఉన్నాయి.

(దయచేసి మరిన్ని వివరాలు & గ్రాఫిక్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
 
స్థానక‌ నిర్దిష్ట సూచన & హెచ్చరిక కోసం మౌస‌మ్ యాప్‌ని దయచేసి డౌన్‌లోడ్ చేయండి. అగ్రోమెట్ సలహా కోసం మేఘ‌దూత్ యాప్‌ను మరియు పిడుగుపాట్ల  హెచ్చరిక కోసం ధామిని యాప్‌ & జిల్లా వారీ హెచ్చరిక కోసం రాష్ట్ర ఎంసీ / ఆర్ఎంసీ వెబ్‌సైట్‌లను సందర్శించండి.



(Release ID: 1730222) Visitor Counter : 181