రైల్వే మంత్రిత్వ శాఖ

కిసాన్ రైళ్లు 2.7 లక్షల టన్నుల సరుకును రవాణా చేయడంతో భారతదేశ రైతుకి దేశవ్యాప్తంగా ఏ మార్కెట్ అయినా అందుబాటులో ఉంటుంది


ఇప్పటి వరకు 60 రూట్లు ఆపరేషన్ లోకి వచ్చాయి

Posted On: 23 JUN 2021 6:53PM by PIB Hyderabad

విస్తృతంగా దేశవ్యాప్తంగా అతిపెద్ద నెట్ వర్క్ కలిగిన భారతీయ రైల్వే రవాణా కార్యకలాపాలతో, రైతుల ఆదాయం పెంచాలనే కేంద్ర ఆలోచనకు అనుగుణంగా కృషి చేస్తూ ప్రభుత్వ సంకల్ప సాకారానికి భాగస్వామ్యం అయింది. కిసాన్ రైళ్లను నడుపుతూ రైతులకు భారతీయ మార్కెట్ వ్యవస్థను  మరింత దగ్గర చేసింది. కిసాన్ రైళ్లు ఇప్పటి వరకు 2.7 లక్షల టన్నుల సరుకును రవాణా చేసింది. 60 రూట్లను ఆపరేషన్ లోకి తెచ్చింది. 

రైల్వలు వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలు (వ్యవసాయ/ఉద్యానవన/మత్స్య శాఖలు), స్థానిక సంస్థలు, మొదలైన భాగస్వామ్య శాఖలు, సంస్థలతో కలిసి రైల్వే నిరంతరంగా పని చేస్తూ కిసాన్ రైళ్లను నడుపుతోంది. 

కిసాన్ రైల్ ముఖ్య అంశాలు:

•       పండ్లు, కూరగాయలు, మాంసం, పౌల్ట్రీ, మత్స్య మరియు పాల ఉత్పత్తులతో సహా నిల్వ ఉండని వస్తువుల ఉత్పత్తిని లేదా మిగులు ప్రాంతాల నుండి వినియోగం లేదా లోటు ప్రాంతాలకు తరలించడం;                                                                                                                                                                                                                                                                                                                                                                                                                         •           రవాణాలో నష్టం గణనీయంగా తగ్గించేలా వేగవంతంగా సరుకు రవాణా చేయడం 

•          విస్తృతంగా ఉన్న రైల్వే నెట్ వర్క్ ను ఉపయోగించుకుని, రైతులు దేశవ్యాప్తంగా ఈ మార్కెట్ సదుపాయాలనైనా వినియోగించుకునే అవకాశం 

•         పళ్ళు, కాయగూరల రవాణాకు 50 శాతం సబ్సిడీ (ఆపరేషన్ గ్రీన్స్ - టాప్ తో టోటల్ పథకం కింద కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ భరిస్తుంది ) 

•          బహుళ వస్తువు, బహుళ సరుకు, బహుళ స్టాపేజ్ లు, సమయ-పట్టిక రైళ్లు అనే భావన ఆధారంగా - తక్కువ ఉత్పత్తి కలిగిన చిన్న రైతులకు కూడా మధ్యవర్తులు లేకుండా తమ సరుకును రవాణా చేయడానికి సహాయపడుతుంది;

•           చిన్న, మధ్య తరహా రైతులు కూడా పెద్దవి, సుదూరమైనవి మార్కెట్లకు చేరుకోవడానికి వీలు కల్పించే పరిమాణానికి కనీస పరిమితి లేదు;

•          రవాణా సమయం తగ్గడం, ఖర్చులు తగ్గడం వల్ల చివరి వినియోగదారునికి (పెద్ద నగరాల్లో వినియోగ కేంద్రాల్లో ) సరుకు తాజాగా అందడమే కాకుండా, తక్కువ ధరలకు అందుతాయి 

కేంద్ర బడ్జెట్ 2020-21లో చేసిన ప్రకటనకు అనుగుణంగా, కిసాన్ రైళ్లను భారతీయ రైల్వే ప్రవేశపెట్టింది -ఎక్కువ కాలం నిల్వ ఉండని,  వ్యవసాయ ఉత్పత్తులను (పండ్లు, కూరగాయలు, మాంసం, పౌల్ట్రీ, మత్స్య మరియు పాల ఉత్పత్తులతో సహా) ఉత్పత్తి లేదా మిగులు ప్రాంతాల నుండి వినియోగం లేదా లోటు ఉన్న ప్రాంతాలకు తరలించడానికి వీలుంటుంది 

         కిసాన్ రైల్ పథకం కింద మొదటి రైలు - దేవ్లాలి (మాహ్) మరియు దానపూర్ (బీహార్) మధ్య - రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ 2020 ఆగష్టు 7వ తేదీన జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు తరువాత సంగోలా (మాహ్) మరియు ముజఫర్పూర్ (బీహార్) మధ్య నడపడానికి విస్తరించబడింది.

        కిసాన్ రైల్ పథకం కింద 100 వ ట్రిప్ - సాంగోలా (మాహ్) మరియు షాలిమార్ (డబ్ల్యుబి) మధ్య - గౌరవ ప్రధాని 2020 డిసెంబర్ 28 న ఫ్లాగ్-ఆఫ్ చేశారు. 

        20 జూన్ 2021 వరకు, కిసాన్ రైళ్ల మొత్తం 850 ట్రిప్పులు 60 మార్గాల్లో నడిపారు, 2.7 లక్షల టన్నుల సరుకులను రవాణా చేశాయి. 2021 లో ఈ రైళ్ల నెలవారీ పనితీరు ఇలా ఉంది:

జనవరి 2021   –                       82 ట్రిప్పులు (32,332 టన్నులు )

ఫిబ్రవరి 2021             –          128 ట్రిప్పులు  (41,665 టన్నులు )

మార్చి, 2021                 –          133 ట్రిప్పులు  (40,695 టన్నులు )

ఏప్రిల్  2021                   -           127 ట్రిప్పులు (39,518 టన్నుల )

మే  2021                    -           173ట్రిప్పులు  (55,300 టన్నులు )

జూన్ (18వ తేదీ వరకు )-        93 ట్రిప్పులు  (32,542 టన్నులు)

 

         కిసాన్ సమయ-పట్టిక మార్గాల్లో నడుస్తాయి, కచ్చితమైన సమాయంతో పాటు తక్కువ నిల్వ ఉండే వస్తువులు నిర్ణీత సమయంలో తమ గమ్యస్థానాలకు చేరుకునేలా చూస్తాయి. భారతీయ రైల్వే వనరులు చాలా సరైన పద్ధతిలో ఉపయోగిస్తున్నారు. ప్రధాన పంటలు / కిసాన్ రైల్ రైలు ద్వారా రవాణా అవుతున్న వ్యవసాయ ఉత్పత్తులలో నారింజ, ఉల్లిపాయ, బంగాళాదుంప, అరటి, మామిడి, టమోటా, దానిమ్మ, కస్టర్డ్ ఆపిల్, క్యాప్సికమ్, చికూ, క్యారెట్ మొదలైనవి ఉన్నాయి. 

ధర మరియు సబ్సిడీ: అన్ని కిసాన్ రైలు రైలు సేవలకు 'పి-స్కేల్' పార్సెల్ టారిఫ్ వర్తిస్తుంది. 

ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ‘ఆపరేషన్ గ్రీన్స్ - టాప్ టు టోటల్’ పథకం కింద కిసాన్ రైల్ రైళ్ల సేవల ద్వారా పండ్లు, కూరగాయల రవాణాపై  50% సబ్సిడీ మంజూరు చేస్తారు. ఈ సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుండి (2020 అక్టోబర్ 14 నుండి 2021 జూన్ 15 వరకు) కిసాన్ రైల్ ద్వారా సబ్సిడీగా సుమారు రూ .52.38 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు.

 

List of Kisan Rail Routes

***



(Release ID: 1729946) Visitor Counter : 176