రైల్వే మంత్రిత్వ శాఖ

తుఫాను గాలులను అధిగమించడానికి తూర్పు రాష్ట్రాల నుండి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళ కార్యకలాపాలను పెంచిన - రైల్వేలు


దేశానికి ఉపశమనం కలిగించడానికి, 12 గంటల్లో 680 మెట్రిక్ టన్నుల ఎల్‌.ఎం.ఓ. ను రవాణా చేస్తున్న - 8 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు



17,239 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ పరిమాణంలో ఎల్‌.ఎం.ఓ. ను దేశానికి అందించిన - ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు



ఇప్పటివరకు తమ ప్రయాణాన్ని పూర్తి చేసి, 1042 ఆక్సిజన్ ట్యాంకర్లతో, 14 రాష్ట్రాలకు ఉపశమనం కలిగించిన - 263 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు



మహారాష్ట్రలో 614 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్; ఉత్తరప్రదేశ్ లో దాదాపు 3649 మెట్రిక్ టన్నులు; మధ్యప్రదేశ్ లో 633 మెట్రిక్ టన్నులు; ఢిల్లీ లో 4820 మెట్రిక్ టన్నులు; హర్యానా లో 1911 మెట్రిక్ టన్నులు; రాజస్థాన్ లో 98 మెట్రిక్ టన్నులు; కర్ణాటక లో 1421 మెట్రిక్ టన్నులు; ఉత్తరాఖండ్‌ లో 320 మెట్రిక్ టన్నులు; తమిళనాడు లో 1099 మెట్రిక్ టన్నులు; ఆంధ్రప్రదేశ్‌ లో 886 మెట్రిక్ టన్నులు; పంజాబ్ లో 225 మెట్రిక్ టన్నులు; కేరళ లో 246 మెట్రిక్ టన్నులు; తెలంగాణలో 1029 మెట్రిక్ టన్నులు; అస్సాం లో 80 మెట్రిక్ టన్నులు; ఆక్సిజన్ దింపుకోవడం జరిగింది

Posted On: 25 MAY 2021 6:35PM by PIB Hyderabad

అన్ని అడ్డంకులను అధిగమించి, కొత్త పరిష్కారాలను కనుగొనే దిశగా, భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌.ఎం.ఓ) ను పంపిణీ చేయడం ద్వారా, ఉపశమనం కలిగించే ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.  భారత రైల్వే, ఇప్పటివరకు, 1042 కి పైగా ట్యాంకర్ల లో 17,239 మెట్రిక్ టన్నులకు పైగా,  ఎల్‌.ఎం.ఓ.ను దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేసింది.

263 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ లు ఇప్పటివరకు తమ ప్రయాణాన్ని పూర్తి చేసి వివిధ రాష్ట్రాలకు ఉపశమనం కలిగించిన విషయాన్ని గమనించవచ్చు.

ఈ సమాచారాన్ని విడుదల చేసే సమయానికి, 8 ట్యాంకర్ల లో  134 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ఎల్.ఎం.ఓ. తో నింపిన, 2 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు తమ గమ్యం దిశగా నడుస్తున్నాయి.

తుఫాను బలోపేతం కావడానికి ముందు, గత 12 గంటల్లో 8 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ నుండి 680 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను తరలించాయి.

దక్షిణాది రాష్ట్రాల్లో, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలకు, 1,000 మెట్రిక్ టన్నులకు పైగా ఎల్‌.ఎం.ఓ. పంపిణీ జరిగింది. 

సాధ్యమైనంత తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువగా ఎల్‌.ఎం.ఓ.ను వివిధ రాష్ట్రాల కు రవాణా చేయడానికి భారత రైల్వే కృషి చేస్తోంది.

ఈ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు, ఇంతవరకు, ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, అస్సాం వంటి 14 రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా ద్వారా ఉపశమనం కల్పించాయి.

ఈ సమాచారాన్ని విడుదల చేసే సమయం వరకు,  మహారాష్ట్రలో 614 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్; ఉత్తరప్రదేశ్ లో దాదాపు 3649 మెట్రిక్ టన్నులు;  మధ్యప్రదేశ్ లో 633 మెట్రిక్ టన్నులు; ఢిల్లీ లో 4820 మెట్రిక్ టన్నులు; హర్యానా లో 1911 మెట్రిక్ టన్నులు; రాజస్థాన్ లో 98 మెట్రిక్ టన్నులు; కర్ణాటక లో 1421 మెట్రిక్ టన్నులు;  ఉత్తరాఖండ్‌ లో 320 మెట్రిక్ టన్నులు; తమిళనాడు లో 1099 మెట్రిక్ టన్నులు; ఆంధ్రప్రదేశ్‌ లో 886 మెట్రిక్ టన్నులు; పంజాబ్ లో 225 మెట్రిక్ టన్నులు; కేరళ లో 246 మెట్రిక్ టన్నులు; తెలంగాణలో 1029 మెట్రిక్ టన్నులు; అస్సాం లో 80 మెట్రిక్ టన్నులు; ఆక్సిజన్ దింపుకోవడం జరిగింది.

రైల్వేలు ఆక్సిజన్ సరఫరా స్థానాలతో వేర్వేరు మార్గాలను గుర్తించి, ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాల అవసరాలకు సిద్ధంగా ఉన్నాయి.  కాగా, ఎల్‌.ఎం.ఓ. ను సరఫరా చేయడానికి, రాష్ట్రాలు, భారత రైల్వేకు ట్యాంకర్లను అందిస్తున్నాయి. 

31 రోజుల క్రితం ఏప్రిల్ 24వ తేదీన మహారాష్ట్రలో 126 మెట్రిక్ టన్నులు సరఫరా చేయడంతో, ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు తమ రవాణా కార్యక్రమాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. 

పశ్చిమంలో హపా, ముంద్రా; తూర్పున రూర్కెలా, దుర్గాపూర్, టాటా నగర్, అంగుల్ వంటి ప్రదేశాల నుండి భారత రైల్వే,  ఆక్సిజన్ సేకరించి, సంక్లిష్ట కార్యాచరణ మార్గ ప్రణాళికల ద్వారా, దేశంలోని వివిధ మార్గాల గుండా ప్రయాణించి, ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, అస్సాం వంటి దేశంలోని వివిధ రాష్ట్రాలకు రవాణా చేస్తోంది.

ఆక్సిజన్ సరఫరా సాధ్యమైనంత వేగంగా చేరుకునేలా చూడటానికి, ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ పేరుతో సరకు రవాణా రైళ్ళను నడపడంలో రైల్వే కొత్త ప్రమాణాలతో పాటు, అపూర్వమైన లక్ష్యాలను సాధిస్తోంది.   ఈ క్లిష్టమైన సరుకు రవాణా రైళ్ళ సగటు వేగం చాలా సందర్భాలలో 55 కన్నా ఎక్కువగా ఉంటోంది.  ఆక్సిజన్ సరఫరా, వేగంగా, సాధ్యమైనంత అతి తక్కువ సమయ వ్యవధి లో చేరుకోవాలనే లక్ష్యంతో, అధిక ప్రాధాన్యత కలిగిన గ్రీన్ కారిడార్‌లో, అత్యవసర భావనతో, వివిధ మండలాల కార్యాచరణ బృందాలు, అనేక సవాలు పరిస్థితులలో 24 గంటలూ పనిచేస్తున్నాయి.  వివిధ ప్రాంతాల్లో సిబ్బంది మారడం కోసం సాంకేతికంగా రైళ్ళు నిలిపి ఉంచే సమయాన్ని ఒక నిమిషానికి తగ్గించారు.

ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఎక్కడా ఆగకుండా, వేగంగా గమ్యం చేరుకోడానికి వీలుగా, అధిక అప్రమత్తతను, పాటిస్తూ, ఎక్కడికక్కడ రైలు మార్గాల్లో అవరోధాలు లేకుండా చూస్తున్నారు. 

ఇవన్నీ ఇతర సరకు రవాణా కార్యకలాపాల నిర్వహణ వేగం ఏమాత్రం తగ్గని రీతిలో కొనసాగుతున్నాయి.

కొత్తగా ఆక్సిజన్‌ ఎక్స్ ప్రెస్ రైళ్ళను నడపడం,  ఎప్పటికప్పుడు గణాంకాలతో తాజా సమాచారాన్ని సమకూర్చడం, ఒక క్రియాశీలమైన ప్రక్రియగా జరుగుతోంది.  మరింతగా లోడ్ చేసిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు అర్ధరాత్రి తరువాత ప్రయాణాలను ప్రారంభిస్తాయని భావిస్తున్నారు.

*****



(Release ID: 1721831) Visitor Counter : 152