శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

రాబోయే సవాళ్లను ఎదుర్కోవటానికి భవిష్యత్ సాంకేతికతలను సిద్ధంగా ఉంచాల్సిన అవసరాన్ని ప్రముఖులు ఎత్తిచూపారు

Posted On: 24 APR 2021 9:58AM by PIB Hyderabad

భవిష్యత్తు మరింత వేగంతో సవాళ్లను విసిరినప్పుడు ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ (ఐఎన్‌ఎఈ) దేశ అభివృద్ధి మరియు పురోగతి కోసం థింక్ ట్యాంక్ పాత్రను పోషించాలని సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్టి) కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ చెప్పారు. తద్వారా  సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ ప్రయోజనాలు సామాన్యులు పొందుతారని ఐఎన్‌ఎఈ 35 వ వ్యవస్థాపక దినోత్సవంలో తెలిపారు.

"భవిష్యత్ యొక్క కొన్ని ప్రధాన సవాళ్లు స్థిరమైన అభివృద్ధి, వాతావరణం, పవర్, తెలివైన యంత్రాల పాత్ర, ఇంటర్నెట్ ఆఫ్‌ థింగ్స్, పరిశ్రమ 4.0 మరియు సమాజం 5.0 మరియు భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాల కోసం మనం చూడవలసిన యంత్రాలతో మనిషి యొక్క భవిష్యత్తు పోటీకి సంబంధించినవి" అని ప్రొఫెసర్ శర్మ ఫౌండేషన్ డే ఆన్‌లైన్ వేడుకలో తెలిపారు. 2021 ఏప్రిల్ 20 న భారతదేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను సంస్థ ప్రారంభించిన సందర్భంగా ఇది గుర్తించబడింది.

ఇంజనీరింగ్ అనేది కొత్త విజ్ఞాన శాస్త్రాన్ని కనుగొనటానికి ఒక సాధనం మరియు సైన్స్ మరియు టెక్నాలజీని పరిజ్ఞానం మీద నిర్మించవచ్చని, ఇంటర్-డిసిప్లినరీ మరియు సమస్య పరిష్కారమే భవిష్యత్తుకు కీలకమని ఆయన అన్నారు. "భవిష్యత్తు అంతా టెక్నాలజీదే. ఇంజనీరింగ్‌లో నాయకత్వం సంపూర్ణ దృష్టిని పొందాలి. దేశ అభివృద్ధి మరియు పురోగతి కోసం ఐఎన్‌ఇ థింక్ ట్యాంక్ పాత్ర పోషించాలి"అని డిఎస్‌టి కార్యదర్శి అభిప్రాయపడ్డారు.

ఇంజనీరింగ్ మరియు విజ్ఞాన శాస్త్రంలో మహిళల సంఖ్య పరిమితంగా ఉండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ..రాబోయే సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీ (ఎస్‌టిఐపి) ఈ రంగంలో ఎక్కువ మంది మహిళలను ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఎందుకంటే ఇది వైవిధ్యం, మరియు ఈక్విటీ కోసమని తెలిపారు. "ఇంజనీరింగ్‌తో సహా సైన్స్‌ను డెమోక్రాటైజ్‌ చేయాలి. ఇంజనీరింగ్ చేపట్టడానికి మహిళలను ఎలా ప్రోత్సహించాలనే దాని గురించి ఐఎన్‌ఏఈ ఆలోచించాలి అని ఆయన అన్నారు.

అనేకమంది ప్రముఖులు తమ సంస్థల సాంకేతిక విజయాలు "ఆత్మనిర్భర్ భారత్"ని ఎలా సాకారం చేశారో వివరించారు.

అణుశక్తి విభాగం (డిఎఈ) కార్యదర్శి శ్రీ కెఎన్ వ్యాస్ & అటామిక్ ఎనర్జీ కమిషన్ (ఎఈసీ) చైర్మన్ అణు ఖనిజాల అన్వేషణ, అణు ఖనిజాల మైనింగ్, అణు రియాక్టర్ల రూపకల్పన మరియు నిర్మాణం, అణు రియాక్టర్ల సురక్షిత ఆపరేషన్, ఖర్చు చేసిన ఇంధన పునఃసంవిధానం, భారీ నీరు మరియు ప్రత్యేక పదార్థాల ఉత్పత్తి, అణు విద్యుత్ ప్లాంట్ల నియంత్రణ మరియు అణు విద్యుత్ ప్లాంట్ల నియంత్రణపై డిఎఈ కృషిని హైలైట్ చేశారు."భారతీయ పరిశ్రమలు ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగా మంచి ఉత్పత్తులను తయారు చేయగలవు. భారత శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లు ఏదైనా చేయగల సామర్ధ్యం కలిగి ఉన్నారు"అని ఆయన అన్నారు.

రక్షణ ఆర్‌అండ్‌డి విభాగం కార్యదర్శి, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఓ) చైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి రక్షణ వ్యవస్థలో స్వావలంబన ప్రయాణంలో డిఆర్‌డివో సహకారం గురించి క్షిపణులు, యుద్ధ విమానాలు, ట్యాంకులు మరియు పోరాట వాహనాలు, రాడార్లు మరియు సోనార్లు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు, టార్పెడోలు, గనులు మరియు క్షీపణులు, ఫిరంగి తుపాకులు, ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి, సైబర్ వ్యవస్థలు, ఎల్ఐసి నిర్వహణ ఉత్పత్తులు, అంతరిక్ష వ్యవస్థలు, సైనికుల సహాయక వ్యవస్థలు మరియు కమ్యూనికేషన్ వ్యవస్థల గురించి వివరించారు "మనం భారతదేశంలో అన్నిరకాల సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేశాము. మెజారిటీ ప్రాంతాలలో దిగుమతి చేసుకోవలసిన అవసరం లేదు" అని ఆయన స్పష్టం చేశారు.

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వి.ఎస్.ఎస్.సి) డైరెక్టర్ శ్రీ ఎస్ సోమనాథ్.. మానవ అంతరిక్ష ప్రయాణము, అంతరిక్ష వాణిజ్యం, అంతరిక్ష అప్లికేషన్లు, సామర్థ్యం పెంపొందించడం, అంతరిక్ష మౌలిక సదుపాయాలు మరియు అంతరిక్ష రవాణా, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం గురించి మాట్లాడారు. "మా దృష్టి సామాన్యులు మరియు దేశం యొక్క ప్రయోజనాల కోసం ప్రజాకేంద్రీకృత ఆవిష్కరణలు మరియు అప్లికేషన్ల ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిపై ఉంది" అని ఆయన స్పష్టం చేశారు.

కొవిడ్-19 కు వ్యతిరేక పోరాటంలో సిఎస్‌ఐఆర్‌ ప్రయత్నాలు మరియు ఆవిష్కరణల గురించి సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (డిఎస్‌ఐఆర్) కార్యదర్శి మరియు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్&ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్‌ఐఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి మాండే మాట్లాడారు. "సౌండ్ ఎస్&టి విధానాలను అనుసరించడం ఈ రోజు మనం ఇక్కడ ఉండటానికి కారణం. తరువాతి తరం మానవ వనరులను ఉత్పత్తి చేయడమే మా ప్రాథమిక లక్ష్యం. సమాజం మరియు దేశం యొక్క ప్రయోజనం కోసం సామాజిక మరియు పారిశ్రామిక ఆవిష్కరణలలో మేము గణనీయంగా సహకరించాము. మా ఎస్ అండ్ టి భారతీయ పరిశ్రమతో దగ్గరి సంబంధం కలిగి ఉంది. మా ధ్యేయం ఒక వైపు ప్రాథమిక శాస్త్రం మరియు మరొక వైపు సమాజానికి ప్రయోజనం చేకూరుస్తుంది" అని డాక్టర్ మాండే అన్నారు.

ఐఎన్‌ఎఈలో ఇటీవల జరుగుతున్న కార్యకలాపాలు మరియు సమాజంలో ఇంజనీర్ల యొక్క ప్రాముఖ్యత గురించి ఐఎన్‌ఎఈ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ఇంద్రానిల్ మన్నా వివరించారు.

దేశంలో ఇంజనీరింగ్ మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడానికి ఏప్రిల్ 20, 1987న ఐఎన్‌ఎఈ స్థాపించబడింది. ఈ అకాడమీ స్వయంప్రతిపత్త సంస్థ. ఈ సంస్థకు డిఎస్‌టి గ్రాంట్-ఇన్-ఎయిడ్ మద్దతు ఉంది.

***



(Release ID: 1713797) Visitor Counter : 146


Read this release in: English , Urdu , Hindi , Bengali