ఆయుష్

ఎన్‌ఎమ్‌పిబి ద్వారా ప్రాంతీయ మరియు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు

Posted On: 16 MAR 2021 1:41PM by PIB Hyderabad

నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ (ఎన్‌ఎమ్‌పిబి) దేశంలోని వివిధ ప్రాంతాలలో ఏడు ప్రాంతీయ కమ్ ఫెసిలిటేషన్ సెంటర్లను (ఆర్‌సిఎఫ్‌సి) ఏర్పాటు చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో పనిచేసే కేంద్రాల జాబితా క్రింద ఇవ్వబడింది:

1. ప్రాంతీయ కమ్ ఫెసిలిటేషన్ సెంటర్ (నార్తర్న్ రీజియన్ -1) రీసెర్చ్ ఇన్ట్సిట్యూట్ ఇన్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ (ఆర్‌ఐఐఎస్‌ఎం), ఆయుర్వేద విభాగం, జోగేంద్ర నగర్, హిమాచల్ ప్రదేశ్‌
2. ప్రాంతీయ కమ్ ఫెసిలిటేషన్ సెంటర్ (ఉత్తర ప్రాంతం -2) షేర్-ఎ-కాశ్మీర్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ & టెక్నాలజీ ఆఫ్ కాశ్మీర్ (ఎస్‌కెయుఎఎస్‌టి-కె), శ్రీనగర్, జమ్మూ&కాశ్మీర్‌
3. మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌లోని స్టేట్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎస్‌ఎఫ్‌ఆర్‌ఐ) వద్ద ప్రాంతీయ కమ్ ఫెసిలిటేషన్ సెంటర్ (సెంట్రల్ రీజియన్)
4. పశ్చిమ బెంగాల్, కోల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ కమ్ ఫెసిలిటేషన్ సెంటర్ (తూర్పు ప్రాంతం)
5. కేరళ అటవీ పరిశోధన సంస్థ (కెఎఫ్‌ఆర్‌ఐ), పీచి, త్రిసూర్, కేరళలోని ప్రాంతీయ కమ్ ఫెసిలిటేషన్ సెంటర్ (దక్షిణ ప్రాంతం)
6. అస్సాం జోర్హాట్‌లోని అస్సాం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ కమ్ ఫెసిలిటేషన్ సెంటర్ (నార్త్ ఈస్టర్న్ రీజియన్).
7. మహారాష్ట్ర పూణేలోని సావిత్రిబాయిపూలే పూణే విశ్వవిద్యాలయం, వృక్షశాస్త్ర విభాగంలో ప్రాంతీయ కమ్ ఫెసిలిటేషన్ సెంటర్ (వెస్ట్రన్ రీజియన్)

మూలికా సాగును ప్రోత్సహించడం కోసం ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ.4000 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. దీని ప్రకారం, ఔషధ మొక్కల పెంపకం మరియు మార్కెటింగ్‌ను ప్రోత్సహించడానికి ప్రభుత్వ పరిశీలన మరియు ఆమోదం కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ 'ప్రధాన్ మంత్రి వృక్ష్ ఆయుష్ యోజన' అనే పథకాన్ని సిద్ధం చేసింది.

ఎన్‌ఎమ్‌పిబి యొక్క ఆదేశాల మేరకు వివిధ రాష్ట్ర స్థాయి విభాగాలతో స్టేట్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ (ఎస్‌ఎమ్‌పిబి) / స్టేట్ ఫారెస్ట్స్ / అగ్రికల్చర్ / హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ వంటి వివిధ పథకాలను అమలు చేయడానికి ఆర్‌సిఎఫ్‌సిలు సహాయకారిగా పనిచేస్తున్నాయి.

మూలికా /ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడానికి, ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రస్తుతం దేశవ్యాప్తంగా జాతీయ ఆయుష్ మిషన్ (నామ్) యొక్క కేంద్ర ప్రాయోజిత పథకాన్ని అమలు చేస్తోంది.ఎన్‌ఎఎం పథకం కింద, 140 జాతుల మూలికా / ఔషధ మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. వీటిలో నిర్దిష్ట ప్రాంతాలకు చెందిన జాతులు కూడా ఉన్నాయి.

సహాయమంత్రి(ఆయుర్వేద, యోగా&ప్రకృతివైద్యం, యునాని, సిద్ధ మరియు హోమియోపతి మంత్రిత్వ శాఖ), ఎస్‌హెచ్‌. కిరెన్ రిజిజు (అదనపు ఛార్జ్) ఈ రోజు  రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు.

***



(Release ID: 1705287) Visitor Counter : 147