ఆర్థిక మంత్రిత్వ శాఖ

తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ సోదాలు

Posted On: 28 FEB 2021 10:51AM by PIB Hyderabad

ఆదాయపు పన్ను శాఖ 26.02.2021 న చెన్నైలో ఉన్న ఒక ప్రముఖ బిజినెస్ గ్రూప్ పై సోదాలు నిర్వహించింది. తమిళనాడు, గుజరాత్, కోల్‌కతాలోని 9 ప్రాంగణాల్లో సర్వే, 11 ప్రాంగణాల్లో సోదాలు జరిపింది. ఈ గ్రూపు టైల్స్ మరియు శానిటరీ-వేర్ తయారీ మరియు అమ్మకం వ్యాపారం చేస్తుంది. దక్షిణ భారతదేశంలో టైల్స్ వ్యాపారంలో ఇది దిగ్గజ కంపెనీ.

శోధన సమయంలో, ఖాతాల్లో చూపించని అమ్మకాలు మరియు పలకల కొనుగోళ్లు కనుగొనబడ్డాయి. సోదా బృందం చేసిన ప్రయత్నం వల్ల, లెక్క చూపని లావాదేవీల వివరాలను రహస్య కార్యాలయంలో మరియు క్లౌడ్‌లో నిర్వహిస్తున్న సాఫ్ట్‌వేర్‌లను కనుగొన్నారు. వాస్తవానికి, 50% మేరకు లావాదేవీలు పుస్తకాలలో లేవని తేలింది. మునుపటి టర్నోవర్‌ను పరిశీలిస్తే, లెక్కలు చూపని ఆదాయం 120 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చు. షెల్ కంపెనీల ద్వారా షేర్ ప్రీమియం గా చూపిన 100 కోట్ల రూపాయల ఆదాయం దీనికి అదనం. 

ఇప్పటివరకు లెక్క చూపని మొత్తం ఆదాయం రూ. 220 కోట్లుగా గుర్తించారు. సుమారు రూ .8.30 కోట్ల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు.

సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. పరిశోధన పురోగతిలో ఉంది. 

ఓటర్లను ప్రభావితం చేయడంలో డబ్బు చలామణిని తనిఖీ చేయడానికి, పర్యవేక్షించడానికి విభాగం పూర్తిగా సిద్ధంగా ఉంది. లెక్క చూపని నగదు చలామణిని, మరియు తమిళనాడు మరియు పుదుచ్చేరిలో దాని కదలికను తెలుసుకోవడానికి డిపార్ట్మెంట్ కట్టుబడి ఉంది.

***



(Release ID: 1701507) Visitor Counter : 135


Read this release in: English , Urdu , Hindi , Manipuri