ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల కార్యక్రమం తాజా సమాచారం


దేశవ్యాప్తంగా మొత్తం 74.30 లక్షల మందికి కోవిడ్ టీకాలు

27వ రోజు సాయంత్రం 7 గంటలకు 4,13,752 మందికి టీకాలు

Posted On: 11 FEB 2021 7:55PM by PIB Hyderabad

దేశవ్యాప్త టీకాల కార్యక్రమంలో భాగంగా కోవిడ్ టీకాలు అందుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధుల సంఖ్య 27వ రోజుకు 74.30 లక్షలకు చేరింది. మిజోరం, డామన్-డయ్యూ మినహా అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ రోజు టీకాల కార్యక్రమం సాగింది. ఈ సాయంత్రం 7 గంటలవరకు టీకాలు వేయించుకున్నవారి సంఖ్య 74,30,866  కు చేరింది.

తాత్కాలిక నివేదిక ప్రకారం ఇప్పటివరకు మొత్తం 1,53,799 శిబిరాలు జరిగాయి. ఈ రోజు 10,743 శిబిరాలు నిర్వహించారు. టీకాలు వేయించుకున్నవారిలో  5,790,832 మంది ఆరోగ్య సిబ్బంది కాగా  1,640,034 మంది కోవిడ్ పోరాట యోధులు.

ఈ రోజు టీకాలు వేయించుకున్నవారి సంఖ్య 4,13,752 కాగా, వారిలో 85,604 మంది ఆరోగ్య సిబ్బంది, 3,28,148 మంది కోవిడ్ పోరాట యోధులు.  తుది నివేదిక రాత్రి పొద్దుపోయాక అందుతుంది. 

 

క్రమ సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం

టీకా లబ్ధిదారులు

1

అండమాన్, నికోబార్ దీవులు

3454

2

ఆంధ్రప్రదేశ్

3,43,130

3

అరుణాచల్ ప్రదేశ్

14,195

4

ఆస్సాం

1,17,603

5

బీహార్

4,48,903

6

చండీగఢ్

7374

7

చత్తీస్ గఢ్

2,32,923

8

దాద్రా, నాగర్ హవేలి

2698

9

డామన్, డయ్యూ

1030

10

ఢిల్లీ

1,62,596

11

గోవా

11391

12

గుజరాత్

6,43,438

13

హర్యానా

1,90,390

14

హిమాచల్ ప్రదేశ్

67,689

15

జమ్మూ కశ్మీర్

93,570

16

జార్ఖండ్

1,74,080

17

కర్నాటక

4,76,277

18

కేరళ

3,33,436

19

లద్దాఖ్

2761

20

లక్షదీవులు

920

21

మధ్యప్రదేశ్

4,85,593

22

మహారాష్ట్ర

6,00,456

23

మణిపూర్

15944

24

మేఘాలయ

11514

25

మిజోరం

11046

26

నాగాలాండ్

8,238

27

ఒడిశా

3,83,023

28

పుదుచ్చేరి

4780

29

పంజాబ్

97,769

30

రాజస్థాన్

5,69,717

31

సిక్కిం

8332

32

తమిళనాడు

2,11,762

33

తెలంగాణ

2,61,262

34

త్రిపుర

59,438

35

ఉత్తరప్రదేశ్

7,52,501

36

ఉత్తరాఖండ్

97,618

37

పశ్చిమ బెంగాల్

4,49,649

38

ఇతరములు

74,366

మొత్తం

74,30,866

 

నేడు 27వ రోజు సాయంత్రం 7 గంటల వరకు టీకా అనంతర అనారోగ్య ఘటనలు 47 నమోదయ్యాయు.

******

 

 

 



(Release ID: 1697341) Visitor Counter : 163