ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్రపంచ ఆర్థిక ఫోరంకు చెందిన కామన్ ట్రస్ట్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసిన క్రాస్ బోర్డర్ మొబిలిటీ పునరుద్ధరణ సదస్సులో ప్రసంగించిన డాక్టర్ హర్ష్ వర్ధన్

"ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులపై కీలకమైన సమాచారాన్ని స్పష్టంగా, పారదర్శకంగా మరియు సమయానుసారంగా పంచుకోవడం ప్రజారోగ్యం మరియు వాణిజ్యం & ప్రయాణాల మధ్య సమతుల్యతను పెంచడంలో కీలకం. తద్వారా ప్రమాద తీవ్రతను అంచనా వేయవచ్చు"

Posted On: 28 JAN 2021 6:10PM by PIB Hyderabad

 

ప్రపంచ ఆర్థిక ఫోరంకు చెందిన కామన్ ట్రస్ట్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసిన క్రాస్ బోర్డర్ మొబిలిటీ పునరుద్ధరణ సదస్సులో  కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ వీడియో కాన్ఫరేషన్‌ ద్వారా ప్రసంగించారు.

సరిహద్దులను తిరిగి తెరవడానికి అవసరమైన విధానాలు, మార్గదర్శకాలపై చర్చించడం మరియు అవసరమైన ప్రయాణ, పర్యాటక మరియు వాణిజ్యాన్ని సురక్షితమైన మరియు స్థిరమైన మార్గంలో ప్రారంభించడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం.

సరిహద్దుల మధ్య రవాణాను కొవిడ్-19 ఏ విధంగా ప్రభావితం చేసిందో కేంద్ర మంత్రి వివరిస్తూ “కొవిడ్-19 మహమ్మారి అన్ని వర్గాలను మరియు వ్యక్తులను ప్రభావితం చేసే తీవ్రమైన పరిణామాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా గాయపరిచింది. ఇది సరఫరా వ్యవస్థలను కూడా ప్రభావితం చేసింది. అందువల్ల వాణిజ్యం మరియు అభివృద్ధిని ఒక ప్రధాన మార్గంలో ప్రభావితం చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన మార్గాల వెంట సరిహద్దుల మీదుగా వేగంగా కదులుతూ, వైరస్ యొక్క వ్యాప్తి ప్రపంచీకరణ యొక్క అంతర్లీన అనుసంధానం నుండి ప్రయోజనం పొందింది. తద్వారా ప్రపంచ ఆరోగ్య సంక్షోభానికి దారితీసింది. గ్లోబల్ ఎకనామిక్ షాక్ అనేక వర్గాలను తీవ్రంగా ప్రభావితం చేసింది"అని చెప్పారు.

ప్రమాద తీవ్రతను అంచనా వేయడం  యొక్క ప్రాముఖ్యతపై డాక్టర్ హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ “ప్రజారోగ్య పరిరక్షణ నేపథ్యంలో ప్రమాద తీవ్రతను వేగవంతంగా అంచనా వేయడం మరియు ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులపై కీలకమైన సమాచారాన్ని స్పష్టమైన, పారదర్శకంగా మరియు సమయానుసారంగా పంచుకోవడం చాలా కీలకం. ప్రజారోగ్యం మరియు వాణిజ్యం, ప్రయాణాల మధ్య సమతుల్యతలో అది చాలా కీలకం. ఇటువంటి రిస్క్‌ను మదింపు చేయడం, నిర్వహించడం దానికి సంబంధించిన కారకాలు, వాటి మూలం ముఖ్యం. భౌగోళిక వ్యాప్తి, వ్యాధి యొక్క వ్యాధికారకత, జనాభా మరియు వయస్సుల వారీ ప్రభావం, అనుబంధ మరణాలు, ఆరోగ్యం, జీవనోపాధి మరియు ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం ఉంటుంది. ” అని చెప్పారు.

ఈ విషయంపై ఆయన ప్రసంగిస్తూ “అంతర్జాతీయ కాంటాక్ట్ ట్రేసింగ్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌ఓపీలు) ఉండటం అత్యవసరం.  కొన్ని దేశాలలో కొవిడ్-19 ఉత్పరివర్తనమైన వైవిధ్యాలను గుర్తించే సందర్భంలో (ఇది కేసులలో పునరుజ్జీవనానికి దారితీసింది)  దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న ప్రయాణ మరియు వాణిజ్య పరిమితులను తొలగించడంలో మరోసారి వైరస్ వ్యాప్తి మరొక అవరోధంగా ఉద్భవించింది ” అని చెప్పారు.

అంతర్జాతీయ ప్రయాణ సమస్యలను పరిష్కరించే మార్గాలపై ఒక ప్రశ్నను ఉద్దేశించి  డాక్టర్ హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ, “అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (ఐఏటిఏ) మరియు ఐరోపాలోని కొన్ని దేశాలు కొవిడ్-19 టీకా ఆలోచన గురించి ఆలోచిస్తున్నప్పటికీ ప్రయాణ పరిమితులను తగ్గించడానికి ఆధారిత 'రోగనిరోధక శక్తి పాస్‌పోర్ట్‌లు' / ప్రయాణ పాస్‌ల గురించి మాట్లాడటం కొంచెం తొందరపాటు చర్యగా నేను భావిస్తున్నాను. పై విషయానికొస్తే, ఈ విషయంపై తదుపరి నిర్ణయం తీసుకోవడానికి అవసరమైన నివేదికలు వెలువడటానికి మరికొంత సమయం వేచి ఉండవచ్చని మేము భావిస్తున్నాము. ” అని చెప్పారు.

ప్రపంచ స్థాయిలో మార్గదర్శకాలను నిర్ధారించాల్సిన అవసరాన్ని అంగీకరిస్తూ  డాక్టర్ హర్ష్ వర్ధన్‌ “అంతర్జాతీయ కాంటాక్ట్‌ ట్రెసింగ్‌ లేదా‘ఇమ్యూనిటీ పాస్‌పోర్ట్ ’ల మార్గదర్శకాలు అంతర్జాతీయ ఆమోదయోగ్యతను నిర్ధారించడానికి కీలకమైనది. అవి సమానత్వం మరియు గోప్యత యొక్క సూత్రాలపై ఆధారపడి ఉండాలి. ఒక సంస్థగా ఐరాస  ప్రపంచ ఆరోగ్య సంస్థ  చట్టాలపై ప్రపంచ ఏకాభిప్రాయాన్ని సాధించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ” అని అభిప్రాయ పడ్డారు.

సరిహద్దుల మధ్య రవాణాను  అభివృద్ధి చేయడానికి ఆరోగ్య రంగం, విమానయాన, ప్రయాణ మరియు పర్యాటక రంగాలకు చెందిన వర్గాల మధ్య సహకారం అవసరం.కరోనాను ఎదుర్కొన్న విధంగానే  దీనికి కూడా  ప్రపంచవ్యాప్తంగా సమన్వయ, సులభతర విధానం అవసరం. ఆర్థిక వ్యవస్థలకు మరింత హాని జరగకుండా మరియు ప్రయాణీకులకు ప్రయాణానికి సౌకర్యంగా ఉండటానికి చాలా అవసరం ” అని కేంద్ర మంత్రి తెలిపారు.

గ్రూప్ ప్రెసిడెంట్ మరియు డిప్యూటీ ఛైర్మన్ డేవిడ్ సిన్, ఫుల్లెర్టన్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్, బిమ్కో ప్రెసిడెంట్ సబ్రినా చావ్ ఈ వర్చువల్‌ సదస్సులో పాల్గొన్నారు.



 

****



(Release ID: 1693048) Visitor Counter : 173