వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21లో క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర కార్య‌క‌లాపాలు


1124252 మంది రైతుల నుంచి రూ.16865.81 కోట్ల విలువైన 5783122 కాటన్ బేళ్ల స‌మీక‌ర‌ణతో ల‌బ్ది చేకూరింది

Posted On: 20 DEC 2020 5:46PM by PIB Hyderabad

ప్ర‌స్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కేఎంఎస్) 2020-21లో, ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర(ఎంఎస్‌పీ) పథకాల ప్రకారం రైతుల నుండి పంట‌ల‌ను కొనుగోలు చేస్తూనే ఉంది. ఖరీఫ్ 2020-21 సీజ‌న్‌కు సంబంధించిన వరి సేకరణ సజావుగా వృద్ధి చెందుతూ వ‌స్తోంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌తో పాటు తెలంగాణ, ఉత్తరాఖండ్, తమిళనాడు, ఛండీగ‌ఢ్‌, జమ్మూ & కాశ్మీర్, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఛ‌త్తీస్‌గ‌డ్‌, ఒడిషా, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్‌ల‌లో 412.91 ఎల్‌ఎమ్‌టీల వరి కొనుగోళ్లు జ‌రిగాయి. 19.12.2020 వరకు గత సంవత్సరంతో పోలిస్తే 337.74 ఎల్‌ఎమ్‌టీల వ‌రి కొనుగోళ్లు జ‌రిగాయి.

1.JPG

ఈ సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సేక‌ర‌ణ 22.25% పెరిగింది. మొత్తం 412.91 ఎల్‌ఎమ్‌టీల‌ కొనుగోలులో పంజాబ్ రాష్ట్రం ఒక్కటే.. 30.11.2020న రాష్ట్రంలో సేకరణ కాలం ముగిసే వరకు 202.77 ఎల్‌ఎమ్‌టీని కొనుగోలు జ‌రిపింది.

2.JPG

ఇది దేశంలో మొత్తం సేకరణలో 49.10 శాతానికి స‌మానం. ఇప్పటికే 48.56 లక్షల మంది రైతులు ప్ర‌స్తుతం కొనసాగుతున్న కేఎంఎస్ సేకరణ కార్యకలాపాల నుండి రూ.77957.83 కోట్ల లబ్ధి పొందారు. రాష్ట్రాల ప్రతిపాదన ఆధారంగా తమిళ నాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మద్దతు ధ‌ర పథకం(పీఎస్ఎస్) కోసం ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020 యొక్క 51.00 ఎల్ఎంటీల ప‌ప్పుధాన్యాలు మరియు నూనె గింజ‌ల కొనుగోళ్ల‌కు అనుమతులు లభించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు 1.23 ఎల్‌ఎమ్‌టీల కొబ్బ‌రి (శాశ్వత పంట) కొనుగోలుకు అనుమతి ఇవ్వబడింది. ఇతర రాష్ట్రాలు / యుటీల కొరకు, పప్పుధాన్యాలు, నూనె గింజలు మరియు కొబ్బ‌రను పీఎస్ఎస్ క్రింద సేకరించే ప్రతిపాదనలను స్వీకరించిన త‌రువాత ఆమోదం లభిస్తుంది. ఈ పంటల ఎఫ్ఏక్యూ గ్రేడ్ సేకరణను 2020-21 సంవత్సరానికి నోటిఫైడ్ ఎంఎస్‌పీ వద్ద రిజిస్టర్డ్ నుండి నేరుగా పొందవచ్చు. రైతులు, సెంట్రల్ నోడల్ ఏజెన్సీలు రాష్ట్ర నామినేటెడ్ ప్రొక్యూర్ ఏజెన్సీల ద్వారా సంబంధిత రాష్ట్రాలు / యుటీలు నోటిఫైడ్ హార్వెస్టింగ్ కాలంలో మార్కెట్ రేటు ఎంఎస్‌పీ కంటే తక్కువగా ఉంటే. 19.12.2020 వరకు ప్రభుత్వం తన నోడల్ ఏజెన్సీల ద్వారా 195899.38 ఎంటీ పెస‌లు, మినుప‌, వేరుశనగ గుండ్లు, సోయాబీన్లను ఎంఎస్‌పీల‌ విలువ గ‌ల రూ. 1050.08 కోట్ల‌ లబ్ధి చేకూర్చింది. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, రాజస్థాన్లలో దాదాపు 1,08,310 మంది రైతులకు ల‌బ్ది చేకూర్చింది. అదే విధంగా 19.12.2020 నాటికి రూ.52.40 కోట్ల ఎంఎస్‌పీ విలువ కలిగిన 5089 మెట్రిక్ టన్నుల కొబ్బ‌ర‌ను (శాశ్వత పంట) కర్ణాటక, తమిళనాడుల నుంచి సేక‌రించారు. 3961 మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. కోప్రా, ఉరాద్‌లను ప్రధానంగా ఉత్పత్తి చేసే చాలా రాష్ట్రాల్లో రేట్లు ఎంఎస్‌పీ కంటే త‌క్కువగా ఉన్నాయి. ఖరీఫ్ పప్పుధాన్యాలు, నూనెగింజలకు సంబంధించి రాక ఆధారంగా ఆయా రాష్ట్రాలు నిర్ణయించిన తేదీ నుండి సంబంధిత రాష్ట్ర/ యుటీలు ప్రభుత్వాల‌ సేకరణ ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.

3.JPG

పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో ఎంఎస్‌పీ ఆధ్వర్యంలో సీడ్ కాటన్ (కపాస్) సేకరణ కార్యకలాపాలు సజావుగా జరుగుతున్నాయి.19.12.2020 వరకు రూ.16865.81కోట్ల విలువైన 5783122 కాటన్ బేళ్ల‌ను 1124252 మంది రైతులకు లబ్ధి చేకూర్చాయి.

4.JPG

*****

 



(Release ID: 1682306) Visitor Counter : 212