సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌తో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ ఆర్.కె.మాథుర్‌ భేటీ

Posted On: 11 NOV 2020 6:52PM by PIB Hyderabad

లద్ధాఖ్ కేంద్రపాలిత ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ ఆర్‌.కె.మాథుర్ ఈ రోజు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర హోదా), ప్ర‌ధాన మంత్రి కార్యాల‌య శాఖ‌, సిబ్బంది, ప్రజా మనోవేదనలు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ‌ల స‌హాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌తో భేటీ అయ్యారు. కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ప‌లు సమస్యల‌పై చ‌ర్చించారు. ల‌ద్దాఖ్ అటాన‌మ‌స్ హిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కౌన్సిల్ (ఎల్ఏహెచ్‌డీసీ) ఎన్నిక‌ల తరువాత ప్రస్తుత పరిస్థితుల గురించి, కేంద్ర ప్ర‌భుత్వం నిధుల‌తో చేప‌డుతున్న వివిధ ప్రాజెక్ట్స్ పురోగ‌తిని గురించి కేంద్ర మంత్రికి లెఫ్టినెంట్ గవర్నర్ వివ‌రించారు. ఎల్ఏ‌హెచ్‌డీసీకి ఎన్నికల్ని విజయవంతంగా, శాంతియుతంగా నిర్వహించినందుకు శ్రీ మాథుర్‌ను డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. ఈ విష‌య‌మై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలను కూడా ఆయన లెఫ్టినెంట్ గవర్నర్‌కు తెలియజేశారు. ల‌ద్దాఖ్ ఒక ప్ర‌త్యేక కేంద్ర‌పాలిత ప్రాంతంగా ఏర్ప‌డిన తరువాత ఇదే మొదటి ఎన్నికల క‌స‌ర‌త్తు కాబట్టి ఈ ఎన్నికలు ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని ఆయన అన్నారు. వివిధ ప్రాజెక్టులపై చర్చిస్తూ మంత్రి డాక్టర్ జతేంద్ర సింగ్ మాట్లాడుతూ లద్దాఖ్‌తో స‌హా ఇతర పరిధీయ ప్రాంతాలకు మ‌న ప్రధాని నరేంద్ర మోడీ అధిక ప్రాధాన్యతనిస్తున్నార‌ని అన్నారు. మోడీ ప్రభుత్వ హయాంలోనే తొలిసారిగా లద్దాఖ్‌కు విశ్వవిద్యాలయాన్ని మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేసినట్లు  తెలిపారు. సి.ఎస్.ఐ.ఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ మండే "‌లద్దాఖ్ బెర్రీ" అని పిలువబడే ప్రసిద్ధ లద్దాఖ్ పండ్ల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి.. ప్రాసెస్ చేయడానికి, వ్యాపారం చేయడానికి వీలుగా ఒక ప్రత్యేక ప్రణాళికను త‌యారు చేశార‌ని డాక్టర్ జితేంద్ర సింగ్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు తెలియజేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన విధంగా "కార్బన్ న్యూట్రల్‌‌ లద్దాఖ్ కోసం విధానం మరియు కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం గురించి శ్రీ మాథుర్ డాక్టర్ జితేంద్ర సింగ్కు తాజా స్థితిని వివ‌రించారు. కేంద్ర భూభాగపు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికపై ఉత్సాహంగా పని చేస్తోందని, ఇది ఉన్నతాధికారుల ముందు ఉంచడానికి సిద్ధంగా ఉందని ఆయన మంత్రికి వివ‌రించారు. "లద్దాఖ్ విజన్ 2050" పేరుతో స‌మ్మిళిత కార్యాచరణ ప్రణాళిక గురించి ఆయన తాజా స్థితిని గురించి తెలియ‌జేశారు. లద్ధాఖ్ కోసం 50 కోట్ల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ప్రస్తావించారు, ఈ ప్రాంతానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడంలో కేంద్ర ప్రభుత్వమూ ఇంత ఉదారంగా వ్యవహరించడం ఇదే మొదటిసార‌ని అన్నారు. లద్దాఖ్ ప్రాంతానికి ప్రత్యేకంగా కేటాయించిన రోడ్‌మ్యాప్‌లో ఇది మొదటిది అని ఆయన అన్నారు. నిరంతర సహకారానికి మరియు లద్దాఖ్ సంబంధిత విషయాలసౌ కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలతో రోజువారీ సమన్వయానికి గాను లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మాథుర్ కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

 


                               

<><><><><>



(Release ID: 1672122) Visitor Counter : 131