ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కేంద్ర మంత్రి డా.జితేంద్ర సింగ్‌తో సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌ సమావేశం

Posted On: 08 NOV 2020 8:16PM by PIB Hyderabad

కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి డా.జితేంద్ర సింగ్‌తో సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌ దిల్లీలో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని వివిధ కేంద్ర ప్రాజెక్టులపై చర్చించారు. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితి, వర్షాలు, వరదల సహాయక చర్యలు, పునరావాసంపై ఏరోజుకారోజు వివరాలు తెలుసుకుని తగిన చర్యలు తీసుకున్నందుకు కేంద్ర మంత్రికి, ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

 

    అరగంట పాటు సాగిన సమావేశంలో రెండు ప్రతిపాదనలు కేంద్ర మంత్రికి తమాంగ్‌ సమర్పించారు. అందులో ఒకటి, ఆకాంక్షిత జిల్లాల్లో ఒకటిగా చకుంగ్‌కు సంబంధించినది. కొవిడ్‌ సమయంతోపాటు, అన్‌ సీజన్‌లోనూ సిక్కింలో భారీగా కొనసాగుతున్న పర్యాటకం గురించి కూడా కేంద్ర మంత్రికి సీఎం ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌ వివరించారు.

***



(Release ID: 1671324) Visitor Counter : 109