వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

2020 -21 ఖరీఫ్ మార్కెటింగ్ కాలంలో లక్ష్యాల మేరకు సాగుతున్న కనీస మద్దతు ధరకు పంటల సేకరణ

Posted On: 27 OCT 2020 4:31PM by PIB Hyderabad

ప్రస్తుత 2020-21 ఖరీఫ్ పంటకాలంలో ఖరీఫ్ పంటలను ప్రభుత్వం గత సీజన్ లలో మాదిరిగానే అమలులో ఉన్న కనీస మద్దతు ధర పథకాల కింద కొనుగోలు చేస్తున్నది     

 

 

రైతుల నుంచి వరిని కొనుగోలు చేసే కార్యక్రమం రాస్త్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో లక్ష్యాల మేరకు చురుగ్గా సాగుతున్నది .ప్రస్తుత ఖరీఫ్ 2020-21 సీజన్లో 2020 అక్టోబర్ 26 వ తేదీనాటికి పంజాబ్, హర్యానా , ఉత్తరప్రదేశ్ , తమిళనాడు, ఉత్తరా ఖండ్ , చండీఘర్, జమ్మూ కాశ్మీర్, కేరళ మరియు గుజరాత్ రాష్ట్రాలలో రైతుల నుంచి 159.55 లక్షల మిలియన్  టన్నులకు పైగా వరిని కొనుగోలు చేయడం జరిగింది. గత ఏడాది ఇదే సమయానికి రైతుల నుంచి 134.52 లక్షల మిలియన్ టన్నుల వరిని కొనుగోలు చేశారు. గత ఏడాదితో పోల్చే చూస్తే ఈ ఏడాది సేకరణ ఇంతవరకు 18.61% పెరిగింది. ఈ సీజన్లో ఇంతవరకు సేకరించిన మొత్తం 159.55 లక్షల మిలియన్ టన్నుల వరిలో 67.57 శాతం అంటే 107.81 లక్షల మిలియన్ టన్నులను ఒక్క పంజాబ్ రాష్ట్రంలోనే కొనుగోలు చేయడం జరిగింది. మెట్రిక్ టన్నుకు 18880 రూపాయలను చెల్లిస్తూ ఇంతవరకు 30123.73 73 కోట్ల రూపాయల విలువ చేసే వరిని 13.64 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగించడం జరిగింది.

ఇంతే కాకుండా రాష్ట్రాల నుంచి అందిన ప్రతిపాదనల మేరకు రైతుల నుంచి 45.10 లక్షల మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలు, నూనె గింజలను కనీస మద్దతు ధర పధకం (పి ఎస్ ఎస్ ) కింద కొనుగోలు చేయడానికి తమిళనాడు,కర్ణాటక,మహారాష్ట్ర, తెలంగాణా, హర్యానా, గుజరాత్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ , రాజస్థాన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనుమతి ఇవ్వడం జరిగింది. దీనితోపాటు 1.23 లక్షల మిలియన్ టన్నుల ఎండు కొబ్బరిని రైతుల నుంచి కొనుగోలు చేయడానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలకు అనుమతులు జారీ అయ్యాయి.

 ప్రతిపాదనలు అందిన వెంటనే ఇతర రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు కనీస ధర మద్దతు పధకం కింద  పప్పు ధాన్యాలు,నూనె గింజలు, ఎండు కొబ్బరిని సేకరించడానికి అనుమతి మంజూరు చేయడం జరుగుతుంది. దీనివల్ల 2020 -21 ఖరీఫ్ పంట కాలంలో  నిర్ణీత గ్రేడ్ కలిగిన ఈ పంటలను నమోదు చేసుకున్నరైతుల నుంచి ఆయా రాష్ట్రాలలో కనీస మద్దతు ధర కన్నా మార్కెట్ ధర తగ్గినప్పుడు కేంద్రం నియమించే నోడల్ ఏజెన్సీల ద్వారా రాష్ట్రాలు నియమించే సేకరణ ఏజెన్సీలు  కనీస మద్దతు ధరకు నేరుగా సేకరించడానికి అవకాశం కలుగుతుంది.

 

        2020 అక్టోబర్ 26 వ తేదీ వరకు ప్రభుత్వం తన నోడల్ ఏజెన్సీల ద్వారా తమిళనాడు,మహారాష్ట్ర మరియు హర్యానా రాష్ట్రాలలో 10.08 కోట్ల రూపాయల విలువ చేసే 1543.11 మిలియన్ టన్నుల  సెనగలు , మినుములు, వేరుశెనగ గింజలను సేకరించింది. దీనివల్ల 1247 మంది రైతులు లబ్ది పొందారు. ఇదేవిధంగా కర్నాటక మరియు తమళనాడులలో 3961 మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తూ వారినుంచి 52.40 కోట్ల రూపాయల విలువ చేసే 5089 మిలియన్ టన్నుల ఎండు కొబ్బరిని సేకరించడం జరిగింది. కొబ్బరి, మినుములు ఎక్కువగా సాగవుతున్న రాష్ట్రాలలో కనీస మద్దతు ధరల కంటే మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. సంబంధిత రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు  ఖరారు చేసే తేదీ నుంచి ఖరీఫ్ పప్పు ధాన్యాలు నూనె గింజలు మార్కెట్టుకు రావడం ప్రారంభించిన తరువాత సేకరణ కార్యక్రమం ప్రారంభం అవుతుంది.

          2020 -21 ఖరీఫ్ పంట కాలంలో పత్తిగింజల సేకరణ  సజావుగా సాగుతున్నది అక్టోబర్ 26 వ తేదీకి కనీస మద్దతు ధర పథకం కింద117675 లక్షల రూపాయల విలువ చేసే 398683 బేళ్ల పత్తిని 76512 మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తూ సేకరించడం జరిగింది.

 

****

 



(Release ID: 1667883) Visitor Counter : 127