సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
కోవిడ్ మహమ్మారి సమయంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణను సులభతరం చేయడానికి సాంస్కృతిక ఉత్సవాలు, కార్యక్రమాల కోసం వివరణాత్మక ఎస్.ఓ.పి. లను జారీ చేసిన - కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
Posted On:
15 OCT 2020 6:56PM by PIB Hyderabad
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన అన్ లాక్ 5.0 మార్గదర్శకాల ఆధారంగా, సృజనాత్మక పరిశ్రమలోని వివిధ భాగస్వాముల నుండి వచ్చిన సలహాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, కోవిడ్-19 యొక్క వ్యాప్తిని అరికట్టే నివారణ చర్యలపై “సాంస్కృతిక ఉత్సవాలు, కార్యక్రమాల” కోసం వివరణాత్మక ఎస్.ఓ.పి. లను ఈ రోజు విడుదల చేసింది
ఈ మార్గదర్శకాలలో థియేటర్లు, ప్రదర్శన స్థలాల యాజమాన్యాలతో పాటు, వినోదం / సృజనాత్మక ఏజెన్సీలు, కళాకారులు, సిబ్బంది లేదా ఆడిటోరియం లేదా ఇతర బహిరంగ స్థలాలను చెల్లింపు లేదా ఉచితంగా అద్దెకు తీసుకునే ఇతర వ్యక్తులు అనుసరించాల్సిన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు ఉన్నాయి. కళాకారులు, సిబ్బంది, మేకప్ గదుల నిర్వహణ, వేదిక నిర్వహణ, దుస్తులు, మేకప్ ట్రయల్స్, వేదిక, బహిరంగ స్థలాల్లో సీటింగ్తో సహా వేదిక యొక్క పారిశుద్ధ్యం మొదలైన వాటి కోసం సమగ్ర మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది.
కంటైన్మెంట్ జోన్లలో సాంస్కృతిక కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఇంకా, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు చేపట్టే క్షేత్ర స్థాయి అంచనాల ప్రకారం ప్రతిపాదించే అదనపు చర్యలను కూడా పరిగణించవచ్చు.
కోవిడ్-19 నిర్వహణ కోసం జాతీయ ఆదేశాలు మరియు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు మొదలైనవి జారీ చేసిన సంబంధిత మార్గదర్శకాలను అన్ని కార్యక్రమాలు, కార్యకలాపాల సమయంలో ఖచ్చితంగా పాటించాలి.
వెంటనే అమలులోకి వచ్చే ఈ మార్గదర్శకాలు, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొనసాగుతాయి.
కోవిడ్-19 యొక్క వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవలసిన చర్యలపై “సాంస్కృతిక ఉత్సవాలు, కార్యక్రమాలు” కోసం జారీచేసిన ఎస్.ఓ.పి. ల కోసం దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.
కోవిడ్-19 మహమ్మారి, ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక మరియు సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేసింది. అయితే, సాంస్కృతిక కార్యక్రమాలు నెమ్మదిగా తిరిగి ప్రారంభమవుతున్నాయి. సాంస్కృతిక సేవలను అందించే వ్యక్తులను, ఏజెన్సీలనూ, అలాగే అటువంటి సేవలను ఆస్వాదించే కళాభిమానులనూ ప్రోత్సహించడానికి, భారతదేశంలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలను తిరిగి ప్రారంభించడానికి వీలుగా, సమగ్ర మార్గదర్శకాలను రూపొందించడం చాలా ముఖ్యం.
కేంద్ర హోం మంత్రిత్వశాఖ, అన్ లాక్ మార్గదర్శకాలను, ఎప్పటికప్పుడు జారీ చేస్తోంది. సంబంధిత నగరాలు / రాష్ట్రాల్లోని కంటైన్మెంట్ జోన్ల నోటిఫికేషన్కు లోబడి, ఇవి అన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర అన్ని సంస్థలకు వర్తిస్తాయి. 2020 ఆగష్టు, 30వ తేదీ నాటి అన్ లాక్ 4.0 మార్గదర్శకాలు 2020 సెప్టెంబర్, 21వ తేదీ నుండి అమల్లోకి వచ్చే విధంగా, సామాజిక దూరం, పరిశుభ్రత మొదలైన అన్ని కోవిడ్-19 నియమ, నిబంధనలకు లోబడి, కంటైన్మెంట్ జోన్ల వెలుపల గరిష్టంగా 100 మంది వ్యక్తులతో సామాజిక / విద్యా / క్రీడలు / వినోదం / సాంస్కృతిక / మతపరమైన కార్యక్రమాలు మరియు ఇతర సమ్మేళనాలను అనుమతించాయి.
కేంద్ర హోం మంత్రిత్వశాఖ 2020 సెప్టెంబర్, 30వ తేదీన జారీ చేసిన, అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు ప్రస్తుతం అమలులో ఉన్నాయి.
సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి ఈ మార్గదర్శకాలలోని సంబంధిత భాగాన్ని [పేరా 1 (vii)] తిరిగి ఇక్కడ పొందుపర్చడం జరిగింది.
"సాంఘిక / విద్యా / క్రీడలు / వినోదం / సాంస్కృతిక / మత / రాజకీయ విధులు మరియు ఇతర సమ్మేళనాలు ఇప్పటికే గరిష్టంగా 100 మంది వ్యక్తులతో, కంటైనేషన్ జోన్ల వెలుపల మాత్రమే, అనుమతించబడ్డాయి. అయితే, 100 మంది పరిమితికి మించిన ఇటువంటి సమావేశాలను 2020 అక్టోబర్, 15వ తేదీ తర్వాత రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కంటైన్మెంట్ జోన్ల వెలుపల, ఈ క్రింది షరతులకు లోబడి అనుమతించవచ్చు : -
ఏ). మూసివేసిన ప్రదేశాలలో, 200 మంది వ్యక్తుల పరిమితికి లోబడి, హాలు సామర్థ్యంలో గరిష్టంగా 50 శాతం అనుమతించబడుతుంది. ముఖానికి మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, థర్మల్ స్కానింగుతో పాటు హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్ వాడకం తప్పనిసరి.
బి). బహిరంగ ప్రదేశాల్లో, స్థలం / భూమి యొక్క పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని, సామాజిక దూరాన్ని కఠినంగా పాటించడం, తప్పనిసరిగా ముఖానికి మాస్కులు ధరించడం, థర్మల్ స్కానింగుతో పాటు హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్ సదుపాయం ఉండాలి.
అటువంటి సమావేశాలను క్రమబద్ధీకరించడానికి , రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు వివరణాత్మక ఎస్.ఓ.పి. లను జారీ చేస్తాయి. వాటిని ఖచ్చితంగా అమలు చేస్తాయి. ”
*****
(Release ID: 1664949)
Visitor Counter : 136