వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఖరీఫ్ 2020 -21 పంట కాలంలో కనీస మద్దతు ధర

2020 అక్టోబర్ 13 వరకు 4 .80 లక్షల రైతుల నుంచి 10,500.72 కోట్ల విలువ చేసే 55.61 లక్షల మిలియన్ టన్నుల పంటల సేకరణ

Posted On: 14 OCT 2020 6:17PM by PIB Hyderabad

         2020 -21 ఖరీఫ్ పంట కాలం ప్రారంభం కావడంతో ప్రభుత్వం రైతుల నుంచి కనీస మద్దతు ధరకు గత ఏడాది అమలు చేసిన విధంగానే పంటలను సేకరించడం ప్రారంభించింది.

      భారత ఆహార సంస్థ ( ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ) మరియు ఇతర ప్రభుత్వ సంస్థల ద్వారా పంజాబ్, హర్యానా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్,కేరళ, జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాలలో  2020 -21 ఖరీఫ్ పంట కాలానికి ప్రారంభం అయిన వరి సేకరణ కార్యక్రమం వేగం పుంజుకొన్నది. ఇతర రాష్ట్రాలలో వరి సేకరణ త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. 2020 అక్టోబర్ 13 నాటికి 10,500.72 కోట్ల రూపాయలు పైగా విలువ చేసే  55.61 లక్షల మిలియన్ టన్నుల వరిని  4 .80 లక్షల మంది  రైతుల నుంచి సేకరించడం జరిగింది.

 

         ఇంతేకాకుండా రాష్ట్రాల నుంచి అందిన ప్రదిపాదనల మేరకు 2020 -21 ఖరీఫ్ పంట కాలంలో 41.67 లక్షల మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలను,నూనె గింజలను సేకరించడానికి తమిళనాడు,కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణా, గుజరాత్, ఒడిషా, రాజస్థాన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనుమతి మంజూరు చేయడం జరిగింది. దీనితోపాటు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలకు 1.23 లక్షల మిలియన్ టన్నుల కొబ్బరిని సేకరించడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రతిపాదనలు అందిన వెంటనే ఇతర రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు ధర మద్దతు పధకం కింద అనుమతి మంజూరు చేయడం జరుగుతుంది. దీనివల్ల 2020 -21 ఖరీఫ్ పంట కాలంలో  నిర్ణీత గ్రేడ్ కలిగిన ఈ పంటలను నమోదు చేసుకున్నరైతుల నుంచి ఆయా రాష్ట్రాలలో కనీస మద్దతు ధర కన్నా మార్కెట్ ధర తగ్గినప్పుడు కేంద్రం నియమించే నోడెల్ ఏజెన్సీల ద్వారా రాష్ట్రాలు నియమించే సేకరణ ఏజెన్సీల ద్వారా  కనీస మద్దతు ధరకు నేరుగా సేకరించడానికి అవకాశం కలుగుతుంది.

        2020 అక్టోబర్ 13 వ తేదీ వరకు ప్రభుత్వం తన ఏజెన్సీల ద్వారా తమిళనాడు,మహారాష్ట్ర మరియు హర్యానా రాష్ట్రాలలో 4.82 కోట్ల రూపాయల విలువ చేసే సెనగలు , మినుములను సేకరించింది.దీనివల్ల 611 మంది రైతులు లబ్ది పొందారు. ఇదేవిధంగా కర్నాటక మరియు తమళనాడులలో 3961 మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తూ వారినుంచి 52.40 కోట్ల రూపాయల విలువ చేసే 5089 మిలియన్ టన్నుల  కొబ్బరి, మినుములను సేకరించడం జరిగింది. ఈ పంటలను సాగు చేస్తున్న రాష్ట్రాలలో కనీస మద్దతు ధరల కంటే ఎక్కువగా ధరలు ఉన్నాయి. సంబంధిత రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు  ఖరారు చేసే తేదీ నుంచి ఖరీఫ్ పప్పు ధాన్యాలు నూనె గింజలు మార్కెట్టుకు రావడం ప్రారంభించిన తరువాత సేకరణ కార్యక్రమం ప్రారంభం అవుతుంది.

          2020 -21 ఖరీఫ్ పంట కాలంలో పత్తిగింజల అక్టోబర్ ఒకటవ తేదీన ప్రారంభం అయింది. అక్టోబర్ 14 వ తేదీకి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కనీస మద్దతు ధరకు 17860.56 లక్షల రూపాయల విలువ చేసే 63262 బేళ్ల పత్తిని 13077 మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తూ సేకరించింది.

***

 

 



(Release ID: 1664586) Visitor Counter : 181