ప్రధాన మంత్రి కార్యాలయం
లాహాల్-స్పితి లోని సిసులో ‘అభర్ సమరోహ్'లో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
నాడు పోస్టు చేయడమైనది:
03 OCT 2020 3:27PM by PIB Hyderabad
కేంద్ర మంత్రివర్గం లో నా సహచరుడు, శ్రీ రాజ్ నాథ్ సింగ్ జీ, హిమాచల్ ప్రదేశ్ లోకప్రియ ముఖ్యమంత్రి, సోదరుడు జైరాం ఠాకూర్, కేంద్రంలో నా తోటి మంత్రి, హిమాచల్ ప్రదేశ్ కు చెందిన అబ్బాయి, సోదరుడు అనురాగ్ ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్ మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు లాహాల్-స్పితి కి చెందిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా .
చాలా కాలం తర్వాత ఈ రోజు మీ అందరి మధ్యకి రావడం నాకు చాలా సంతోషకరమైన అనుభవం. అటల్ టన్నెల్ ప్రారంభం సందర్భంగా మీ అందరికీ అభినందనలు మరియు శుభాకాంక్షలు.
మిత్రులారా,
కొన్ని సంవత్సరాల క్రితం, మీ మధ్యకి నేను ఒక కార్యకర్తగా ఇక్కడకు వచ్చినప్పుడు, సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాతనే నేను రోహతాంగ్ చేరుకునేవాడిని. శీతాకాలంలో రోహ్తాంగ్ పాస్ మూసివేయబడినప్పుడు, వైద్యం, విద్య, సంపాదన వంటి అన్ని మార్గాలు కూడా ఎలా మూసివేయబడ్డాయో నేను చూశాను. ఆ సమయంలో నా సహోద్యోగులలో చాలామంది ఇప్పటికీ చురుకుగా ఉన్నారు. కొంతమంది సహచరులు ఇప్పుడు మన మధ్య లేరు.
కిన్నౌర్ కు చెందిన మన ఠాకూర్ సేన్ నేగీ గారు, ఆయనతో మాట్లాడటానికి, తెలుసుకోవటానికి మరియు చాలా నేర్చుకునే అవకాశం నాకు లభించింది, నేగి గారు హిమాచల్కు ఒక అధికారిగా మరియు ప్రజా ప్రతినిధిగా చాలా సేవలందించారు.. బహుశా అతను 100 సంవత్సరాలు పూర్తి చేసి ఉండవచ్చు,ఏమైనా మిగిలాయా? కానీ జీవితంలో చివరి వరకు, వారు చాలా చురుకుగా ఉన్నారు. ఆయన వ్యక్తిత్వం చాలా శక్తివంతమైనది, ఆయన చాలా స్పూర్తినిచ్చేవాడు. నేను ఆయనను చాలా అడుగుతూనే ఉండేవాడిని , అతను నాకు చాలా చెప్పేవాడు, అతను సుదీర్ఘ చరిత్రకు సాక్షి. మరియు ఈ మొత్తం ప్రాంతం గురించి తెలుసుకోవడంలో, అర్థం చేసుకోవడంలో వారు నాకు చాలా సహాయపడ్డారు.
మిత్రులారా,
అటల్ జీకి ఈ ప్రాంతంలోని అన్ని సమస్యల గురించి కూడా బాగా తెలుసు. ఈ పర్వతాలు అటల్ జీకి చాలా ప్రియమైనవి. 2000 సంవత్సరంలో, అటల్జీ కెలాంగ్కు వచ్చినప్పుడు మీ బాధలు తీర్చడానికి ఈ సొరంగమార్గాన్ని ప్రకటించారు. ఆ సమయంలో, ఈ ప్రాంతమంతా పండుగ వాతావరణంతో నిండి ఉండడం నాకు ఇప్పటికీ గుర్తుంది. దీనికి సాక్ష్యంగా, గొప్ప ప్రభుత్వ సేవకుడు తాషి దవా జీ, ఆయన సంకల్పం కూడా నేడు నెరవేరింది . ఆయన, ఇతర సహచరుల ఆశీస్సులతో ఇది సాధ్యమైంది.
మిత్రులారా,
అటల్ సొరంగమార్గం ఏర్పాటుతో లాహౌల్ ప్రజల జీవితాలలో నవోదయం వచ్చింది , పాంగి ప్రజల జీవితాలు కూడా మారబోతున్నాయి . 9 కిలోమీటర్ల ఈ సొరంగం నుండి నేరుగా 45-46 కిలోమీటర్ల దూరం తగ్గించబడింది. ఈ ప్రాంతంలోని అనేక మంది సహచరులు తమ జీవితకాలంలో ఈ అవకాశాన్ని కూడా పొందగలరనే విషయాన్ని ఎన్నడూ ఊహించలేదు. చలికాలం లో ఒక మార్గం కోసం వేచి చూసి, నొప్పి లో, ఆ బాధ అనుభవించిన వారు, ఎంతమంది రోగులనో చూసిన వారు ఈ ప్రజలు. నేడు, తమ పిల్లలు, కుమారులు మరియు కుమార్తెలు, ఇప్పుడు ఆ కష్టదినాలను చూడవలసిన అవసరం లేదని వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మిత్రులారా,
అటల్ సొరంగమార్గం ఏర్పాటుతో లాహాల్-స్పితి, పాంగి రైతులు, ఉద్యానవనంతో సంబంధం ఉన్న వ్యక్తులు, పశువుల పెంపకందారులు, విద్యార్థులు, వృత్తి నిపుణులు, వ్యాపారస్తులు, అందరూ లబ్ధి పొందబోతున్నారు. ఇప్పుడు లాహాల్ రైతుల క్యాబేజీ, బంగాళాదుంపలు మరియు బఠానీల పంటలు వృథా కాకుండా, వేగంగా మార్కెట్కు చేరుతాయి.
చంద్రముఖి ఆలూ లాహాల్ గుర్తింపుగా మారింది, నేను కూడా రుచి చూశాను. చంద్రముఖి బంగాళాదుంపకు కొత్త మార్కెట్లు కూడా లభిస్తాయి, కొత్త కొనుగోలుదారులు దొరుకుతారు, కొత్త మార్కెట్ దొరుకుతుంది. ఇప్పుడు, కొత్త కూరగాయలు మరియు కొత్త పంటల మాదిరిగా, ఈ ప్రాంతంలో ధోరణి వేగంగా పెరుగుతుంది.
లాహాల్-స్పితి ఔషధ మొక్కలు, అనేక సుగంధ ద్రవ్యాలు అయిన హింగ్, కుత్, మను, నల్ల జీలకర్ర, కడు, కుంకుమపువ్వు, పతిష్, వంటి వందల కొద్దీ మూలికలు ఉత్పత్తి చేస్తుంది. ఈ ఉత్పత్తులు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా లాహాల్-స్పితి, హిమాచల్, భారతదేశం యొక్క హాల్ మార్క్ గా గుర్తింపు తీసుకువస్తుంది.
అటల్ టన్నెల్ యొక్క మరో ప్రయోజనం ఏమిటంటే, మీ పిల్లల చదువుల కొరకు మీరు ఇక పై రాష్ట్రం వదిలి పోవాల్సిన అవసరం లేదు. ఈ సొరంగం మీ రాకపోకలను సులభతరం చేసింది.
మిత్రులారా,
ఈ మొత్తం ప్రాంతంలో పర్యాటకానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. ప్రకృతి యొక్క అపారమైన దయ కూడా ఉంది మరియు ఆధ్యాత్మికతతో, విశ్వాస సంబంధిత పర్యాటకానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. పర్యాటకుల కోసం, చంద్రతాల్ చాలా దూరంలో లేదు లేదా స్పితి లోయ చేరుకోవడం ఇప్పుడిక కష్టం కాదు. తుప్చిలింగ్ గోంపా అవ్వనివ్వండి ,త్రిలోకినాథ్ అయినా అవ్వనివ్వండి, దేవదర్శనం మరియు బౌద్ధ దర్శనాల సంగమంగా లాహాల్-స్పితి కొత్త రూపు సంతరించుకోబోతోంది. బదులుగా, ఇది బౌద్ధ మఠం మరియు టిబెట్, ఇతర దేశాలకు వ్యాపించి విస్తరించిన మార్గం.
దేశంలో బౌద్ధ విద్యకు ముఖ్యమైన కేంద్రమైన, స్పితి లోయలో ఉన్న టాబో మొనాస్టరీకి ప్రపంచానికి సులువుగా ప్రవేశం ఉంటుంది. మరియు ఒక విధంగా, ఈ మొత్తం ప్రాంతం తూర్పు ఆసియాతో సహా ప్రపంచంలోని అనేక దేశాల నుండి బౌద్ధ అనుచరులకు పెద్ద కేంద్రంగా మారబోతోంది.
ఈ సొరంగం యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. హోమ్ స్టే, గెస్ట్ హౌస్, ధాబా, హస్తకళలు ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి.
ఈ సొరంగం ఈ ప్రాంతంలోని యువతను అనేక ఉపాధి అవకాశాలతో కలుపుతుందని స్పష్టంగా తెలుస్తుంది. . ఇక్కడ హస్తకళ, పండ్లు, మందులు మరియు ఇక్కడ ఉన్న ప్రతిదీ యువతకు ఉపాధి అవకాశాలు కలగజేస్తుంది.
మిత్రులారా,
అభివృద్ధి యొక్క ప్రయోజనాలు దేశంలోని ప్రతి ప్రాంతంలోని ప్రతి వ్యక్తికి చేరాలనే కేంద్ర ప్రభుత్వ సంకల్పంలో అటల్ టన్నెల్ కూడా ఒక భాగం. లేకపోతే, ముందు పరిస్థితి ఏమిటో మీకు బాగా తెలుసు .
లాహాల్-స్పితి వంటివి దేశంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి, అవి అనేక సమస్యలతో పోరాడేలా తమ విధికి వదిలివేశారు. దీనికి సాధారణ కారణం ఏమిటంటే, ఈ ప్రాంతాలు కొంత మంది వ్యక్తుల రాజకీయ ఆసక్తిని నిరూపించలేదు.
మిత్రులారా,
గడచిన సంవత్సరాల్లో, దేశం కొత్త ఆలోచనతో పనిచేస్తోంది. ప్రతి ఒక్కరితో, ప్రతి ఒక్కరి విశ్వాసంతో, ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందుతున్నారు. ప్రభుత్వ పనిలో పెద్ద మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఎన్ని ఓట్లు ఉన్నాయో దాని ఆధారంగా ప్రణాళికలు రూపొందించబడటం లేదు. ఇప్పుడు ప్రయత్నం ఏమిటంటే, ఏ ఒక్క భారతీయడు కూడా అభివృద్ధిలో వెనుకబడి ఉండకూడదు.
ఈ మార్పుకు ఒక గొప్ప ఉదాహరణ లాహౌల్-స్పితి. ప్రతి ఇంటికి పైప్ డ్ వాటర్ అందించబడిన మొదటి జిల్లాల్లో ఇది ఒకటి. జలజీవన్ మిషన్ ప్రజల జీవితాలను ఎలా సులభతరం చేస్తుందో ఈ జిల్లా ఒక ప్రతీకగా మిగిలింది.
మిత్రులారా,
మన ప్రభుత్వం దళిత-బాధితుల-దోపిడీ-అణగారిన, గిరిజనులకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలనే సంకల్పంతో పనిచేస్తోంది. నేడు, దేశంలోని 15 కోట్లకు పైగా గృహాల్లో పైపుల ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయడానికి భారీ ప్రయత్నం జరుగుతోంది.
స్వాతంత్య్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు గడిచినా దేశంలో 18 వేలకు పైగా గ్రామాలు అంధకారంలో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు ఈ గ్రామాలలో వెలుగులు వచ్చాయి.
స్వాతంత్య్రం వచ్చిన దశాబ్దాల తరువాత ఈ ప్రాంతాల్లో మరుగుదొడ్డి సౌకర్యాలు వచ్చాయి , వంటకోసం ఎల్ పీజీ గ్యాస్ కనెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి.
ఇప్పుడు దేశంలోని సుదూర ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రాంతానికి మంచి వైద్యం అందడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ పథకం కింద పేదలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం కూడా అందించడం జరిగింది.
హిమాచల్ కి చెందిన 22 లక్షలకు పైగా పేద తోబుట్టువులు కూడా ఈ పథకాల ద్వారా ప్రయోజనం పొందడం ఖాయం. వివిధ పథకాల ద్వారా దేశంలోని సుదూర ప్రాంతాల్లో అనేక కొత్త ఉపాధి అవకాశాలు కూడా సృష్టించబడ్డాయి, ఇది యువతకు ప్రయోజనం చేకూర్చింది.
మిత్రులారా,
అటల్ టన్నెల్ రూపంలో అభివృద్ధికి కొత్త తలుపు ఇచ్చినందుకు లాహౌల్-స్పితి మరియు పాంగి వ్యాలీ సోదరులు, సోదరీమణులందరినీ మరోసారి అభినందిస్తున్నాను. దేశంలోని ప్రతి పౌరుడితో నేను ఈ మాట చెప్తున్నాను. కరోనా యొక్క ఈ క్లిష్ట సమయంలో మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మాస్క్ తప్పకుండా వాడండి, చేతుల శుభ్రతకు ప్రత్యేక శ్రద్ధ వహించండి.
ఈ చారిత్రాత్మక సంఘటనలో నేను కూడా ఓ భాగమైనందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను!
ధన్యవాదాలు !
(రిలీజ్ ఐడి: 1661488)
సందర్శకుల సూచీ సంఖ్య : : 163
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam