రాష్ట్రపతి సచివాలయం
మానవత్వానికి, దేశానికి సేవ చేయడం మన విలువైన వ్యవస్థ సంప్రదాయం: రాష్ట్రపతి కోవింద్
- జాతీయ సేవా పథకం అవార్డులను వర్చువల్ విధానంలో ప్రదానం చేసిన
రాష్ట్రపతి
Posted On:
24 SEP 2020 6:24PM by PIB Hyderabad
మానవత్వానికి, దేశానికి సేవ చేయడం మన విలువైన వ్యవస్థ సంప్రదాయం.
మన సంప్రదాయంలో దాని మూలాలు కలిగి ఉన్నాయి. ఇక్కడ సేవా ఉద్దేశ్యం యొక్క చిక్కులను అర్థం చేసుకోవడం మరియు అంచనా వేయడం కష్టమని
రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ అన్నారు. ఈ రోజు (24 సెప్టెంబర్, 2020) న్యూ ఢిల్లీలో జాతీయ సేవా పథకం అవార్డులను ప్రదానం కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మహాత్మా గాంధీ యొక్క ఉదాహరణను ఉటంకిస్తూ సేవ కేవలం మానవుల పట్ల మాత్రమే కాకండా ప్రకృతి వైపు కూడా ఉండాలని అన్నారు. మహాత్మా గాంధీ 100 వ జయంతి సందర్భంగా 1969 లో జాతీయ సేవా పథకాన్ని ప్రారంభించిన విషయాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ఈ పథకం ఈనాటికీ ఎంతో ప్రస్తుతాన్వయాన్ని కలిగి ఉంటూ కొనసాగుతోందని అన్నారు. కోవిడ్ మహమ్మారి పరీక్ష సమయాల్లో కూడా.. అవార్డుల ప్రదానాన్ని ఆయన ప్రశంసించారు. ఇందుకు గాను యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ చేసిన కృషిని ప్రశంసించారు. ఎన్ఎస్ఎస్ గురించి అధ్యక్షుడు కోవింద్ మాట్లాడుతూ "నేను కాదు, కానీ మీరు" అనే నినాదానికి అనుగుణంగా వివిధ చర్యల ద్వారా సమాజ సేవ కోసం స్వచ్ఛందంగా పాల్గొనేలా యువతను ప్రోత్సహిస్తున్న విషయాన్ని గుర్తించినట్టు ఆయన తెలిపారు. దేశంలోని వివిధ విద్యా సంస్థలకు చెందిన 40 లక్షల మంది విద్యార్థులు ఈ గొప్ప పథకంతో సంబంధం కలిగి ఉండటం ప్రోత్సాహకరమైన పరిణామమని ఆయన అన్నారు. ఇది మన దేశ భవిష్యత్తు సురక్షితమైన చేతుల్లో ఉందన్న భరోసా ఇస్తున్నట్లు ఆయన వివరించారు. యువ వాలంటీర్లు నిర్వహించే వివిధ కార్యకలాపాలకు ప్రాధాన్యతనిస్తూ కోవిడ్ 19 కాలంలో సామాజిక దూరం మరియు ముఖ మాస్క్ల సరైన వాడకం గురించి అవగాహన కల్పించడంలో వారు ఎంతో కీలక పాత్ర పోషించారని రాష్ట్రపతి అన్నారు. ఈ సమయాల్లో అవసరమైన మరియు ఇతర
క్వారంటయిన్లో ఉన్న రోగులకు ఆహారం ఇతర ఉపయోగకరమైన ఉత్పత్తులను అందించడంలో ఈ వాలంటీర్లు ఎంతగానో సహాయపడ్డారు. అంతేకాకుండా..
ఈ వాలంటీర్లు వరదలు మరియు భూకంప బాధితుల సహాయార్థం చేపట్టిన.. వివిధ ఉపశమనం మరియు పునరావాస చర్యలను కల్పించడంలో ఎల్లప్పుడూ హృదయపూర్వకంగా సహాయం చేశారు. మొత్తం 42 మంది అవార్డు గ్రహీతలలో 14 మంది బాలికలు ఉండడం ప్రోత్సాహాన్ని ఇస్తోందని దేశ అధ్యక్షుడు కోవింద్ ప్రశంసించారు. దేశానికి సేవ చేయడంలో సావిత్రిబాయి పూలే, కస్తూర్బా గాంధీ, మదర్ థెరిసా సంప్రదాయానికి మన దేశ మహిళలు కట్టుబడి ఉండి ముందుకు సాగుతున్నారని అన్నారు.
రాష్ట్రపతి ప్రసంగాన్ని హిందీలో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి..
***
(Release ID: 1658876)
Visitor Counter : 324