గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

వచ్చేనెల 7వ తేదీ నుంచి మెట్రో రైళ్లకు అనుమతి

Posted On: 29 AUG 2020 9:48PM by PIB Hyderabad

వచ్చేనెల 7వ తేదీ నుంచి మెట్రో రైళ్లు నడిపేందుకు కేంద్రం అనుమతించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని విడుదల చేసింది. దీనిపై వచ్చేనెల 1వ తేదీన, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని  మెట్రో సంస్థలతో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్చిస్తుంది.

    ప్రస్తుత వాస్తవ పరిస్థితుల దృక్కోణంలో ప్రామాణిక కార్యచరణ విధానాన్ని పరిశీలించాలని అందరు ఎండీలకు సూచనలు అందాయి. అందరి సలహాలపై వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశంలో చర్చించి, ప్రామాణిక కార్యాచరణను ఖరారు చేస్తారు.

****



(Release ID: 1649689) Visitor Counter : 84