రైల్వే మంత్రిత్వ శాఖ

బంగ్లాదేశ్‌కు 10 బ్రాడ్ గేజ్ లోకోమోటివ్‌ల‌ను అప్పగించిన భారతీయ రైల్వే

- ఈ లోకోమోటివ్‌లు బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న ప్రయాణ‌ మరియు సరుకు రవాణా రైలు కార్యకలాపాలను నిర్వహించడానికి సహాయపడతాయి

- పరస్పర విశ్వాసం మరియు గౌరవం ఆధారంగా భారత-బంగ్లాదేశ్‌లు లోతైన ‌సంబంధాలను క‌లిగి ముందుకు సాగిన అంశాన్ని ప్ర‌ధానంగా వివ‌రించిన‌‌ విదేశాంగ మంత్రి శ్రీ ఎస్.జైశంకర్

- రైలు నెట్‌వర్క్ అభివృద్ధిలో బంగ్లాదేశ్‌కు పూర్తి, స్థిరమైన మరియు అపరిమిత మద్దతునిస్తాంః
రైల్వే మరియు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి శ్రీ పియూష్ గోయల్

Posted On: 27 JUL 2020 4:21PM by PIB Hyderabad

10 బ్రాడ్ గేజ్ (బీజీ) లోకోమోటివ్‌ల‌‌ను బంగ్లాదేశ్‌కు అప్పంగించే కార్య‌క్ర‌మం ఈ రోజు జ‌రిగింది.
వ‌ర్చువ‌ల్ విధానంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ మరియు రైల్వే, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్‌లు ఫ్లాగ్‌ ఆఫ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ స‌హాయ మంత్రి శ్రీ సురేష్ సి. అంగాడి కూడా పాల్గొన్నారు. బంగ్లాదేశ్ రైల్వే మంత్రి ఎం.డి.నూరుల్ ఇస్లాం సుజన్ మరియు విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ అబుల్ కలాం అబ్దుల్ మోమెన్ల‌ బంగ్లాదేశ్ ప్రభుత్వం తరపున ఈ బీజీ లోకోమోటివ్లను అందుకున్నారు. 2019 అక్టోబర్‌లో గౌరవనీయ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత పర్యటన సందర్భంగా చేసిన ఒక ముఖ్యమైన వాగ్ధానం కింద‌ భారత ప్రభుత్వం ఈ రైల్వే లోకోమోటివ్‌లను అప్పగించ‌డం జ‌రిగింది. బంగ్లాదేశ్ రైల్వే యొక్క అవసరాలకు అనుగుణంగా, లోకోమోటివ్లను భారతదేశం తగిన విధంగా సవరించి అమ‌రిక‌లు చేసింది. ఈ లోకోమోటివ్‌లు బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న ప్రయాణీకుల మరియు సరుకు రవాణా రైలు కార్యకలాపాలను నిర్వహించడానికి సహాయపడతాయి. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ మాట్లాడుతూ “బంగ్లాదేశ్‌కు 10 లోకోమోటివ్‌ను అందజేసే ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. రెండు దేశాల మ‌ధ్య పార్శిల్ మ‌రియు కంటైన‌ర్ రైళ్లు ప్రారంభించ‌బ‌డిద‌ని


తెలుసుకోవ‌డం సంతోషంగా ఉంది. ఇది వ్యాపారాలకు కొత్త అవకాశాలను తెరుస్తుంది. రైలు ద్వారా వాణిజ్య కదలికలు నిర్ధారించబడినందుకు నేను సంతోషంగా ఉన్నాను. కోవిడ్ - 19 మహమ్మారి సమయంలో, ముఖ్యంగా పవిత్ర రంజాన్ మాసంలో నిత్యావసరాల సరఫరా నిర్ధారించబడింది.” పరస్పర విశ్వాసం మరియు గౌరవం ఆధారంగా లోతైన భారతదేశం-బంగ్లాదేశ్ సంబంధాలను ఆయన ఈ సంద‌ర్భంగా ఎత్తి చూపారు. కోవిడ్‌ మహమ్మారి ద్వైపాక్షిక సహకారం యొక్క వేగం తగ్గించలేదని ఆయ‌న‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ మాట్లాడుతూ “బంగ్లాదేశ్ రైల్వేల ఉపయోగం కోసం 10 బ్రాడ్గేజ్ లోకోమోటివ్‌ల‌ను అప్పగించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య కొనసాగుతున్న సరుకు రవాణా రైలు కార్యకలాపాలను నిర్వహించడానికి ఈ లోకోమోటివ్‌లు ఉపయోగపడతాయి అని అన్నారు. బంగ్లాదేశ్‌లో ఈ లోకోల వినియోగాన్ని నిర్ధారించడానికి స‌రిప‌డే విధంగా ఇవి సవరించబడ్డాయి. అభివృద్ధి మరియు వృద్ధిని సాధించడంలో సంబంధిత ప్రయత్నాలలో మేము చాలా ముందుకు సాగాము. గత కొన్నేళ్లుగా ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంలో భారత్, బంగ్లాదేశ్ చాలా ముందుకు వచ్చాయి. ఈ రోజు మన ద్వైపాక్షిక సంబంధం చాలా ఉత్తమమైనది. మా పొరుగు విధానం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ జీ యొక్క స‌బ్ కా సాథ్, స‌బ్ ‌కా వికాస్, స‌బ్‌కా విశ్వాస్‌ యొక్క దృష్టిని అనుసరిస్తుంది.


భారతదేశం & బంగ్లాదేశ్ రెండింటి నాయకత్వం 1965 కి పూర్వం ఇరు దేశాల మధ్య రైల్వే కనెక్షన్‌ను పునరుద్ధరించడానికి కట్టుబడి ఉంద‌ని అన్నారు. గ‌తంలో ఉనికిలో ఉన్న 7 రైలు లింకులలో 4 ఇప్పుడు పనిచేస్తున్నాయి. ఈ ప్రాంతంలో రైలు కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి, భారతదేశంలోని అగర్తాలా మరియు బంగ్లాదేశ్‌లోని అఖౌరా మధ్య ఒక కొత్త రైలు మార్గంను గ్రాంట్ అసిస్టెన్స్ ఆఫ్ ఇండియా ఆర్థిక స‌హ‌కారంతో నిర్మిస్తున్నారు. కోవిడ్‌-19 సమయంలో, రెండు రైల్వేలు సంక్షోభాన్ని నిర్వహించ‌డంలో ఆదర్శప్రాయమైన దూరదృష్టిని చూపించాయి మరియు అవసరమైన వస్తువుల రవాణాను పెంచడం ద్వారా సరఫరా గొలుసును కొనసాగించాయి. పార్శిల్‌ రైలు మరియు కంటైనర్ రైలు సేవలను బంగ్లాదేశ్‌లోని బెనాపోల్ ద్వారా ప్రవేశపెట్టారు అని అన్నారు. ఈ రెండు సేవలు ఇప్పటికే జులై నెలలో ప్రారంభమయ్యాయి. ఇవి రెండు వైపుల నుండి విస్తృత ఉత్పత్తులను తరలించడానికి సహాయపడ్డాయి. ఇది ఇరు దేశాలు మన ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఎటువంటి అంతరాయం మరియు ఆరోగ్య ప్రమాదం లేకుండా కొనసాగించగలవని రైల్వే నిర్ధారించింది. రెండు రైల్వేలు ప్రజలకు మంచి భవిష్యత్తును నిర్ధారిస్తున్నాయి” అని అన్నారు. తన ప్రసంగంలో, భారత రైల్వే తరపున, శ్రీ పియూష్ గోయల్ బంగ్లాదేశ్ రైల్ నెట్‌వర్క్ అభివృద్ధిలో బంగ్లాదేశ్‌కు పూర్తి, స్థిరమైన మరియు అపరిమిత మద్దతును అందిస్తామ‌ని అన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం మరియు కనెక్టివిటీని పెంచడంలో మరియు ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత పెంచడంలో రైల్వే సహకారం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ఇటీవలి కాలంలో, కోవిడ్‌ మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడంలో భారతదేశం మరియు బంగ్లాదేశ్ తమ రైలు సహకారాన్ని వేగవంతం చేశాయి, ఎందుకంటే భూ సరిహద్దు ద్వారా వాణిజ్యం అంతరాయాలను ఎదుర్కొంది. తక్కువ‌ ఖర్చుతో కూడుకున్న మరియు పర్యావరణ అనుకూల పరిష్కారంగా రైలు సరిహద్దులో అవసరమైన వస్తువులను రవాణా చేయడంలో సహాయపడింది. జూన్ నెలలో సరుకు రవాణా రైళ్ల మార్పిడిని ఇరుపక్షాలు చూశాయి. మొత్తం 103 సరుకు రవాణా రైళ్లను అవసరమైన వస్తువులు మరియు ముడి పదార్థాలను తీసుకెళ్లడానికి ఉపయోగించారు. ఇటీవల, భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య పార్శిల్ మరియు కంటైనర్ రైలు సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి. ఇది ద్వైపాక్షిక వాణిజ్యం యొక్క పరిధిని గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నాము.

 

***



(Release ID: 1641731) Visitor Counter : 222