రక్షణ మంత్రిత్వ శాఖ
ఆపరేషన్ సముద్ర సేతు
ఇరాన్లో చిక్కుకుపోయిన 687 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చిన ఐఎన్ఎస్ జలాశ్వ
Posted On:
01 JUL 2020 9:08PM by PIB Hyderabad
ఆపరేషన్ సముద్ర సేతు కోసం భారత నౌకాదళం వినియోగిస్తున్న ఐఎన్ఎస్ జలాశ్వ, ఇరాన్లోని బందర్ అబ్బాస్ నుంచి 687 మంది భారతీయులను స్వదేశానికి చేర్చింది. జులై 1న (బుధవారం) ఉదయం ట్యుటికోరిన్ హార్బర్కు వీరందరినీ చేర్చింది. వీరితో కలిపి మొత్తం 920 మందిని ఇరాన్ నుంచి స్వదేశానికి అధికారులు తీసుకొచ్చారు.
ఇరాన్లోని భారత అధికార యంత్రాంగం, భారతీయులను స్వదేశానికి చేర్చే ఏర్పాట్లు చేశారు. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాకే ప్రయాణీకులను నౌకలోకి అనుమతించారు. సముద్ర ప్రయాణంలో, కొవిడ్ సంబంధ రక్షణ ప్రొటోకాల్ కచ్చితంగా అమలు జరిగేలా చూశారు.
ట్యుటికోరిన్లో ప్రయాణీకుల ఆరోగ్య పరీక్షలు, ఇమ్మిగ్రేషన్, రవాణా కార్యక్రమాలు వేగంగా పూర్తయ్యేలా స్థానిక అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఈ తరలింపుతో, భారత నౌకాదళం 3992 మంది భారతీయులను మాల్దీవులు, శ్రీలంక, ఇరాన్ నుంచి స్వదేశానికి తీసుకొచ్చింది.
****
(Release ID: 1635993)