రైల్వే మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 నిరోధానికి చేపట్టిన అదనపు చర్యలపై భారతీయ రైల్వేల ప్రకటన
కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తి నిరోధం దిశగా కింద పేర్కొన్న విధంగా తాము చేపట్టిన అదనపు చర్యలను భారతీయ రైల్వేశాఖ ప్రకటించింది:
प्रविष्टि तिथि:
19 MAR 2020 3:42PM by PIB Hyderabad
- అనవసర ప్రయాణ నిరోధంతోపాటు దుర్బలవర్గంలోని వృద్ధపౌరుల అనవసర ప్రయాణాలను నిరుత్సాహపరిచేందుకు అన్నిరకాల రాయితీ టికెట్ల బుకింగ్ను తాత్కాలికంగా రద్దు చేయడమైనది. అయితే- రోగులు, విద్యార్థులుసహా రిజర్వుడు, అన్ రిజర్వుడు వర్గాల్లోని దివ్యాంగులకు రాయితీ బుకింగ్ కొనసాగుతుంది. మార్చి 20వ తేదీ అర్ధరాత్రి 12:00 గంటల నుంచి అమలులోకి రానున్న ఈ ఉత్తర్వులు తదుపరి ఆదేశాలు వచ్చేదాకా కొనసాగుతాయి.
- ముందుజాగ్రత్త చర్యగానూ, అవసరంలేని ప్రయాణ నిరోధంతోపాటు రైలుమార్గాల్లో రద్దీని తగ్గించడంకోసం స్వల్ప ప్రయాణిక రద్దీగల 155 జతల రైళ్లు 31.03.20 తేదీదాకా రద్దు చేయబడ్డాయి. ప్రజల ప్రయాణ అవసరానికి తగిన సంఖ్యలో ప్రత్యామ్నాయ రైళ్ల లభ్యత దృష్ట్యానేగాక ఏ ఒక్క ప్రయాణికుడూ ఎక్కడా చిక్కుకుపోయే పరిస్థితి ఏర్పడని రీతిలో ఈ రైళ్లను రద్దు చేయడమైనది. ఈ రైళ్లలో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులందరికీ పూర్తి సొమ్ము వాపసు చేయబడుతుంది.
- విద్యాసంస్థల ఆకస్మిక మూసివేతవల్ల ఉత్తర భారతంలో చిక్కుకుపోయిన తూర్పు-దక్షిణ-ఈశాన్య భారత ప్రాంతాలకు చెందిన విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లడం కోసం భారతీయ రైల్వేశాఖ అన్ని ఏర్పాట్లూ చేసింది.
- అవసరంలేని ప్రయాణాలు మానుకోవాలని ప్రయాణికులకు ఇప్పటికే సూచించబడింది. ప్రయాణం తప్పని పక్షంలో బయల్దేరేముందు జ్వరంవంటిది లేకుండా చూసుకోవాలని సలహా ఇవ్వబడింది. ప్రయాణంలో ఉండగా ఏ సమయంలోనైనా జ్వరం సోకినట్లు అనిపిస్తే చికిత్స కోసం రైల్వే సిబ్బందిని సంప్రదించి సహాయం పొందవచ్చు.
- కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో అనవసరపు రద్దీ నివారణ దిశగా తమ పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలో పరిస్థితిని సమీక్షించి, అవసరమైతే ఆయా స్టేషన్లలో ప్లాట్ఫామ్ టికెట్ ధరను రూ.50కి పెంచాల్సిందిగా డివిజనల్ రైల్వే మేనేజర్లను ఆదేశించడమైనది.
- రైల్వే స్టేషన్లలో, రైళ్లలో బహిరంగ ప్రకటన వ్యవస్థద్వారా ప్రజలకు అవగాహన కల్పించే దిశగా కింద పేర్కొన్న విధంగా పాటించాల్సిన జాగ్రత్తలు, నిర్లక్ష్యం చేయకూడని అంశాలు నిరంతరం వివరించబడుతున్నాయి:
- తరచూ కడుక్కోవడంద్వారా చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి;
- వ్యక్తుల మధ్య సామాజిక దూరం పాటించాలి; తుమ్ము లేదా దగ్గు వచ్చినపుడు నోటిని కప్పుకోవాలి;
- జ్వరంతో బాధపడుతున్నవారు తగిన ముందుజాగ్రత్తలు తీసుకోవాలి (ప్రయాణం మానుకోండి- వెంటనే వైద్యునివద్దకు వెళ్లండి);
- రైల్వే పరిసరాలతోపాటు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మకూడదు; అలాగే...
- సామాజిక దూరం పాటించడంలో భాగంగా శివారు రైళ్లుసహా అన్ని రైళ్లలోనూ ప్రయాణికులు గుంపుగా చేరకుండా చూసుకోవాలి.
****
(रिलीज़ आईडी: 1607233)
आगंतुक पटल : 149