ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఒఐసిఎల్‌ కు, ఎన్ఐసిఎల్ కు మ‌రియు యుఐఐసిఎల్ కు మూల‌ధ‌నాన్ని ఇవ్వాల‌న్న ప్ర‌తిపాద‌న కు ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 12 FEB 2020 3:53PM by PIB Hyderabad

మూడు ప్ర‌భుత్వ రంగ సాధార‌ణ బీమా కంపెనీల కు మూల‌ధ‌నాన్ని ఇచ్చేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం త‌న సూత్ర‌ప్రాయ ఆమోదాన్ని తెలిపింది.  ఆ కంపెనీ ల పేరు లు ఓరియంట‌ల్ ఇన్‌శ్యోరెన్స్ కంపెనీ లిమిటెడ్‌ (ఒఐసిఎల్‌), నేశ‌న‌ల్ ఇన్‌శ్యోరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐసిఎల్‌), యునైటెడ్ ఇండియా ఇన్‌శ్యోరెన్స్ కంపెనీ లిమిటెడ్ (యుఐఐసిఎల్). 

ఒఐసిఎల్‌, ఎన్ఐసిఎల్‌, యుఐఐసిఎల్ అనే ఈ మూడు ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ల ఆర్థిక ప‌రిస్థితి సంకటమైంది గా ఉన్నందువ‌ల్లను, నియంత్ర‌ణపరమైనటువంటి ప‌ర‌ప‌తి నియమాల ఉల్లంఘన జరిగినందువల్లను వెంటనే 2,500 కోట్ల రూపాయ‌ల ను విడుద‌ల చేసేందుకు మంత్రివ‌ర్గం అనుమ‌తి ని ఇచ్చింది.  


**



(Release ID: 1602989) Visitor Counter : 74


Read this release in: English , Urdu , Hindi , Kannada