రైల్వే మంత్రిత్వ శాఖ
రైల్వే రంగంలో ఇండియా, బొలీవియా మధ్యన కుదిరిన అవగాహన ఒప్పంద పత్రానికి కేబినెట్ ఆమోదం
Posted On:
12 JUN 2019 8:14PM by PIB Hyderabad
బయోసియానిక్ రైల్వే ఇంటిగ్రేషన్ కారిడార్ ప్రాజెక్ట్ కు సంబంధించిన సహకారంపై భారతదేశం, బొలీవియా దేశాలకు మధ్యన కుదిరిన అవగాహన ఒప్పందం పత్రానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ ఒప్పందం కారణంగా ఇరుదేశాల మధ్యన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, నిపుణుల మధ్యన సమావేశాలు, సెమినార్ల నిర్వహణ జరుగుతుంది. అంతే కాదు ఇరుదేశాలు ఉమ్మడిగా అంగీకరించిన సహకార కార్యక్రమాలు అమలవుతాయి.
ఈ ఎంఓయుపైన 2019 మార్చి నెలలో సంతకాలు జరిగాయి.
***
(Release ID: 1574492)
Visitor Counter : 87