మంత్రిమండలి

ప‌ర్య‌ట‌న రంగం లో భార‌తదేశాని కి మరియు అర్జెంటీనా కు మ‌ధ్య ఎంఒయు పై సంత‌కాల‌ కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం

Posted On: 13 FEB 2019 9:15PM by PIB Hyderabad

ప‌ర్య‌ట‌న రంగం లో భార‌త‌దేశం, అర్జెంటీనా లు ఒక అవ‌గాహ‌న పూర్వక ఒప్పంద ప‌త్రం (ఎంఒయు)పై సంత‌కాలు చేయడాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదించింది.  

ఈ ఎంఒయు పై సంతకాలు జరగడం ప‌ర్య‌ట‌న రంగం లో స‌హ‌కారాన్ని పెంపొందించుకోవ‌డానికిగాను భార‌త‌దేశం, అర్జెంటీనా లు ఒక వ్య‌వ‌స్థాగ‌త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం లో ఉభ‌య ప‌క్షాల కు సహాయ‌కారి కానుంది.


**



(Release ID: 1564546) Visitor Counter : 84