ప్రధాన మంత్రి కార్యాలయం

అధ్య‌క్షులు శ్రీ శీ జిన్ పింగ్ తో టెలిఫోన్ లో మాట్లాడి అభినంద‌న‌లు తెలిపిన‌ ప్ర‌ధాన మంత్రి

Posted On: 20 MAR 2018 5:31PM by PIB Hyderabad

చైనా ప్రజా గణతంత్రం అధ్య‌క్షులు, శ్రేష్ఠులైన శ్రీ శీ చిన్ ఫింగ్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు టెలిఫోన్ లో మాట్లాడారు.
చైనా ప్రజా గణతంత్రం అధ్య‌క్ష ప‌ద‌వికి మ‌రొక్క‌ మారు ఎన్నికైన శ్రీ శీ చిన్ ఫింగ్ ను ప్రధాన మంత్రి అభినందించారు. 
 
ఇరవై ఒకటో శ‌తాబ్దాన్ని ‘ఆసియా శ‌తాబ్దం’ గా సాకారం చేసుకోవాలంటే- శరవేగంగా వృద్ధి చెందుతున్న రెండు ప్ర‌ధాన శ‌క్తులైనటువంటి చైనా మరియు భార‌త‌దేశం ల మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాలు కీల‌క‌మ‌ని- ఉభ‌య నేత‌లు అంగీక‌రించారు.

అంతేకాకుండా ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాలు ముడి ప‌డి ఉన్న అంత‌ర్జాతీయ అంశాలలోను, ప్రాంతీయ అంశాల‌లోను తమ స‌న్నిహిత సంప్ర‌దింపుల‌ను కొన‌సాగించాల‌ని కూడా ఇరువురు నేతలు ఓ అంగీకారానికి వ‌చ్చారు.


***



(Release ID: 1525421) Visitor Counter : 106


Read this release in: English , Assamese , Gujarati , Tamil