• Sitemap
  • Advance Search
Economy

భారత నైపుణ్య వ్యవస్థకు మ‌రింత శ‌క్తి

Posted On: 15 JUL 2026 5:21PM

తరగతి గది నుంచి పరిశ్రమల వరకు ప్రభుత్వ కార్యక్రమాలు



భారతదేశ ప్రతిభా వ్యవస్థ విద్య, నైపుణ్య శిక్షణ, ఉపాధి, వ్యాపారాల‌ను అనుసంధానిస్తూ సమగ్రమైన విధానంతో అభివృద్ధి చెందుతోంది. విధానపరమైన సంస్కరణలు, ప్రతిష్టాత్మక కార్యక్రమాల ద్వారా పాఠశాల స్థాయి నుంచే పాఠ్యప్రణాళికల్లో వృత్తి విద్యా కోర్సులను చేర్చుతున్నారు. దీనితో పాటు నిరంతర నైపుణ్యాభివృద్ధికి, జీవితకాల అభ్యసనానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మారుతున్న శ్రామిక అవసరాలకు అనుగుణంగా పరిశ్రమల అవసరాలు, డిజిటల్ సాంకేతికతలు, కృత్రిమ మేధ‌, భవిష్యత్తుకు ఉపయోగపడే నైపుణ్యాల పెంపుపై ఈ వ్యవస్థ ఎక్కువగా దృష్టి పెడుతోంది. విద్యాసంస్థలు, పరిశ్రమలు, అంతర్జాతీయ సంస్థలు, సాంకేతిక రంగ ప్రముఖులతో బలమైన భాగస్వామ్యాలు నాణ్యమైన శిక్షణను, ఉపాధి అవకాశాలను విస్తృతం చేస్తున్నాయి. మహిళలు, చేతివృత్తిదారులు, గ్రామీణ ప్రాంతాలు, ఇతర వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టడం ద్వారా నైపుణ్యాభివృద్ధిని మరింత సమ్మిళితం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ కలిసి ఆర్థిక పరివర్తనకు, ప్రపంచ స్థాయి పోటీతత్వానికి, స్థిరమైన వృద్ధికి మద్దతుగా నిలిచే నైపుణ్యాలు, ఆవిష్కరణలు కలిగిన శ్రామిక శక్తిని సిద్ధం చేస్తున్నాయి.

భారత ప్రతిభా వ్యవస్థకు సాధికారత
'వికసిత్ భారత్ 2047' వైపు భారతదేశం సాగిస్తున్న ప్రయాణానికి బలమైన ప్రతిభా వ్యవస్థను నిర్మించడమే ప్రధాన పునాది. ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి, పోటీతత్వాన్ని పెంపొందించడానికి, సమానమైన అభివృద్ధిని సాధించడానికి నైపుణ్యం, ఉత్పాదకత, ఆవిష్కరణలు ఉన్న శ్రామిక శక్తి ఎంతో అవసరం. ప్రతిభను పెంపొందించుకోవడాన్ని ఒక జీవితకాల ప్రయాణంగా గుర్తిస్తూ ప్రభుత్వం సమగ్ర విధానాన్ని అవలంబించింది. ఇందులో పాఠశాలల్లో వృత్తి విద్య, శ్రామిక శక్తి నైపుణ్యాల పెంపు, అప్రెంటిస్‌షిప్‌లు, వ్యాపారాభివృద్ధి, మహిళా ఆధారిత నైపుణ్య శిక్షణ, జీవితకాల అభ్యసనం ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కలిసి అందరికీ సమాన అవకాశాలు కల్పించే, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా స్పందించే ఒక నైపుణ్య నిర్మాణాన్ని సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఉపాధి అవకాశాలను, శ్రామిక శక్తి ఉత్పాదకతను నిరంతరం కాపాడుకోవడానికి జీవితంలో ప్రతి దశలోనూ నైపుణ్యాభివృద్ధి ఎంతో కీలకం. ఇది భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్య కేంద్రంగా మార్చడంతో పాటు దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి, ప్రపంచ పోటీతత్వానికి దారి తీస్తుంది.
ప్రపంచ శ్రామిక మార్కెట్లు వేగంగా మారుతున్న తరుణంలో ఇటీవల నిరంతర నైపుణ్యాభివృద్ధి అవసరం మరింత ఎక్కువైంది. ఆటోమేషన్, కృత్రిమ మేధ‌, డిజిటలీక‌ర‌ణ‌, పర్యావరణ పరిరక్షణ చర్యలు, జనాభా మార్పులు పని స్వభావాన్ని మార్చేస్తున్నాయి. ఈ ధోరణులు సరికొత్త, మారుతున్న నైపుణ్యాలకు డిమాండ్‌ను సృష్టిస్తున్నాయి.



భారతదేశంలో పెరుగుతున్న నైపుణ్య సన్నద్ధత 2047 నాటికి అర్థవంతమైన ఉపాధితో కూడిన 100% నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని సాధించే అవకాశాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026 ప్రకారం.. ఉపాధి పొందే సామర్థ్యం 2020లో 46% ఉండగా, అది 2026 నాటికి 56.4 శాతానికి పెరిగింది. నిర్దేశిత నైపుణ్య శిక్షణ, సమ్మిళిత కార్యక్రమాల ప్రభావానికి ఇది నిదర్శనం. భవిష్యత్తు శ్రామిక శక్తికి పెరుగుతున్న డిమాండ్‌ను కంపెనీల నియామక ఉత్సాహం స్పష్టం చేస్తోంది.



నైపుణ్యాభివృద్ధి: ఒక ప్రాధాన్యత
నైపుణ్యాభివృద్ధి ఇప్పుడు భారతదేశ ఆర్థిక, సామాజిక పరివర్తనకు ఒక వ్యూహాత్మక స్తంభంగా మారింది. ఇది మారుతున్న శ్రామిక మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు అనుగుణంగా మారే సామర్థ్యాలను వ్యక్తులకు అందిస్తుంది. ఇది భారతదేశం తన జనాభా ప్రయోజనాలను ఉపయోగించుకోవడానికి, ప్రపంచ శ్రామిక డిమాండ్‌ను తీర్చడానికి, దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి తోడ్పడుతుంది.

A diagram of a role of skill development in indian economy



ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకెళ్ల‌డం: ఆర్థిక వృద్ధికి, సామాజిక అభివృద్ధికి నైపుణ్యాలు, విజ్ఞానమే ప్రాథమిక చోదకాలు. ఉపాధి అవకాశాలను, ఉత్పాదకతను పెంచడం ద్వారా నైపుణ్యాభివృద్ధి పేదరిక నిర్మూలనలో, స్థిరమైన పరిశ్రమల స్థాపనలో, విస్తృత వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది అధిక ఉత్పాదకత, విస్తరించిన ఉపాధి అవకాశాలు, పెరుగుతున్న ఆదాయాలతో కూడిన ఒక మంచి చక్రాన్ని సృష్టిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న నైపుణ్య అవసరాలకు అనుగుణంగా మారడం: వేగవంతమైన సాంకేతిక, జనాభా మార్పులు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను, శ్రామిక మార్కెట్లను పునర్నిర్మిస్తున్నాయి. ఆటోమేషన్, పర్యావరణ చర్యలు, డిజిటలైజేషన్, జనాభా మార్పులతో కూడిన ఈ మారుతున్న వాతావరణంలో పోటీ పడటానికి మన యువతకు భవిష్యత్తుకు ఉపయోగపడే నైపుణ్యాలను అందించడం, వారి నైపుణ్యాలను నిరంతరం పెంచడం ఎంతో అవసరం. ఐఎంఎఫ్ వారి 'ఏఐ సన్నద్ధత సూచీ'లో భారతదేశానికి 49.3 స్కోరు లభించింది. ఇది అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందుతున్న దేశాల సగటు స్కోరు 42.1 కంటే ఎక్కువ. కృత్రిమ మేధ‌ను స్వీకరించడానికి, దాని ద్వారా ప్రయోజనం పొందడానికి భారతదేశానికి ఉన్న బలమైన సన్నద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది.

జనాభా లబ్ధిని ఉపయోగించుకోవడం: భారతదేశంలో 54 శాతానికి పైగా జనాభా 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే. 62 శాతం మందికి పైగా పని చేసే వయస్సు (15–59 సంవత్సరాలు) గలవారే ఉన్నారు. ఈ జనాభా ప్రయోజనం దాదాపు 2040 వరకు కొనసాగుతుందని అంచనా. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే శ్రామిక శక్తిని నిర్మించడానికి నిర్దేశిత నైపుణ్య శిక్షణ ఎంతో అవసరం.

ప్రపంచ ప్రతిభ డిమాండ్‌ను తీర్చడం: భారతదేశం 2030 నాటికి 45 మిలియన్ల అదనపు నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేస్తుందని అంచనా. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 85 మిలియన్ల శ్రామిక శక్తి కొరత ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. నైపుణ్యం కలిగిన ప్రతిభ కోసం పెరుగుతున్న ప్రపంచ డిమాండ్‌ను తీర్చడానికి ఇది భారతదేశానికి ఒక గొప్ప అవకాశం. నైపుణ్యాభివృద్ధిలో జీవితకాల విధానాన్ని నిర్మించడం ఇందుకే ఎంతో అవసరం.

చిన్న వయస్సు నుంచే నైపుణ్యాల నిర్మాణం
చిన్న వయస్సులోనే నైపుణ్యాలను నేర్పించడం జీవితకాల ఉపాధికి, శ్రామిక శక్తి భాగస్వామ్యానికి, పరిశ్రమలకు ఉపయోగపడే నైపుణ్యాలకు బలమైన పునాది వేస్తుంది. చిన్న వయస్సు నుంచే నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది.

 

A diagram of a diagram of a companyAI-generated content may be incorrect.



సమగ్ర శిక్షా పథకం
సమగ్ర శిక్షా అనేది ప్రీ-స్కూల్ నుంచి పన్నెండో తరగతి వరకు పాఠశాల విద్య కోసం రూపొందించిన ఒక సమగ్ర కార్యక్రమం. సమాన అవకాశాలు, అభ్యసన ఫలితాల ద్వారా పాఠశాలల పనితీరును మెరుగుపరచడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ పథకం పాఠశాల విద్యను ఒక నిరంతర ప్రక్రియగా పరిగణిస్తుంది. ఇది విద్య కోసం నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యానికి(ఎస్‌డీజీ-4) అనుగుణంగా ఉంది. 2025 డిసెంబర్ నాటికి నైపుణ్య విద్యకు సంబంధించి ఈ పథకం వివిధ మైలురాళ్లను సాధించింది:

* మొత్తం 138 ఉద్యోగ పాత్రలను ఆమోదించారు. 25,140 పాఠశాలల్లో నైపుణ్య కార్యక్రమాలను అమలు చేసి 35.5 లక్షల మందికి పైగా విద్యార్థులను భాగస్వామ్యం చేశారు.

* ఈ పథకం కింద 'హబ్ అండ్ స్పోక్ మోడల్'ను అవలంబించారు. దీని ద్వారా హబ్ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న మౌలిక వసతులను సమీప పాఠశాలల(స్పోక్ పాఠశాలల) విద్యార్థులు నైపుణ్య శిక్షణ కోసం ఉపయోగించుకుంటారు. 975 స్పోక్ పాఠశాలలు దేశవ్యాప్తంగా మౌలిక వసతులను సద్వినియోగం చేస్తూ నైపుణ్య శిక్షణ పరిధిని విస్తరిస్తున్నాయి.

* పాఠశాలల్లో నైపుణ్య శిక్షణ మౌలిక వసతులను బలోపేతం చేయడానికి నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ(ఎంఎస్‌డీఈ) 1,200 వృత్తి విద్యా నైపుణ్య ప్రయోగశాలలను(ఒకేషనల్ స్కిల్ లాబ్స్) ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్‌లు 400 జవహర్ నవోదయ విద్యాలయాలు(జేఎన్‌వీలు), 200 ఏకలవ్య మోడల్ నివాస పాఠశాలల్లో(ఈఎంఆర్ఎస్‌లు) విస్తరించి ఉన్నాయి.

పీఎం శ్రీ పాఠశాలలు
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని అమలు చేయడానికి ప్రస్తుతం ఉన్న పాఠశాలలను బలోపేతం చేస్తూ 2022లో పీఎం శ్రీ పాఠశాలలను ప్రారంభించారు. ఈ పాఠశాలలు పొరుగున ఉన్న పాఠశాలలకు మార్గదర్శకత్వం వహించే ఆదర్శ సంస్థలుగా పనిచేస్తాయి. ఇవి 21వ శతాబ్దపు నైపుణ్యాలతో కూడిన విద్యార్థులను తయారు చేస్తూ నాణ్యమైన బోధనను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

* లక్ష్యంగా పెట్టుకున్న 14,500 పీఎం శ్రీ పాఠశాలల్లో 2026 జూన్ నాటికి 776 జిల్లాల్లో 13,092 పాఠశాలలను అభివృద్ధి చేశారు.

అటల్ టింకరింగ్ లాబొరేటరీస్
'భారతదేశంలో ప‌ది ల‌క్ష‌ల మంది పిల్లలను నూతన ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దాలి' అనే దృక్పథంతో అటల్ ఇన్నోవేషన్ మిషన్ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ లాబొరేటరీలను(ఏటీఎల్‌లు) ఏర్పాటు చేసింది. ఇది విద్యార్థులలో ఉత్సుకత, సృజనాత్మకత, ఆవిష్కరణల వైపు మొగ్గు చూపే నైపుణ్యాలను పెంపొందిస్తుంది. జూన్ 2026 నాటికి:

* 722 జిల్లాల్లో 10,000కు పైగా ఏటీఎల్‌లను ఏర్పాటు చేశారు.
* 1.1 కోట్లకు పైగా విద్యార్థులు ఇందులో భాగస్వాములయ్యారు.

స్కిల్లింగ్ ఫర్ ఏఐ రెడీనెస్(ఎస్ఓఏఆర్‌)
'స్కిల్లింగ్ ఫర్ ఏఐ రెడీనెస్'(ఎస్ఓఏఆర్‌) అనేది ఆరవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వివిధ కోర్సుల ద్వారా మారుతున్న ఏఐ నైపుణ్యాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మైక్రోసాఫ్ట్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, నాస్కామ్ భాగస్వామ్యంతో ఈ కోర్సులను అందిస్తున్నారు.

ఫిబ్రవరి 2026 నాటికి 'ఏఐ టు బి అవేర్', 'ఏఐ టు ఆస్పైర్', 'ఏఐ టు అక్వైర్', 'ఏఐ ఫర్ ఎడ్యుకేటర్స్' కోర్సులలో 2.30 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు.

నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఎస్‌క్యూఎఫ్‌)
నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఎస్‌క్యూఎఫ్‌) అనేది అభ్యసన ఫలితాల ఆధారంగా విద్యార్హతలను ఎనిమిది స్థాయిలుగా వర్గీకరించే ఒక సామర్థ్య ఆధారిత వ్యవస్థ. ఇది అధికారిక, అనధికారిక పద్ధతుల ద్వారా సాధించిన జ్ఞానం, నైపుణ్యాలు, అభిరుచి, బాధ్యత, ఆచరణాత్మక అనుభవాన్ని గుర్తిస్తుంది. ఈ వ్యవస్థ విద్యాభ్యాసం, వృత్తి విద్య, నైపుణ్య శిక్షణలను ఒకే నిర్మాణంలోకి తెస్తుంది. ఇది పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్య శిక్షణల మధ్య క్రెడిట్ ఆధారిత పురోగతిని అందిస్తూ జీవితకాల అభ్యసనానికి, కెరీర్ ఎదుగుదలకు తోడ్పడుతుంది.

యువ ఏఐ ఫర్ ఆల్
ఇండియా ఏఐ మిషన్ కింద ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ(ఎంఈఐటీవై) 2025 నవంబర్‌లో 'యువ ఏఐ ఫర్ ఆల్'ను ప్రారంభించింది. ఇది పౌరులందరికీ, ముఖ్యంగా యువతకు ఏఐ ప్రాథమిక అంశాలను పరిచయం చేసే ఉచిత 4.5 గంటల ఆన్‌లైన్ కోర్సు. ఫ్యూచర్‌స్కిల్స్ ప్రైమ్, ఐగాట్ కర్మయోగి వేదిక‌లలో అందుబాటులో ఉన్న ఈ కోర్సు ప్రాక్టికల్ లెర్నింగ్‌ను అందిస్తుంది. పూర్తి చేసిన వారికి భారత ప్రభుత్వం నుంచి ధ్రువ‌ప‌త్రం లభిస్తుంది.

* 2026 జూలై 8 నాటికి మొత్తం నమోదు చేసుకున్న వారి సంఖ్య 85.27 లక్షలుగా ఉంది.

విద్యాంజలి కార్యక్రమం
విద్యాంజలి అనేది సమాజం, ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసే ఒక కార్యక్రమం. ఇది వృత్తి నిపుణులు, పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు, ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, సీఎస్‌ఆర్ భాగస్వాములు, ప్రవాస భారతీయుల వంటి స్వచ్ఛంద సేవకులను పాఠశాలలతో అనుసంధానిస్తుంది. స్వచ్ఛంద సేవకులు మార్గదర్శకత్వం, కెరీర్ కౌన్సిలింగ్, నైపుణ్యాభివృద్ధి, ఇతర విద్యాసంబంధిత మద్దతు ద్వారా తమ వంతు సహకారాన్ని అందిస్తారు.
* 2026 జూన్ నాటికి 8,44,925 పాఠశాలలు ఇందులో చేరాయి.
* ఈ కార్యక్రమంలో 5,62,296 మంది స్వచ్ఛంద సేవకులు, 2,705 సీఎస్‌ఆర్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు నమోదయ్యాయి.
* ఈ పథకం ద్వారా 2.04 కోట్లకు పైగా విద్యార్థులు ప్రయోజనం పొందారు.

శ్రామిక శక్తి నైపుణ్యాల పెంపు, పునఃనైపుణ్యం
శ్రామిక మార్కెట్లు వేగంగా మారుతున్న కొద్దీ కొత్త నిపుణులకు మద్దతు ఇవ్వడానికి, మధ్య వయస్సులో కెరీర్ మార్పులను సులభతరం చేయడానికి నిరంతర నైపుణ్యాల పెంపు, పునఃనైపుణ్యం అవ‌స‌రంగా మారాయి. నిర్దేశిత కార్యక్రమాలు శ్రామిక శక్తికి ఉపాధి అవకాశాలను నిరంతరం అందిస్తూ పరిశ్రమలకు సిద్ధంగా ఉంచుతాయి.

స్కిల్ ఇండియా మిషన్
స్కిల్ ఇండియా మిషన్(ఎస్ఐఎం) పని చేసే వయస్సు ఉన్న జనాభాకు ఎన్ఎస్‌క్యూఎఫ్‌ ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ, అప్‌స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ సేవలను అందిస్తుంది. దీనికి దేశవ్యాప్తంగా రోజ్‌గార్ మేళాలు, స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ ద్వారా విస్తృత ప్రచారం లభిస్తోంది. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల(ఎస్‌డీసీ) విస్తృత వ్య‌వ‌స్థ‌ ద్వారా కూడా ఈ శిక్షణలను అందిస్తున్నారు. ఈ మిషన్ కింద ఉన్న ప్రధాన పథకాలు:
* ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకేవీవై),
* జన్ శిక్షన్ సంస్థాన్(జేఎస్ఎస్),
* నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్(ఎన్ఏపీఎస్‌),
* ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ల‌లో(ఐటీఐ) క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్(సీటీఎస్).

 



ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకేవీవై) అనేది ఒక ప్రముఖ స్వల్పకాలిక నైపుణ్య శిక్షణ కార్యక్రమం. తన నాలుగు దశల ప్రయాణంలో ఇది ప్రారంభంలో ఒక చిన్న ప్రోత్సాహక ఆధారిత సర్టిఫికేషన్ కార్యక్రమం నుంచి భారీ స్థాయి, డిమాండ్ ఆధారిత, ఫలితాల వైపు సాగే నైపుణ్య వ్య‌వ‌స్థ‌గా ఎదిగింది. ప్రధాన విజయాలు కింద ఉన్నాయి:
* పీఎంకేవీవై 4.0 కింద 2026 జూన్ 30 నాటికి 36 రాష్ట్రాలు, 738 జిల్లాల్లోని 36 రంగాలలో 28.17 లక్షల మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చారు.
* 2024 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 మధ్యకాలంలో 21.91 లక్షల మందికి పైగా అభ్యర్థులు శిక్షణ పొందారు. ఇందులో ఐటీ-ఐటీఈఎస్, ఏరోస్పేస్ & ఏవియేషన్, వ్యవసాయం, రబ్బరు, తోలు, వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, నిర్మాణం, టూరిజం & హాస్పిటాలిటీ ప్రధాన రంగాలుగా ఉన్నాయి.
* పరిశ్రమల కొత్త అవసరాలను తీర్చడానికి ఈ పథకం 68 కస్టమైజ్‌డ్‌ కోర్సులను, 189 భవిష్యత్తు-నైపుణ్య ఉద్యోగ పాత్రలను ప్రవేశపెట్టింది.
* దేశవ్యాప్తంగా 6,800కు పైగా స్కిల్ హబ్‌లు సహా 16,900కు పైగా సంస్థలు పీఎంకేవీవై 4.0ని అమలు చేస్తున్నాయి.

జన్ శిక్షన్ సంస్థాన్(జేఎస్ఎస్) స్వచ్ఛంద సంస్థల ద్వారా నూతన అక్షరాస్యులకు, పాఠశాల మధ్యలో ఆపేసిన వారికి 100% ప్రభుత్వ నిధులతో సమాజ ఆధారిత, అనధికారిక నైపుణ్య శిక్షణను అందిస్తుంది. 31 మార్చి 2026 నాటికి ఈ పథకం సాధించిన ముఖ్యమైన మైలురాళ్లు:
* 2018 నుంచి 36.52 లక్షల మంది లబ్ధిదారులు శిక్షణ పొందారు.
* 4.8 లక్షల మంది గిరిజన లబ్ధిదారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు.
* జేఎస్‌ఎస్ కింద లబ్ధిదారులలో మహిళలు 82 శాతానికి పైగా ఉన్నారు.
* ఎన్ఎస్‌క్యూఎఫ్‌ స్థాయిలు 3, 3.5, 4 లలో 83 ఎన్‌సీవీఈటీ-ఆమోదిత కోర్సులను ప్రవేశపెట్టారు.
* స్థానిక అవసరాలకు ఉపయోగపడే టైలరింగ్, ఎంబ్రాయిడరీ, హస్తకళలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఆరోగ్య సేవలు వంటి కోర్సులు ఇందులో ఉన్నాయి.
* 2024 డిసెంబర్ నుంచి జేఎస్‌ఎస్ ఉత్పత్తులను 'ఉద్యమ్‌కార్ట్' పోర్టల్ ద్వారా విక్రయిస్తున్నారు. ఇది చేతివృత్తుల వారికి, సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు మార్కెట్ సదుపాయాన్ని మెరుగుపరిచింది.

నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్(ఎన్ఏపీఎస్‌) 'చదువుకుంటూ సంపాదించండి' నమూనా ద్వారా పరిశ్రమల నేతృత్వంలోని అప్రెంటిస్‌షిప్ శిక్షణను ప్రోత్సహిస్తుంది. న్యాప్స్ 2.0 కింద ప్రభుత్వం నెలకు గరిష్టంగా రూ.1,500 వరకు 25% స్టైపెండ్‌ను నేరుగా అప్రెంటిస్‌ల బ్యాంక్ ఖాతాకు అందిస్తుంది. మిగిలిన 75% స్టైపెండ్‌ను యజమాని చెల్లిస్తారు. 31 మార్చి 2026 నాటికి ఈ పథకం అందించిన ముఖ్యమైన సహకారం:
* 2016 నుంచి ఆటోమోటివ్, ఐటీ-ఐటీఈఎస్, ఎలక్ట్రానిక్స్, రిటైల్, తయారీ వంటి రంగాలలో 54.41 లక్షల మందికి పైగా అప్రెంటిస్‌లు నిమగ్నమయ్యారు.
* 2025–26 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 12.35 లక్షల మంది అప్రెంటిస్‌లు చేరగా, 6.42 ల‌క్ష‌ల‌ మంది ఆన్-ది-జాబ్ శిక్షణను పూర్తి చేశారు.
* 31 మార్చి 2026న ప్రారంభించినప్పటి నుంచి 1,32,000 ప్రొఫిషియెన్సీ సర్టిఫికేట్లు(సీఓపీ) జారీ చేశారు.
* 1 ఏప్రిల్ 2025 నుంచి 31 మార్చి 2026 మధ్యకాలంలో 40.10 లక్షల ప్రత్యక్ష ప్రయోజన బదిలీ(డీబీటీ) లావాదేవీల ద్వారా రూ.562.75 కోట్లకు పైగా నిధులు విడుదలయ్యాయి.

క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీమ్(సీటీఎస్‌) ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల‌(ఐటీఐ) ద్వారా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని అభివృద్ధి చేయడానికి దీర్ఘకాలిక వృత్తి విద్యా శిక్షణను అందిస్తుంది. మార్చి 2026 నాటికి ప్రధాన విజయాలు:
* 13,888 ఐటీఐల ద్వారా 169 కోర్సులలో శిక్షణ అందిస్తున్నారు.
* పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా గత 3 సంవత్సరాలలో 14 కొత్త సీటీఎస్ కోర్సులను ప్రవేశపెట్టారు. 22 ప్రస్తుత కోర్సులను సవరించారు.
* ఐటీఐ నమోదు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 12.51 లక్షలు ఉండగా అది 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి 14.70 లక్షలకు పెరిగింది.

పీఎం-సేతు
2025లో ప్రారంభించిన పీఎం-సేతు(ప్రధాన మంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్‌ఫార్మేషన్ త్రూ అప్‌గ్రేడెడ్ ఐటీఐలు) లక్ష్యాలు:
* 1,000 ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్లను(ఐటీఐ) ఆధునిక, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉండే నైపుణ్య సంస్థలుగా మార్చడం. ఈ ఐటీఐలను హబ్-అండ్-స్పోక్ క్లస్టర్ నమూనాలో ఆధునికీక‌రిస్తున్నారు. ఇక్కడ 200 హబ్ ఐటీఐలు 800 స్పోక్ ఐటీఐలతో అనుసంధానిస్తున్నారు.
* నైపుణ్యం కోసం 5 జాతీయ ఉత్కృష్టత కేంద్రాలను (నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్) ఏర్పాటు చేయడం.
* ఐదేళ్ల కాలంలో 20 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వడం.

సేవా రంగం, మల్టీ-స్కిల్ కోర్సులు, జీవనోపాధి పెంపునకు సంబంధించిన కోర్సులను ఇందులో ప్రవేశపెట్టారు. ఇది ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది, వృత్తి విద్యా శిక్షణను ప్రస్తుత, భవిష్యత్తు ఉద్యోగ మార్కెట్లకు అనుగుణంగా మారుస్తుంది.

* మే 2026 నాటికి, 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్ర స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేశాయి. వాటిలో 12 రాష్ట్రాలు పీఎం-సేతు కింద పరిశ్రమ భాగస్వాములను చేర్చుకోవడానికి ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్) ఆహ్వానించాయి.

* విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్ ద్వారా పీఎం-సేతును అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.

* ఒడిశా, గుజరాత్, తెలంగాణలోని ఐటీఐ క్లస్టర్ల కోసం రూ.1,237.58 కోట్ల విలువైన వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికల (సిప్‌) ఆమోదంతో ఈ కార్యక్రమం మరింత విస్తరించింది.

ఫ్యూచర్‌స్కిల్స్
ఇండియా ఏఐ మిషన్ కింద ఉన్న ఫ్యూచర్‌స్కిల్స్ పిల్లర్ బలమైన ఏఐ ప్రతిభా వ్యవస్థను నిర్మించడంతో పాటు భారతదేశమంతటా ఏఐ విద్యను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అండర్ గ్రాడ్యుయేట్ నుంచి పీహెచ్‌డీ స్థాయి వరకు ఉన్న విద్యార్థులకు మద్దతు ఇ
స్తుంది. ఈ కార్యక్రమం యూజీ, పీజీ, డ్యూయల్ డిగ్రీ, పీహెచ్‌డీ విద్యార్థులకు జాతీయ ఏఐ ఫెలోషిప్‌లను అందిస్తుంది. ప్రాక్టికల్ లెర్నింగ్‌ను ప్రోత్సహించడానికి టైర్ 2, టైర్ 3 నగరాల్లో 570 ఏఐ, డేటా ల్యాబ్‌లను కూడా ఏర్పాటు చేస్తోంది. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, తయారీ, విద్య వంటి రంగాలలో మార్కెట్ ఆధారిత, NCVET గుర్తింపు పొందిన ఏఐ కోర్సులను అందిస్తున్నారు.

ఫ్యూచర్‌స్కిల్ ప్రైమ్
ఫ్యూచర్‌స్కిల్స్ ప్రైమ్ అనేది నాస్కామ్ & ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా చేపట్టిన ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమం ఒక సులభమైన, ఆన్‌లైన్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా కొత్త, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో వ్యక్తులకు నైపుణ్య శిక్షణ, రీస్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్ సేవలను అందించడంపై దృష్టి పెడుతుంది.
* ఇది 2,800 కంటే ఎక్కువ కోర్సులను అందిస్తోంది, దీనికి 33 లక్షల కంటే ఎక్కువ మంది నమోదిత వినియోగదారులు ఉన్నారు.
* దీని పరిధి 41% మహిళా అభ్యర్థులకు, 740 టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించింది.

ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన
ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన(2025) ఈపీఎఫ్ఓలో నమోదైన మొదటిసారి ఉద్యోగులకు వారి ప్రారంభ అభ్యసన దశలో రెండు విడతల్లో ₹15,000 వరకు ఒకేసారి ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఈ పథకం నైపుణ్యాల పెంపు ఖర్చులను తగ్గిస్తుంది, ఉత్పాదకతను, ఉపాధి సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది కొత్తగా చేరిన వారికి అవసరమైన డబ్బు నిర్వహణ నైపుణ్యాలను నేర్పడానికి ఆర్థిక అక్షరాస్యతను కూడా ప్రోత్సహిస్తుంది. కనీసం ఆరు నెలల పాటు నిరంతర ఉపాధిని అందించే ప్రతి అదనపు ఉద్యోగి కోసం యజమానులకు కూడా రెండు సంవత్సరాల పాటు నెలకు రూ.3000 వరకు ఈ పథకం ప్రోత్సాహకాలను అందిస్తుంది.
* ఈ పథకం రూ.2,400 కోట్ల విలువైన ప్రోత్సాహకాల విడుదలతో 15 లక్షల ఉపాధి అవకాశాల సృష్టికి మద్దతు ఇచ్చింది(19 జూన్, 2026 నాటికి).

అంతర్జాతీయ, ప్రైవేట్ రంగ భాగస్వామ్యాల బలోపేతం
భారతదేశ నైపుణ్య వ్యవస్థను మార్చడంలో ప్రభుత్వ-ప్రైవేట్, అంతర్జాతీయ భాగస్వామ్యాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి పరిశ్రమలకు అనుగుణంగా ఉండే శిక్షణ, డిజిటల్ నైపుణ్యాలు, ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాలను ప్రోత్సహిస్తున్నాయి.

 

A screenshot of a cell phoneAI-generated content may be incorrect.


వ్యాపార‌ నైపుణ్యాల పెంపు
ఉద్యోగాల సృష్టి, ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధిలో వ్యాపారాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నైపుణ్య శిక్షణ విజయవంతమైన పరిశ్రమలను స్థాపించడానికి అవసరమైన సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది.

పీఎం విశ్వకర్మ
పీఎం విశ్వకర్మ పథకం సాంప్రదాయ కళాకారులు, చేతివృత్తిదారులకు నైపుణ్యాల పెంపు, టూల్‌కిట్ ప్రోత్సాహకాలు, రుణ సదుపాయం, మార్కెట్ అనుసంధానం ద్వారా సమగ్ర మద్దతును అందిస్తుంది. ఈ పథకం మహిళలు, వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, దివ్యాంగులు, హిజ్రాలు, ఈశాన్య ప్రాంతం, ద్వీప ప్రాంతాలు, కొండ ప్రాంతాల కళాకారులు ఉన్నారు. లబ్ధిదారులు నైపుణ్య శిక్షణ సమయంలో రోజుకు రూ.500 స్టైపెండ్ పొందుతారు.
* జూన్ 2026 నాటికి 24.50 లక్షల కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు ప్రాథమిక శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు.
* రూ.5,165.84 కోట్ల విలువైన రుణాలు మంజూరయ్యాయి.
* రూ.35 కోట్ల కంటే ఎక్కువ డిజిటల్ ప్రోత్సాహకాలు విడుదలయ్యాయి.

స్టార్టప్ ఇండియా కోర్సుల వివరాలు
స్టార్టప్ ఇండియా వేదిక‌లో నమోదైన వినియోగదారులందరికీ ప్రాక్టికల్ లెర్నింగ్, ఉచిత ఆన్‌లైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు ప్రోగ్రామింగ్, సెక్యూరిటీ, అకౌంటింగ్ & ఫైనాన్స్ నుండి మేనేజ్‌మెంట్, వ్యవస్థాపకత వరకు విస్తరించి ఉన్నాయి. ఈ కోర్సులు వినియోగదారులకు వ్యవస్థాపక జ్ఞానాన్ని అందించడంతో పాటు వారి సంస్థల నైపుణ్యాలను పెంచుకోవడానికి సహాయపడతాయి.

వ్యవస్థాపకత, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు
ఎంఎస్‌డీఈ తన స్వయంప్రతిపత్తి సంస్థల ద్వారా ఎంట్రప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు(ఈఏపీ), ఎంట్రప్రెన్యూర్‌షిప్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లను(ఈఎస్‌డీపీ) అమలు చేస్తుంది. నోయిడాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్‌మెంట్(ఎన్ఐఈఎస్‌బీయూడీ), గువహటిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్(ఐఐఈ) ఈ సంస్థలలో ఉన్నాయి. ఇది దేశవ్యాప్తంగా వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తుంది. వ్యవస్థాపక సంస్కృతిని పెంపొందిస్తుంది. ఈ సంస్థలు వ్యవస్థాపకత, నిర్వహణ శిక్షణ, మార్గదర్శకత్వం ద్వారా శిక్షణ అనంతర మద్దతు, సహాయం, ఇంక్యుబేషన్ మద్దతు ద్వారా వ్యవస్థాపకులకు సమగ్ర సహాయాన్ని అందిస్తాయి.

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ(ఎంఎస్ఎంఈ) ఎంట్రప్రెన్యూర్‌షిప్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు(ఈఎస్‌డీపీ) యువతను స్వయం ఉపాధి, వ్యవస్థాపకత వైపు ప్రోత్సహిస్తాయి. ఈ కార్యక్రమాలు సాంకేతిక, వ్యాపార నైపుణ్యాలను అందించడం ద్వారా ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, బీపీఎల్ లబ్ధిదారులపై దృష్టి పెడతాయి.

నైపుణ్యాల ద్వారా మహిళా సాధికారత
శ్రామిక శక్తిలో భాగస్వామ్యాన్ని, ఆర్థిక స్వతంత్రతను, సమాన వృద్ధిని పెంపొందించడానికి మహిళలకు నైపుణ్యాభివృద్ధి ఎంతో అవసరం. నిర్దేశిత నైపుణ్య కార్యక్రమాలు ఉపాధిలో లింగ వివక్షను తగ్గించడంతో పాటు మహిళలు వివిధ రంగాలలో అభివృద్ధి చెందుతున్న అవకాశాలను అందుకోవడానికి సహాయపడతాయి.

మహిళల కోసం ఏఐ కెరీర్లు
'ఏఐ కెరీర్ ఫర్ విమెన్' (2025) అనేది ఒక ఇంటెన్సివ్ 320 గంటల శిక్షణా కార్యక్రమం. గ్రామీణ డిగ్రీ కళాశాలల్లోని యువతులు, బాలికలకు భవిష్యత్తుకు ఉపయోగపడే ఏఐ నైపుణ్యాలను అందించి వారిని సాధికారులను చేయడం దీని ఉద్దేశం. ఈ కార్యక్రమం హబ్-అండ్-స్పోక్ నమూనాలో పనిచేసే 25 ఏఐ ఉత్కృష్టత కేంద్రాల (సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్) ద్వారా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో మహిళల భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తోంది.
* ఈ కార్యక్రమం 10,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులకు చేరుకుంది, ఇందులో హబ్ కళాశాలల్లో 2,500 కంటే ఎక్కువ మంది, స్పోక్ కళాశాలల్లో 7,500 కంటే ఎక్కువ మంది ఉన్నారు.

స్వావలంబిని
ఎంఎస్‌డీఈ, నీతి ఆయోగ్ మహిళా వ్యవస్థాపకత వేదిక‌తో కలిసి ఫిబ్రవరి 2025లో 'స్వావలంబిని - మహిళా వ్యవస్థాపకత కార్యక్రమం'ను ప్రారంభించింది. దీనిని అస్సాం, మేఘాలయ, మిజోరాం, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం వ్యవస్థాపక అవగాహన, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మహిళల్లో వ్యవస్థాపక ఆలోచనా విధానాన్ని పెంపొందిస్తుంది. ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ నిర్వహించినవి:
* 82 మంది అధ్యాపకులకు ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్,
* 1200 మంది పాల్గొన్న వారికి ఎంట్రప్రెన్యూర్‌షిప్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్,
* 602 మంది అభ్యర్థులకు విమెన్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్.

నవ్య(వర్కింగ్ ట్రైనింగ్ ఫర్ యంగ్ అడోలసెంట్ గర్ల్స్)
నవ్య కార్యక్రమాన్ని జూన్ 2025లో మహిళా శ్రామిక శక్తి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ(ఎంఎస్‌డీఈ) మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో ప్రారంభించింది. ఈ పథకం ఆకాంక్షిత జిల్లాల్లోని 16-18 సంవత్సరాల వయస్సు గల కిశోర బాలికలకు సామాజిక-ఆర్థిక‌ స్వతంత్రత కోసం నైపుణ్య ఆధారిత కార్యక్రమాల ద్వారా సాధికారత కల్పించాలనే లక్ష్యంతో ఉంది.
* 19 రాష్ట్రాలలోని 27 జిల్లాలను కవర్ చేస్తూ, నవ్య పథకం పీఎంకేవీవై 4.0 కింద 3,850 మంది బాలికలకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కార్యక్రమం సాంప్రదాయేతర, భవిష్యత్తు ఆధారిత ఉద్యోగ పాత్రలలో డిమాండ్ ఆధారిత వృత్తి విద్యా శిక్షణను అందిస్తుంది. ఇది డిజిటల్ మార్కెటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఆధారిత సేవలు, గ్రీన్ జాబ్స్ వంటి రంగాలలో జీవిత నైపుణ్యాలు, ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ సామర్థ్యాలను కూడా నిర్మిస్తుంది. ఇది వెనుకబడిన ప్రాంతాలలో ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను, లింగ-సమ్మిళిత నైపుణ్య శిక్షణను ప్రోత్సహిస్తుంది.

కేంద్ర బడ్జెట్ 2026-27: ప్రధాన నైపుణ్య కార్యక్రమాలు
* ఖేలో ఇండియా మిషన్ ఒక సమీకృత ప్రతిభ మార్గాన్ని, కోచ్‌ల అభివృద్ధిని, క్రీడా విజ్ఞానం, సాంకేతికత విస్తృత వినియోగాన్ని ప్రతిపాదిస్తుంది.
* ప్రమాణీకరించిన 12 వారాల హైబ్రిడ్ కోర్స్ ద్వారా 10,000 మంది టూరిస్ట్ గైడ్‌ల నైపుణ్యాలను పెంచడానికి ఒక పైలట్ కార్యక్రమం.
* విద్య, పరిశోధన, క్లినికల్ సేవలను బలోపేతం చేయడానికి 3 కొత్త ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద సంస్థలు.
* తూర్పు భారతదేశంలో డిజైన్ విద్యను బలోపేతం చేయడానికి ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్.
* 15,000 పాఠశాలలు, 500 కళాశాలల్లో ఏవీజీసీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌లు.
* వృద్ధాప్య, అనుబంధ సంరక్షణలో 1.5 ల‌క్ష‌ల‌ మంది మల్టీ-స్కిల్డ్ కేర్‌గివర్లకు శిక్షణ ఇవ్వడానికి ఎన్ఎస్‌క్యూఎఫ్‌-అనుగుణంగా ఉండే కార్యక్రమాలు.
* పారిశ్రామిక, లాజిస్టిక్స్ కారిడార్ల సమీపంలో ఐదు యూనివర్సిటీ టౌన్‌షిప్‌లు. ఈ టౌన్‌షిప్‌లు ఉన్నత విద్య, పరిశోధన, నైపుణ్య శిక్షణ, నివాస మౌలిక వసతులను అనుసంధానిస్తాయి.

ముగింపు
భారతదేశ నైపుణ్య రంగం ఒక సమగ్రమైన, జీవితకాల విధానం ద్వారా బలోపేతం అవుతోంది. ఇది పాఠశాల విద్య, ఉన్నత విద్య, శ్రామిక శక్తి నైపుణ్యాల పెంపు, వ్యవస్థాపకత, మహిళా ఆధారిత కార్యక్రమాల వరకు విస్తరించి ఉంది. నైపుణ్య శిక్షణను అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, పరిశ్రమల డిమాండ్, ప్రపంచ శ్రామిక మార్కెట్ మార్పులకు అనుగుణంగా మారుస్తున్నారు. యువత, మహిళలు, వెనుకబడిన వర్గాల కోసం చేపట్టిన నిర్దేశిత కార్యక్రమాలు సమ్మిళిత భాగస్వామ్యాన్ని, సమాన వృద్ధిని నిర్ధారిస్తున్నాయి.

మొత్తంగా, ఈ కార్యక్రమాలన్నీ భారతదేశం తన జనాభా ప్రయోజనాలను ఉపయోగించుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా పోటీ పడే శ్రామిక శక్తిని నిర్మించడానికి తోడ్పడుతున్నాయి.

 

Reference

Ministry of Finance

http://www.dea.gov.in/files/monthly_economic_report_documents/FINAL_Monthly%20Economic%20Review%20October%202025.pdf

 

Ministry of Skill Development and Entrepreneurship

https://www.msde.gov.in/static/uploads/2024/04/National-Skill-Development-Mission.pdf

https://x.com/MSDESkillIndia/status/1998400903376994741

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2204136&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2210537&reg=3&lang=2

https://www.instagram.com/p/DS93yBTEVvO/

https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=2200373&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2197061&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2200389&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2197057&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2149342&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2200384&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2204133&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2146569&utm&reg=3&lang=2

https://dgt.gov.in/sites/default/files/2025-10/PM-SETU-Guidelines-Component-I-Upgradation-of-ITIs.pdf 

https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2208158&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2236967&reg=3&lang=1

https://pm-setu.skillindiadigital.gov.in/

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2266939&lang=2&reg=48

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2250149&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2217278&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2223364&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2238232&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2225466&reg=3&lang=1

https://iie.gov.in/pr/projects/swavalambini--women-entrepreneurship-programme#gsc.tab=0

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2200384&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2144958&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2281937&reg=48&lang=1

 

Sansad.in

https://sansad.in/getFile/loksabhaquestions/annex/186/AS116_8uUyrZ.pdf?source=pqals

https://sansad.in/getFile/loksabhaquestions/annex/186/AU1259_yqXOnZ.pdf?source=pqals

https://sansad.in/getFile/loksabhaquestions/annex/185/AU1175_YigYjs.pdf?source=pqals

 

Ministry of Education

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1951485&reg=3&lang=2

https://pmshri.education.gov.in/  

https://samagra.education.gov.in/about.html

https://vidyanjali.education.gov.in/

https://sansad.in/getFile/loksabhaquestions/annex/186/AU1164_v0ZRwx.pdf?source=pqals

 

Cabinet

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1857409&reg=3&lang=2

 

Ministry of Electronics and Information Technology

https://indiaai.gov.in/hub/indiaai-futureskills

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2191334&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2201472&reg=3&lang=1

https://www.futureskillsprime.in/

 

Ministry of Labour & Employment

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2206145&reg=3&lang=2

https://www.mofpi.gov.in/sites/default/files/pradhan_mantri_viksit_bharat_rozgar_yojana_pmvbry.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2201346&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2148270&reg=48&lang=2

 

Ministry of Micro, Small and Medium Enterprises

https://msmedi.dcmsme.gov.in/

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2246894&reg=3&lang=1

https://pmvishwakarma.gov.in/

 

Ministry of Commerce and Industry

https://www.startupindia.gov.in/content/sih/en/reources/online-courses.html

 

Niti Ayog

https://niti.gov.in/sites/default/files/2019-01/Skill_Workforce.pdf

https://aim.gov.in/atl.php

 

PM India

https://www.pmindia.gov.in/en/news_updates/pm-disburses-incentives-worth-around-%e2%82%b92400-crore-under-the-pradhan-mantri-viksit-bharat-rozgar-yojana/

 

World Bank

https://www.worldbank.org/en/topic/skillsdevelopment

 

World Economic Forum

https://reports.weforum.org/docs/WEF_Future_of_Jobs_Report_2025.pdf

 

UNESCO

https://www.unevoc.unesco.org/en/wysd-2026-skills-shared-future

 

PIB Headquarters

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2226912&reg=3&lang=1

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=155216&ModuleId=3&reg=48&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2256476&reg=3&lang=1

 

Others

https://cdnbbsr.s3waas.gov.in/s3kv05b90e8875c131d0760d04c0d4d8f3/uploads/2025/08/2025080227.pdf

https://wheebox.com/assets/pdf/ISR_Report_2026.pdf

https://wheebox.com/assets/pdf/ISR_Report_2025.pdf

https://x.com/Office_ChJayant/status/2041772472798998566

https://aicw.in/skilling

Empowering India's Skill Ecosystem

 

***

(Explainer ID: 159247) आगंतुक पटल : 3
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Tamil , Kannada , Malayalam