ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 12 SEP 2026 7:45PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు శ్రీ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు.

ఆగస్టు-2025లో టియాంజిన్‌లో జరిగిన తమ చివరి సమావేశం నుంచి భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో కొనసాగుతున్న స్థిరమైన పురోగతిని ఇరువురు నేతలు స్వాగతించారుఇరు దేశాలు తమ సంబంధాల పట్ల వ్యూహాత్మకదీర్ఘకాలిక దృక్పథాన్ని కలిగి ఉండాలని వారు పునరుద్ఘాటించారుభేదాభిప్రాయాలు వివాదాలుగా మారకూడదు... ఇరుపక్షాలు పరస్పర గౌరవంపరస్పర సున్నితత్వంపరస్పర ప్రయోజనం అనే మూడు పరస్పర సూత్రాల మార్గనిర్దేశంలో ముందుకు సాగాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

ద్వైపాక్షిక సంబంధాల నిరంతర అభివృద్ధికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతిప్రశాంతత అత్యంత ఆవశ్యకమైన ప్రాతిపదిక అని ప్రధానమంత్రి పేర్కొన్నారుసరిహద్దు సంబంధిత సమస్యలపై ఇప్పటికే ఉన్న ఒప్పందాలుఅవగాహనలను ఇరుపక్షాలు పాటించాల్సిన అవసరాన్నీ ఆయన ఉద్ఘాటించారుసమగ్ర ద్వైపాక్షిక సంబంధాల రాజకీయ దృక్కోణంఇరు దేశాల ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని... సరిహద్దు సమస్యకు న్యాయమైనసహేతుకమైనపరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం పట్ల ఇరువురు నేతలు తమ నిబద్ధతను వ్యక్తం చేశారు.

ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాల్లో సాధించిన పురోగతిని గుర్తించిన ఇరువురు నేతలు... సాంస్కృతిక మార్పిడులనువ్యాపార సంబంధాలనుమెరుగైన రవాణాను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరాన్నీ స్పష్టం చేశారుఆర్థికవాణిజ్య సంబంధాల విషయంలో నిర్మాణాత్మక వాణిజ్య అసమతుల్యతసరఫరా వ్యవస్థ సంబంధిత సమస్యలు సహా ఒకరి ఆందోళనలను మరొకరు పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని... అర్థవంతమైనఅంచనా వేయదగిన వాణిజ్య అవకాశాలను సులభతరం చేయాల్సిన అవసరాన్నీ వారు ప్రముఖంగా ప్రస్తావించారు.

ప్రాంతీయప్రపంచ సమస్యలుసవాళ్లను ఎదుర్కోవడంలోనూ ఇరుపక్షాలు తమ ఉమ్మడి అవగాహనను మరింత విస్తరించుకోవాలని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు.

బ్రిక్స్ అధ్యక్ష హోదా కోసం భారత్‌కు చైనా అందిస్తున్న మద్దతునుబ్రిక్స్ సదస్సు-2026 విజయవంతంలో ఆ దేశ సహకారాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2309908) సందర్శకుల సూచీ సంఖ్య : : 10