ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇథియోపియా ప్రధానితో భారత ప్రధానమంత్రి భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
12 SEP 2026 11:16AM by PIB Hyderabad
భారత అధ్యక్షతన జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా న్యూఢిల్లీలో ఇథియోపియా ప్రధానమంత్రి గౌరవ డాక్టర్ అబియ్ అహ్మద్ అలీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సమావేశమయ్యారు.
ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఆర్థిక సహకారం, రక్షణ, భద్రత భాగస్వామ్యం, సామర్థ్య నిర్మాణం వంటి కీలక రంగాల్లో సాధించిన పురోగతిని వారు సమీక్షించారు. ఈ సమావేశం 2025 డిసెంబర్లో ప్రధానమంత్రి శ్రీ మోదీ అడిస్ అబాబాలో జరిపిన చారిత్రాత్మక పర్యటనకు కొనసాగింపుగా జరిగింది.
పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరు దేశాల నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. బహుపాక్షిక వేదికల్లో సన్నిహిత సహకారాన్ని కొనసాగించేందుకు తమ నిబద్ధతను వారు ప్రకటించారు.
18వ బ్రిక్స్ సదస్సులో ఇథియోపియా పాల్గొనడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇథియోపియా భాగస్వామ్యం అభివృద్ధి చెందుతున్న దేశాల సమష్టి స్వరాన్ని మరింత బలోపేతం చేయడంలో దోహదపడిందని ఆయన పేర్కొన్నారు.
****
(రిలీజ్ ఐడి: 2309583)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam