ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పరస్పర అభ్యసన-శ్రవణ ప్రాధాన్యాన్ని వివరించే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 26 AUG 2026 10:05AM by PIB Hyderabad

   రస్పర అభ్యసనం-శ్రవణ ప్రాధాన్యాన్ని వివరించే ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రజలతో పంచుకున్నారు. పరస్పర అవగాహనతో అధ్యయనం, శ్రవణం దిశగా ఉత్సాహం చూపేవారు జ్ఞానుల ప్రశంసలు పొందుతారనే ఆ సుభాషిత అర్థాన్ని ఆయన వివరించారు. అలాంటి వారు స్వార్థ త్యాగులుగా నిలవడమేగాక నిగూఢ యోచనల నుంచి విముక్తులవుతారని తెలిపారు. అలాగే, అన్ని విధాలా ఆనందోత్సాహాలలో వర్ధిల్లుతారని వ్యాఖ్యానించారు:

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో కింది సుభాషితాన్ని ఆయన పంచుకున్నారు:

“జ్ఞానవృద్ధాః ప్రశంసన్తి శుశ్రూషంతః పరస్పరమ్।

వినివృత్తాభిసంధానః సుఖమేధన్తి సర్వశః॥“

 

***


(రిలీజ్ ఐడి: 2303432) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Kannada , Malayalam