పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జైపూర్ డిక్లరేషన్ (మంత్రుల ప్రకటన)ను ఆమోదించిన బ్రిక్స్ పర్యాటక మంత్రులు

ప్రజల అనుసంధానం, అవకాశాలు, సాంస్కృతిక మార్పిడికి పర్యాటకం కీలకం: శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్

प्रविष्टि तिथि: 21 AUG 2026 6:28PM by PIB Hyderabad

భారత అధ్యక్షతన జైపూర్ లో జరిగిన బ్రిక్స్ పర్యాటక మంత్రుల సమావేశం నేడు ముగిసిందిజైపూర్ డిక్లరేషన్ (బ్రిక్స్ పర్యాటక మంత్రుల అధికారిక ప్రకటన 2026)ను సమావేశం ఆమోదించిందిబ్రిక్స్ సభ్య దేశాల మధ్య పర్యాటక రంగానికి సంబంధించిన సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇది ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను అందిస్తుంది.

కేంద్రసాంస్కృతికపర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ సమావేశానికి అధ్యక్షత వహించారుప్రతికూలతలను తట్టుకునే సామర్ధ్యంఆవిష్కరణలుసహకారంసుస్థిరతతో ముందడుగు -  ఇతివృత్తంతో 2026 భారత బ్రిక్స్ అధ్యక్షత కింద బ్రిక్స్ పర్యాటక విభాగం కార్యక్రమాలు ఈ సమావేశంతో విజయవంతంగా ముగిశాయి

ఈ సమావేశంలో బ్రిక్స్‌ సభ్య దేశాలకు చెందిన తొమ్మిది దేశాల ప్రతినిధులు పాల్గొన్నారుమంత్రుల స్థాయిలో బ్రెజిల్‌ పర్యాటక శాఖ మంత్రి గుస్తావో కోస్టా ఫెలిసియానోఇరాన్‌ సాంస్కృతిక వారసత్వంపర్యాటకంహస్తకళల శాఖ మంత్రి రెజా సలేహీ అమీరీదక్షిణాఫ్రికా పర్యాటక శాఖ మంత్రి ప్యాట్రిషియా డి లిల్లేయునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఆర్థికపర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్‌ టౌక్‌ అల్‌ మారీ పాల్గొన్నారువీరితో పాటు చైనాఇథియోపియాఇండోనేషియారష్యా దేశాల ప్రతినిధి బృందాల నేతలు కూడా సమావేశానికి హాజరయ్యారుభారత ప్రతినిధి బృందంలో పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ భువనేశ్‌ కుమార్‌పర్యాటక శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ హరికిషోర్‌ ఎస్‌తదితర ఉన్నతాధికారులు ఉన్నారు

బ్రిక్స్ కు భారత్‌ అధ్యక్షత కింద పర్యాటక అధ్యయన బృందం చేసిన కృషికి జైపూర్‌ డిక్లరేషన్‌ ప్రతిబింబంగా నిలిచిందిఇందులో కృత్రిమ మేధపర్యాటకంసుస్థిరతబాధ్యతాయుత పర్యాటకంపర్యాటక రంగంలో నైపుణ్యాభివృద్ధిసామర్థ్య పెంపుపర్యాటక సంబంధ మార్పిడులుఆంక్షలు లేని ప్రయాణ సదుపాయాలు అనే అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు.

బ్రిక్స్‌ పర్యాటక శాఖ మంత్రులు ఏకాభిప్రాయంతో ఆమోదించిన అధికారిక ప్రకటన పర్యాటక రంగంలో బాధ్యతాయుతమైనసురక్షితమైనమానవకేంద్రిత కృత్రిమ మేధడిజిటల్‌ సాంకేతికతలు తీసుకురాగల సమూల మార్పులను గుర్తించిందిపర్యాటక ప్రణాళికపర్యాటక ప్రాంతాల నిర్వహణసందర్శకులకు సేవలుబహుభాషా సమాచార ప్రసారంప్రయాణ సదుపాయాల కల్పన వంటి అంశాల్లో పరస్పర సహకారాన్ని ప్రోత్సహించేందుకు మద్దతు తెలిపింది.

ఇది సుస్థిర సమాజ కేంద్రిత పర్యాటకంసహజసాంస్కృతిక వారసత్వ సంపద రక్షణపర్యాటక రంగంలో పెట్టుబడులుమౌలిక సదుపాయాల కల్పనవిభిన్న పర్యాటక ఉత్పత్తుల అభివృద్ధి ప్రచారంపై కూడా ఈ ప్రకటన ప్రత్యేకంగా దృష్టి సారించిందిబ్రిక్స్ సభ్య దేశాల మధ్య నిరంతర నైపుణ్యాభివృద్ధి,  రీ స్కిల్లింగ్పరిశ్రమ విద్యా సంస్థల భాగస్వామ్యాలుపర్యాటక రంగానికి సంబంధించిన డేటాగణాంకాల మార్పిడిఅత్యుత్తమ విధానాల భాగస్వామ్యంబలమైన ప్రజా సంబంధాల బలోపేతానికి ఇది ప్రాధాన్యతనిచ్చింది

సమావేశంలో కేంద్ర సాంస్కృతికపర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్‌ షెకావత్‌  మాట్లాడుతూ... 2047 నాటికి వికసిత్‌ భారత్‌ సాధించే ప్రయాణంలో పర్యాటక రంగం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారుప్రధాన ఆర్థిక కేంద్రాలకు మాత్రమే పరిమితమైన అభివృద్ధిని పట్టణాలుగ్రామాలుమారుమూల ప్రాంతాలకు విస్తరించే ప్రత్యేక సామర్థ్యం పర్యాటక రంగానికి ఉందని పేర్కొన్నారుపర్యాటకం ద్వారా హోటళ్లుహోమ్‌స్టేలుట్యాక్సీ నిర్వాహకులుటూర్‌ గైడ్‌లుకళాకారులుచేనేత కార్మికులురైతులుపారిశ్రామికవేత్తలకు అవకాశాలు లభిస్తున్నాయనిప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడుతున్న లక్షలాది కుటుంబాల జీవనోపాధికి పర్యాటక రంగం తోడ్పడుతోందని తెలిపారు.

పర్యాటక రంగాన్ని ఆర్థికంగా సుసంపన్నంగాపర్యావరణపరంగా బాధ్యతాయుతంగాసాంకేతికత ఆధారితంగాసాంస్కృతికంగా ప్రామాణికంగా తీర్చిదిద్దేందుకు భారత్‌ చేస్తున్న కృషిని మంత్రి వివరించారు. “అంతిమంగా పర్యాటకం ప్రజలను అనుసంధానిస్తుందిఇది స్థానికులకు అవకాశాలను కల్పిస్తుందిసాంస్కృతిక మార్పిడికి దోహదపడుతుందిప్రభుత్వాల మధ్య అధికారిక సంబంధాలకు అతీతంగా మన దేశాల ప్రజలు పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు పర్యాటకం వీలు కల్పిస్తుంది” అని అన్నారు.

పర్యాటక మంత్రుల సమావేశం సందర్భంగా బ్రెజిల్‌ఇరాన్‌దక్షిణాఫ్రికాయునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈదేశాలతో భారత్ ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించిందిఆయా దేశాల మంత్రుల నేతృత్వంలోని ప్రతినిధి బృందాలతో చర్చలతో పాటుపర్యాటక రంగంలో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సమావేశాలు దోహదపడ్డాయి.

బ్రిక్స్ కు భారత్‌ అధ్యక్షతన కొనసాగిన పర్యాటక విభాగం కార్యక్రమాలపై విలేకరుల సమావేశం కూడా నిర్వహించారుపర్యాటక శాఖ మంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలుజైపూర్‌ డిక్లరేషన్‌ ఆమోదం తదితర అంశాలను ఈ సందర్భంగా వెల్లడించారు.

జైపూర్‌లో జరిగిన పర్యాటక శాఖ మంత్రుల సమావేశంలో భాగంగా… స్థానిక సంప్రదాయ కళలుహస్తకళలుపర్యాటక కార్యక్రమాలకు చెందిన ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

రేపు (ఆగస్టు 22మంత్రులుప్రతినిధులు జైపూర్‌లోని ప్రసిద్ధ వారసత్వ కట్టడాలైన హవామహల్సిటీ ప్యాలెస్ఆమేర్ కోటలను సందర్శించనున్నారుఈ పర్యటన ద్వారా నగరంలోని గొప్ప వాస్తుశిల్పసాంస్కృతికపర్యాటక వారసత్వాన్ని వారు ప్రత్యక్షంగా వీక్షిస్తారు .

 

***


(रिलीज़ आईडी: 2302231) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil