గనుల మంత్రిత్వ శాఖ
కీలక, వ్యూహాత్మక ఖనిజ బ్లాకుల 8వ విడత వేలంపై రోడ్షోను,
ఎన్ఎంఈడీటీ వర్క్షాప్ను పాట్నాలో నిర్వహించనున్న గనుల మంత్రిత్వ శాఖ
प्रविष्टि तिथि:
16 AUG 2026 4:19PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కీలక, వ్యూహాత్మక ఖనిజ బ్లాకుల 8వ విడత వేలంపై రోడ్షోనూ, జాతీయ ఖనిజ అన్వేషణ, అభివృద్ధి ట్రస్ట్ (ఎన్ఎంఈడిటీ)పై వర్క్షాప్నూ 2026 ఆగస్టు 17న బీహార్లోని పాట్నాలో నిర్వహించనున్నారు.
బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబే అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి శ్రీ సమ్రాట్ చౌధరి, బిహార్ గనుల శాఖ మంత్రి డాక్టర్ ప్రమోద్ కుమార్ పాల్గొంటారు. బీహార్ గనుల శాఖ, భారత భూగర్భ సర్వే సంస్థ (జీఎస్ఐ), మినరల్ ఎక్స్ప్లోరేషన్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (ఎంఈసీఎల్)కు చెందిన ఉన్నతాధికారులతో పాటు పరిశ్రమ ప్రతినిధులు, పెట్టుబడిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని భావిస్తున్నారు.
ఈ 8వ విడత వేలంలో గ్రాఫైట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (ఆర్ఈఈ), అరుదైన లోహాలు, వెనాడియం, గాలియం, టైటానియం, మోలిబ్డినం, టంగ్స్టన్, పొటాష్, ఫాస్ఫోరైట్, గ్లాకోనైట్ వంటి వివిధ రకాల కీలక, వ్యూహాత్మక ఖనిజాలకు చెందిన 20 బ్లాకులు ఉన్నాయి. వీటిలో 3 మైనింగ్ లీజ్ (ఎంఎల్), 17 కాంపోజిట్ లైసెన్స్ (సీఎల్) బ్లాకులు ఉన్నాయి.
రోడ్షో ద్వారా వేలానికి అందుబాటులో ఉన్న ఖనిజ బ్లాకుల సామర్థ్యం, వేలం విధానం, బిడ్డింగ్ ప్రక్రియ, కీలక, వ్యూహాత్మక ఖనిజాల రంగంలో పెట్టుబడులు, భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై ఔత్సాహిక పెట్టుబడిదారులు, పరిశ్రమ వర్గాలకు సమగ్ర అవగాహన కల్పించనున్నారు. ఖనిజ బ్లాకులపై ఎంఈసీఎల్, ఖనిజాల వేలం ప్రక్రియ, టెండర్ పత్రంపై ఎస్ బీఐసీఏపీఎస్, ఈ-వేలం ప్రక్రియపై ఎంఎస్టీసీ సంస్థలు సమగ్ర ప్రజెంటేషన్లు ఇవ్వనున్నాయి. ఎన్ఎంఈడీటీఈ కార్యక్రమంలో కాంపోజిట్ లైసెన్స్దారులు చేసిన ఖనిజ అన్వేషణ వ్యయాల్లో కొంత భాగాన్ని తిరిగి చెల్లించే ఎన్ఎంఈడీటీ పథకంపై కూడా ఈ కార్యక్రమంలో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం భాగస్వామ్య వర్గాల మధ్య పరస్పర చర్చకు, వేలం ప్రక్రియకు సంబంధించిన సందేహాల నివృత్తికి ఓపెన్ హౌస్ నిర్వహించనున్నారు.
కార్యక్రమం రెండో భాగంలో ఖనిజ అన్వేషణ: ప్రణాళిక, అమలు, నివేదికల తయారీ అంశంపై వర్క్షాప్ నిర్వహించనున్నారు. భారత్లో ఖనిజ అన్వేషణకు ఉన్న అవకాశాలు, జాతీయ భూవిజ్ఞాన డేటా రిపాజిటరీ (ఎన్జీడీఆర్)ని ఉపయోగించి అన్వేషణ బ్లాకుల రూపకల్పన, ఖనిజ అన్వేషణ నివేదికల తయారీ వంటి అంశాలను వివరించనున్నారు. భారత భూగర్భ సర్వే సంస్థ (జీఎస్ఐ) ఉన్నతాధికారులు సాంకేతిక అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు.
ఖనిజ అన్వేషణను ప్రోత్సహించడం, కీలక, వ్యూహాత్మక ఖనిజ వనరుల అభివృద్ధిని వేగవంతం చేయడం, ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచడం, దేశ ఖనిజ భద్రతను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం కొనసాగిస్తున్న కృషిని ఈ కార్యక్రమం తెలియచేస్తుంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్వచ్ఛ ఇంధనం, ఇతర వ్యూహాత్మక రంగాలకు అవసరమైన ఖనిజాల దేశీయ అన్వేషణ, అభివృద్ధిని మరింత విస్తరించడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి కూడా ఈ కార్యక్రమం తోడ్పడుతుంది.
****
(रिलीज़ आईडी: 2300304)
आगंतुक पटल : 7