మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పార్లమెంటు ప్రశ్న: విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు

प्रविष्टि तिथि: 12 AUG 2026 4:53PM by PIB Hyderabad

విద్య… రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలోని అంశంకాబట్టి దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు (హెచ్ఈఐలు), పాఠశాలల నిర్వహణ బాధ్యత కేంద్రరాష్ట్రయూటీ ప్రభుత్వాలపై ఉంటుంది.
విద్యా మంత్రిత్వశాఖ పరిధిలోని కేంద్ర విశ్వవిద్యాలయాలతో సహా కేంద్ర ఉన్నత విద్యా సంస్థలు (సీహెచ్ఈఐలుఅన్నీ కేంద్ర పార్లమెంటరీ చట్టాల ప్రకారం ఏర్పాటైన స్వయంప్రతిపత్తి సంస్థలుఇవి ఆయా చట్టాలునిబంధనలుఆర్డినెన్సులునిబంధనల ప్రకారం పనిచేస్తాయిస్వయంప్రతిపత్తి గల ఈ సంస్థల్లో బోధనా సిబ్బంది నియామకాలు ఆయా సంస్థల చట్టాలునిబంధనలకు అనుగుణంగా ఉంటాయినియామక అధికారాలు సంబంధిత బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ఎగ్జిక్యూటివ్ కమిటీబోర్డు ఆఫ్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో ఉంటాయి.
రాష్ట్రీయ విశ్వవిద్యాలయాలు ఆయా రాష్ట్రాల్లోని చట్టాల ద్వారా ఏర్పాటవుతాయివాటిలోని ఖాళీలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలువిశ్వవిద్యాలయాలే భర్తీ చేస్తాయిరాష్ట్ర విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ఖాళీల వివరాలు కేంద్ర పరిధిలో ఉండవు.
విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీసలహా మేరకు 1956లోని యూజీసీ చట్టం సెక్షన్-3 ద్వారా ఒక సంస్థను డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందియూజీసీ (సంస్థలను డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయాలుగా ప్రకటించటంనిబంధనలు-2023 ప్రకారం ఈ డీమ్డ్ విశ్వవిద్యాలయాలను యూజీసీ నియంత్రిస్తుందిఈ నిబంధనల ప్రకారం విశ్వవిద్యాలయ నిధుల కమిషన్ (ఉపాధ్యాయులుఇతర విద్యా సిబ్బంది నియామకానికి కనీస అర్హతలుఉన్నత విద్యలో ప్రమాణాల పరిరక్షణకు ఇతర చర్యలునిబంధనలు-2018కి అనుగుణంగా సెలక్షన్ కమిటీ సిఫార్సు మేరకు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధ్యాపక సిబ్బందినిఇతర పోస్టులను భర్తీ చేస్తుంది.
ఖాళీలు ఏర్పడటంవాటిని భర్తీ చేయటం నిరంతర ప్రక్రియపదోన్నతిపదవీ విరమణరాజీనామామరణంకొత్త సంస్థలుపథకాలుప్రాజెక్టుల ఏర్పాటువిద్యార్థుల సంఖ్య పెరగటంఅప్పటికే ఉన్న సంస్థల సామర్థ్యాన్ని విస్తరించటం వంటి అదనపు అవసరాల వల్ల ఖాళీలు ఏర్పడతాయి.
కేంద్రీయ నిధులు పొందే ఉన్నత విద్యా సంస్థల్లో నాణ్యమైన అధ్యాపకులను నియమించేందుకు పలు చర్యతలను చేపట్టారువీటిలో సంవత్సరం పొడవునా బహిరంగ ప్రకటనలు ఇవ్వటంసెర్చ్-కమ్-సెలక్షన్ పద్ధతుల ద్వారా నియామకంప్రత్యేక నియామక డ్రైవ్మిషన్ మోడ్ నియామకంపూర్వ విద్యార్థులుశాస్త్రవేత్తలుఅధ్యాపకులను ఆహ్వానించటం వంటివి ఉన్నాయిపారదర్శక రీతిలో దరఖాస్తులను ఆహ్వానించటం ద్వారా పలు దశల్లోపటిష్ఠమైన స్క్రీనింగ్ ప్రక్రియల ద్వారా అధ్యాపక నియామక ప్రక్రియలను సీహెచ్‌ఈఐలు నిర్వహిస్తాయినియామకాల్లో పారదర్శకతనువిద్యాపరమైన కఠిన ప్రమాణాలను నిర్ధారించేందుకువివిధ స్థాయిల అధ్యాపకుల నియామకానికి బాధ్యత వహించే అధికారాలుస్వతంత్ర సబ్జెక్ట్ నిపుణులువిజిటర్ నామినీలు మొదలైన వారి వివరాలను ఆయా సంస్థల చట్టాలునిబంధనలు స్పష్టంగా పేర్కొంటాయిఅన్ని కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ఖాళీలుప్రకటనలుఉద్యోగాలను తెలిపేందుకు వీలుగా యూజీసీ సీయూ-చయాన్ పోర్టల్‌ను ప్రారంభించిందిఇది మొత్తం నియామక ప్రక్రియను మరింత పారదర్శకంగాఅందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఉన్నత విద్యా సంస్థల్లో (హెచ్ఈఐలువిద్య నాణ్యతను మెరుగుపరచటంపై జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)-2020 దృష్టి సారించిందిఇందుకోసం వివిధ దశల్లో విద్యను ప్రోత్సహించటంవిమర్శనాత్మక ఆలోచనవిశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పెంపొందించటంపరిశోధనఆవిష్కరణలను ప్రోత్సహించటంమౌలిక వసతుల నాణ్యతను మెరుగుపరచటంఉపాధ్యాయులకు సమర్థవంతమైననాణ్యమైన శిక్షణ ఇవ్వటం వంటి కార్యక్రమాలను చేపడుతోంది.
విద్య నాణ్యతను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చే సంస్థల్లో పలు కార్యక్రమాలను ప్రారంభించారుఉన్నత విద్యను మరింత మెరుగుపరిచేందుకు రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రుసా), ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (పీఎం ఉషాపథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు భారత ప్రభుత్వం ఆర్థికంగా మద్దతిస్తుందిబోధనా నాణ్యతను మెరుగుపరిచేందుకుసంస్థాగత పనితీరును బలోపేతం చేసేందుకు ఉన్నత విద్యా సంస్థల్లో మెరుగైన విద్యా ఫలితాలను ప్రోత్సహించేందుకు మాలవ్య మిషన్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ (ఎంఎంటీటీపీ)ను 2023లో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రారంభించింది. 151 మాలవ్య మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్స్ (ఎంఎంటీటీసీలద్వారా ఈ కార్యక్రమం అమలవుతోందిఇప్పటివరకు దేశవ్యాప్తంగా లక్షలకుపైగా అధ్యాపకులు దీని ద్వారా శిక్షణ పొందారు.
తమ సంస్థల్లోని బ్యాక్‌లాగ్ పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అన్ని సీహెచ్‌ఈఐలను విద్యా మంత్రిత్వశాఖ 2021 ఆగస్టులో అభ్యర్థించిందిషెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు), ఇతర వెనుకబడిన తరగతులతో (ఓబీసీలుసహా ఖాళీలను భర్తీ చేయటానికి సీహెచ్ఈఐలు ప్రత్యేక నియామక డ్రైవ్‌లను చేపట్టాయిఅలాగే 2022 సెప్టెంబరులో అన్ని ఖాళీలను త్వరితగతిన పూర్తి చేయాలని అన్ని సీహెచ్ఈఐలను విద్యామంత్రిత్వశాఖ కోరిందితిరిగి 2025 అక్టోబరులో బ్యాక్‌లాగ్ ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని అన్ని సీహెచ్ఈఐలను విద్యా మంత్రిత్వశాఖ అభ్యర్థించిందిఖాళీలను భర్తీ చేయటానికి 2022 సెప్టెంబరు నుంచి కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో (సీయూలుసహా అన్ని సీహెచ్ఈఐలు నియామక ప్రక్రియలను చేపట్టాయి. 23.05.2026 (అంటే చివరి రోజ్‌గార్ మేళా నిర్వహించిన తేదీవరకు అన్ని సీహెచ్ఈఐలు కలిసి మొత్తం 32,114 పోస్టులను భర్తీ చేశాయివాటిలో 18,757 అధ్యాపక నియామకాలు కూడా ఉన్నాయి.

ఈ సమాచారాన్ని విద్యాశాఖ సహాయమంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ ఇవాళ రాజ్యసభలో రాతపూర్వకంగా అందించారు.

 

***


(रिलीज़ आईडी: 2298501) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी