హోం మంత్రిత్వ శాఖ
భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) పరిధిలో ఈ-ఎఫ్ఐఆర్ నమోదు
प्रविष्टि तिथि:
11 AUG 2026 4:08PM by PIB Hyderabad
కేసు పెట్టదగిన నేరం జరిగినప్పుడు, దానికి సంబంధించిన సమాచారాన్ని ఆ నేరం ఏ ప్రాంతంలో జరిగినప్పటికీ, పోలీస్ స్టేషన్కు చెందిన అధికారి సమక్షంలో మౌఖికంగా, లేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారానైనా తెలియజేయవచ్చునని ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్)-2023’ లోని 173వ సెక్షన్ సూచిస్తోంది. నోటిమాటగా సమాచారాన్ని తెలియజేస్తే, అప్పుడు ఆ విషయాన్ని అధికారి కాగితాల్లో రాసుకుని నమోదు చేసుకుంటారు. ఆ పత్రాలపై.. నేరం జరిగిందని తెలిపిన వ్యక్తి సంతకం చేయాల్సి ఉంటుంది. సమాచారాన్ని ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ రూపంలో తెలియజేసినట్లయితే, సంబంధిత పోలీస్ స్టేషన్లోని అధికారి దానిని రాతపూర్వకంగా నమోదు చేసుకుని మూడు రోజుల లోపల ఆ పత్రాలపై, విషయాన్ని తెలియజేసిన వ్యక్తి సంతకాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ-ఎఫ్ఐఆర్ లేదా ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా తెలియజేసిన సమాచారాన్ని రికార్డు చేయడానికి, ఆ సమాచారాన్ని అందించిన వ్యక్తి మూడు రోజుల గడువు లోపల సమాచార పత్రంపై సంతకాలు చేయవలసి ఉంటుందని ‘బీఎన్ఎస్ఎస్-2023’ సూచిస్తోంది.
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ, ఈ విషయాలను తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2297769)
आगंतुक पटल : 22