శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లక్నోలోని సీఎస్‌ఐఆర్‌-ఎన్‌బీఆర్‌ఐ అభివృద్ధి చేసిన దేశంలోనే తొలి ఎకో ఎడ్యూకేషనల్ హబ్‌ను జాతికి అంకితం చేసిన కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌

సాంకేతికతను, విజయగాథలను ప్రజలకు చేరవేయటం ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సమాజానికి చేరువ చేయాలని పిలుపునిచ్చిన డాక్టర్ జితేంద్ర సింగ్

శాస్త్ర, సాంకేతిక సంస్థలు పరిశోధనలను ఉపాధి, సామాజిక అవసరాలతో అనుసంధానించాలి: డాక్టర్ జితేంద్ర సింగ్

సమాజంపై ప్రభావవంతంగా ఉండేలా వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయంతో కూడిన శాస్త్రీయ ప్రయత్నాలు అవసరమన్న డాక్టర్ జితేంద్ర సింగ్

సాంకేతిక బదిలీలు, జీవవైవిధ్య సంరక్షణ, అనుభవపూర్వక అభ్యాసం ద్వారా శాస్త్రానికి, సమాజానికి మధ్య అనుసంధానాన్ని తెలియజేసే సీఎస్‌ఐఆర్‌-ఎన్‌బీఆర్‌ఐ

प्रविष्टि तिथि: 08 AUG 2026 4:54PM by PIB Hyderabad

శాస్త్రీయ సంస్థల పనులను సమాజానికి మరింత చేరువ చేయాలని కేంద్ర శాస్త్రసాంకేతికభూ విజ్ఞాన శాఖల సహాయమంత్రి (స్వతంత్ర హోదా), ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బందిప్రజా ఫిర్యాదులుపెన్షన్లుఅణుశక్తిఅంతరిక్ష శాఖల సహాయమంత్రిసీఎస్‌ఐఆర్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్ జితేంద్ర సింగ్ నేడు పిలుపునిచ్చారులక్నోలోని బాంథ్రా వద్ద మహర్షి పరాశర్ బయోరిసోర్స్ సెంటర్ (ఎంపీబీసీ)లో తొలి సీఎస్‌ఐఆర్‌-నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ (సీఎస్‌ఐఆర్‌-ఎన్‌బీఆర్‌ఐ) 'ఎకో ఎడ్యూకేషనల్ హబ్‌' 'ప్రకృతి జ్ఞాన్ ధామ్'ను జాతికి అంకితం చేశారుశాస్త్రీయ సంస్థల సాంకేతికతలువిజయగాథలనుసామాజిక అనువర్తనాలను సమాజానికి తెలియజేయాలని కోరారు.

శాస్త్రీయ సంస్థల పరిధి కేవలం ప్రయోగశాలలుసంస్థల ప్రాంగణాలకే పరిమితం కాకూడదని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారువిజయవంతమైన సాంకేతికతలుకార్యక్రమాలను తెలియజేసేందుకు డిజిటల్సోషల్ మీడియా వేదికలను మరింతగా ఉపయోగించాలన్నారుతద్వారా రైతులుపారిశ్రామికవేత్తలువిద్యార్థులుపరిశ్రమలుఇతర భాగస్వాములు... శాస్త్రీయ పరిష్కారాలనుజీవనోపాధి అవకాశాలను పొందగలరని తెలిపారుశాస్త్ర సాంకేతిక పరిశోధనలునూతన ఆవిష్కరణల ద్వారా సమాజానికి మేలు జరిగేలా వివిధ విభాగాలుమంత్రిత్వ శాఖల పరిధిలోని ఒకే రకమైనపరస్పర సంబంధమున్న ప్రాజెక్టులను అనుసంధానించాలని ఆయన పిలుపునిచ్చారుదీనివల్ల సంస్థలన్నీ కలిసికట్టుగా పని చేసేందుకు వీలవుతుంది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిఆరోగ్య సలహాదారు డాక్టర్ జీ.ఎన్సింగ్సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒరిస్సా వైస్ ఛాన్సలర్ డాక్టర్ అజిత్ కుమార్ శసాన్సన్సీఎస్‌ఐఆర్‌-ఎన్‌బీఆర్‌ఐజమ్మూలోని సీఎస్‌ఐఆర్‌-ఐఐఐఎం డైరెక్టర్ డాక్టర్ జబీర్ అహ్మద్సీనియర్ శాస్త్రవేత్తలుపరిశోధకులుసీఎస్‌ఐఐర్‌ ఫ్లోరికల్చర్ మిషన్ లబ్ధిదారులుఇతర ఆహ్వానితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శాస్త్రీయ పరిశోధనపర్యావరణ విద్యజీవవైవిధ్య పరిరక్షణవృక్షశాస్త్ర వారసత్వంసాంస్కృతిక విశ్లేషణ కలిసిన విశిష్ట కేంద్రమే ఎకో-ఎడ్యుకేషనల్ హబ్భారతదేశ సుసంపన్న వృక్షజాలం సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా దీన్ని రూపొందించారువిద్యార్థులుపరిశోధకులువిద్యావేత్తలుప్రకృతి ప్రేమికులుసాధారణ ప్రజలందరికీ ఆకట్టుకునే అనుభవాన్ని ఇది కల్పిస్తుంది.

శాస్త్రీయ పరిజ్ఞానానికిప్రజల భాగస్వామ్యానికి మధ్య ఈ హబ్ అనుసంధాన వేదికభారతదేశ మొక్కల వైవిధ్యంపరిరక్షణ ప్రయత్నాలువృక్షశాస్త్ర వారసత్వాన్ని ఆచరణాత్మకపరస్పర అభ్యాసం ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేలా దీనిలో సౌకర్యాలను కల్పించారుశాస్త్రీయ సంస్థలకుసమాజానికి మధ్య సంబంధాన్ని బలోపేతం చేయటంలోశాస్త్రీయ విజ్ఞాన ఆచరణాత్మక విలువలపై అవగాహన కల్పించటంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

ఈ హబ్ ప్రధాన విశేషాల్లో 'పావన్ పాత్' (ప్రకృతిని ఆస్వాదించేందుకు మొక్కలువాటికి సంబంధించిన వృక్ష సంపదఒకటిఈ ప్రాంగణంలో సందర్శకులకు అద్భుతమైన అనుభూతిని కలిగించే ప్రధానమైన మార్గం ఇదేఈ మార్గంలో వివిధ పర్యావరణ ప్రాంతాలకు చెందిన అరుదైన మొక్కలనువాటికి సంబంధించిన వృక్షజాలాన్ని సందర్శకులు దగ్గరగా చూడవచ్చు.

ఈ హబ్‌కు ప్రధాన కేంద్రంగా ఇండియన్ హెరిటేజ్ గార్డెన్ ఉందిఇది దేశవ్యాప్తంగా చారిత్రక ప్రాముఖ్యత గల ప్రాంతాల నుంచి సేకరించిఅభివృద్ధి చేసిన వారసత్వ చెట్లతో ఉంటుందిఈ ఉద్యానవనంలో ఫతేపూర్‌కు చెందిన 52 మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగానికి ప్రతీక అయిన బవాన్ ఇమ్లీ చింత చెట్టులక్నోకు చెందిన మదర్ దశహరి మామిడి చెట్టుప్రయాగ్‌రాజ్‌కు చెందిన పాటలపురి మర్రి చెట్టుచంపారన్‌లోని భితిహర్వాలో మహాత్మా గాంధీ నాటిన మామిడి చెట్టుగుజరాత్‌లోని చరిత్రాత్మక దండియాత్ర మార్గానికి సంబంధించిన చెట్ల వంశపారంపర్య మొక్కలున్నాయి.

స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఈ వారసత్వ చెట్లకు సంబంధించిన చరిత్రాత్మకసాంస్కృతికవృక్షశాస్త్ర సమాచారాన్ని సందర్శకులు తెలుసుకునేందుకు ఈ ఉద్యానవనంలో క్యూఆర్‌-ఆధారిత ఆడియో వ్యవస్థలను ఏర్పాటు చేశారుఇది ఈ ప్రాంగణాన్ని పరస్పర అభ్యాస ప్రదేశంగా మారుస్తుంది.

విభవ్ ఎన్‌క్లేవ్ భారతదేశంలోని అంతరించిపోతున్న మొక్కల ఉద్యానవనం... అరుదైనఅంతరించిపోతున్నప్రమాదంలో ఉన్న మొక్కల జాతుల కోసం ప్రత్యేకమైన ప్రదేశంఇది జీవవైవిధ్య నష్టంఆవాసాల క్షీణతవాతావరణ మార్పులుమొక్కల జన్యు వనరులను సంరక్షించాల్సిన అవసరంపై అవగాహన కల్పిస్తుందిభైరవ్ ఎన్‌క్లేవ్ భారతదేశ రాష్ట్రాల మొక్కల ఉద్యానవనం... వివిధ రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల అధికారిక రాష్ట్ర మొక్కలను ఒకచోట చేర్చివాటి పర్యావరణసాంస్కృతికవిశిష్టమైన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

మరో ప్రత్యేక ఆకర్షణ బాంబూస్టియంఇది 43 స్వదేశీవిదేశీ వెదురు జాతులతో రూపొందించినదిపర్యావరణ పునరుద్ధరణకార్బన్‌ను నిల్వ చేయటంమృత్తికా సంరక్షణస్థిరమైన జీవనోపాధిసంప్రదాయ హస్తకళలుగ్రీన్‌ మౌలిక సదుపాయాల్లో వెదురు ప్రాముఖ్యతను ఈ కేంద్రం వివరిస్తుంది.

ఈ కార్యక్రమంలో ప్రారంభించినబదిలీ చేసిన సాంకేతికతలుఉత్పత్తుల్లోనూ ఈ హబ్ విజ్ఞాన శాస్త్రాన్ని సమాజానికి చేరవేయటం ప్రతిబింబించిందిహిమాలయ సంస్థ సహకారంతో అభివృద్ధి చేసిన పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యానికి సంబంధించిన మూలికా సూత్రం అధికారికంగా ప్రారంభమైందిశాస్త్ర ఆధారిత విలువైన ఉత్పత్తుల ద్వారా మహిళా నేతృత్వంలోని వ్యవస్థాపకతనుజీవనోపాధిని పెంపొందించే ఉద్దేశంతో నాలుగు మొక్కల ఆధారిత సాంకేతికతలను కేరళలోని కుటుంబశ్రీ రాష్ట్ర పేదరిక నిర్మూలన మిషన్‌కు బదిలీ చేశారుఆ ఉత్పత్తులుహెర్బల్ యాంటి-డాండ్రఫ్ హెయిర్ కేర్ ఆయిల్ప్రోటస్లోటస్-ఇన్‌స్పైర్డ్ పర్ఫ్యూమ్ప్రోటస్రుద్ర పర్ఫ్యూమ్హెర్బల్ నానో సీరం.

పరిశ్రమలు-విద్యాసంస్థల సహకారాన్ని మరింత బలోపేతం చేస్తూ... లక్నోలోని విట్‌వే సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థకు తక్కువ ఖర్చుతో కూడిన ఫోటోబయోరియాక్టర్ రూపకల్పనఅభివృద్ధిని సీఎస్‌ఐఆర్‌-ఎన్‌బీఆర్‌ఐ బదిలీ చేసిందిశాస్త్రీయ సంస్థలో రూపుదిద్దుకున్న పరిశోధనలను విస్తృత సాంకేతికపారిశ్రామిక అనువర్తనాల కోసం ఎలా ముందుకు తీసుకెళ్లవచ్చో ఈ సాంకేతికత బదిలీ నిరూపిస్తుంది.

శాస్త్రీయ సంస్థలు కేవలం సమాచార ప్రసార సాధనాలుగా మాత్రమే ఉండిపోకుండా.. విజయగాథలనుసాంకేతిక విజయాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారుదీనివల్ల జీవనోపాధికిఆర్థిక అవకాశాలకు దోహదపడే పరిష్కారాల గురించి వినియోగదారులువాటాదారులకు అవగాహన కలుగుతుందన్నారుఈ కార్యక్రమంలో జరిగిన సాంకేతికత బదిలీలు ఈ విధానానికి ఒక ఆచరణాత్మక ఉదాహరణగా నిలిచాయిఇవి సంస్థాగత పరిశోధనలను వ్యవస్థాపకతపరిశ్రమలుజీవనోపాధి కల్పనతో అనుసంధానించాయి.

ప్రాజెక్టులులక్ష్యాలు ఒకే విధంగా ఉన్నప్పుడు... విభాగాలుమంత్రిత్వ శాఖలు సంస్థల మధ్య సమన్వయంతో కూడిన పని ప్రాముఖ్యతను స్పష్టం చేశారుఇటువంటి సహకారం ద్వారా పరస్పర శాస్త్రీయ సామర్థ్యాలను ఏకం చేసేందుకువిజయవంతమైన కార్యక్రమాలు మరింత విస్తృతమైన ప్రభావం చూపటానికి దోహదపడతాయని తెలిపారు.

మొక్కల శాస్త్ర పరిశోధనలను రైతులుపరిశ్రమలుసాధారణ ప్రజల కోసం సాంకేతికతలుగాఉత్పత్తులుగా మార్చటంలో సీఎస్‌ఐఆర్‌-ఎన్‌బీఆర్‌ఐ అందిస్తున్న కృషిని మంత్రి అభినందించారుభవిష్యత్తులో ఎదురయ్యే పర్యావరణవాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతలతో అనుసంధానించాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు.

భారతదేశ వృక్షసంపదనుమొక్కల వైవిధ్యంతో ముడిపడున్న సాంస్కృతికచారిత్రకపర్యావరణ ప్రాముఖ్యతను తెలియజేసే ఒక డాక్యుమెంటరీని ఈ కార్యక్రమంలో డాక్టర్ జితేంద్ర సింగ్ విడుదల చేశారు.

సీఎస్‌ఐఆర్‌-ఎన్‌బీఆర్‌ఐజమ్మూ సీఎస్‌ఐఆర్‌-ఐఐఐఎం డైరెక్టర్ డాక్టర్ జబీర్ అహ్మద్ ప్రసంగిస్తూ.. ముఖ్య అతిథికిఇతర ప్రముఖులకు స్వాగతం పలికారుఈ సందర్భంగా మొక్కల శాస్త్ర పరిశోధనపరిరక్షణసాంకేతిక అభివృద్ధిలో సంస్థ చేసిన కృషి గురించి మాట్లాడారుచర్చలుఅనుభవపూర్వక అభ్యాసం ద్వారా సందర్శకులు దేశ మొక్కల వారసత్వాన్ని అనుభూతి చెందటానికి వీలుగా ఈ ఎకో-ఎడ్యుకేషనల్ హబ్‌ను రూపొందించినట్లు చెప్పారుభారతదేశ వృక్షజాల వైవిధ్యానికి జీవనాధారమైన భాండాగారంగా ఇది ఉందని పేర్కొన్నారు.

వృక్షజాల వైవిధ్యంపరిరక్షణవారసత్వంశాస్త్రీయ పరిజ్ఞానానికి వేదికగా నిలుస్తూ అనుభవపూర్వక అభ్యాసంప్రజల భాగస్వామ్యం కోసం జాతీయ గమ్యస్థానంగా బాంథ్రా క్యాంపస్‌లోని ఎంపీబీసీ వద్ద ఎకో-ఎడ్యుకేషనల్ హబ్ రూపుదిద్దుకుందిసజీవ సేకరణలువారసత్వ మార్గాలు డిజిటల్ విశ్లేషణసాంకేతికత ఆధారిత కార్యక్రమాల ద్వారా ఈ హబ్... ప్రజలకుప్రకృతికి మధ్య బలమైన అనుబంధాన్ని పెంపొందించటంతో పాటు శాస్త్రీయ సంస్థలకుసమాజానికి మధ్య అనుసంధానాన్ని బలపరిచే ప్రయత్నం చేస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2296682) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Tamil