మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
8,500 కి.మీ సోలో సైకిల్ యాత్ర పూర్తి చేసిన ఆశా మాలవీయను
అభినందించిన కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రి ఠాకూర్
మహిళా సాధికారత, దేశభక్తి, ధైర్యం... గొప్ప సందేశంతో సాహస యాత్ర పూర్తి
प्रविष्टि तिथि:
05 AUG 2026 6:44PM by PIB Hyderabad
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రి ఠాకూర్ ఇలా పేర్కొన్నారు.
‘‘ప్రముఖ సోలో సైక్లిస్ట్, అథ్లెట్, పర్వతారోహకురాలైన ఆశా మాలవీయను నేడు న్యూఢిల్లీలో కలవడం ఆనందంగా ఉంది. మహిళా సాధికారత, దేశభక్తి, అజేయమైన ధైర్యసాహసాల సందేశాన్ని చాటుతూ.. దేశపు పశ్చిమ చివరి భాగం నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని కిబితు వరకు 8,500 కిలోమీటర్ల సుదీర్ఘమైన సోలో సైకిల్ యాత్రను ఆమె ఎంతో స్ఫూర్తిదాయకంగా పూర్తి చేశారు. ఆశా మాలవీయ సాధించిన ఈ అద్భుతమైన విజయానికి నా హృదయపూర్వక అభినందనలు. ఆమె ఇలాగే ఎంతోమంది యువతులకు పెద్ద కలలు కనేందుకు, సవాళ్లను అధిగమించి ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను"
(रिलीज़ आईडी: 2295292)
आगंतुक पटल : 13