సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జలాంతర సాంస్కృతిక వారసత్వం

प्रविष्टि तिथि: 30 JUL 2026 3:44PM by PIB Hyderabad

   భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) పరిధిలోని జలాంతర పురావస్తు విభాగం ప్రస్తుతం ద్వారక-బేట్ ద్వారక (గుజరాత్), మహాబలిపురం (తమిళనాడు), కారైకల్ (పుదుచ్చేరి) ప్రాంతాల్లో పరిశోధన-అన్వేషణ కార్యకలాపాలు చేపట్టింది.

మరోవైపు తమిళనాడులోని పూంపుహార్ వద్ద ఇదే తరహా కార్యకలాపాల కోసం ఆ రాష్ట్ర పురావస్తు శాఖ కేంద్ర ప్రభుత్వం లైసెన్స్‌ జారీ చేసింది. అలాగే, గుజరాత్‌లోని బేట్ ద్వారక, ఛారి, గంగాట బేట్ వద్ద జలాంతర తవ్వకాలు-అన్వేషణకు నిమిత్తం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ పరిధిలోని మెరైన్ ఆర్కియాలజీ సెంటర్‌కు లైసెన్సు ఇచ్చింది.

ఏఎస్‌ఐ పరిధిలోని జలాంతర పురావస్తు విభాగం బడ్జెట్ వివరాలు కిందివిధంగా ఉన్నాయి:

సంవత్సరం

కేటాయింపు (రూ.లలో)

వ్యయం (రూ.లలో)

2025-26

75,40,000/-

74,91,064/-

2026-27

66,50,000/-

25,63,894/-

ఇక తమిళనాడు రాష్ట్ర పురావస్తు శాఖకు భూ ఉపరితల, జలాంతర పురావస్తు తవ్వకాల కోసం రూ.7 కోట్లతోపాటు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి రూ.20 లక్షలు వంతున నిధులు కేటాయించింది.

ఈ నేపథ్యంలో పురావస్తు శాస్త్రవేత్తలకు శిక్షణనివ్వడం సహా నీటిలో మునిగి ఉన్న ప్రదేశాలపై సర్వే నిర్వహణ కోసం ఏఎస్‌ఐ పరిధిలోని జలాంతర పురావస్తు విభాగం ఒక ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

దేశంలో 2030 దాకా జలాంతర అన్వేషణ/తవ్వకాలకు కింది ప్రదేశాలను ఎంపిక చేశారు:

·        ద్వారక, బేట్ ద్వారక (గుజరాత్)

·        విజయ దుర్గ్ (మహారాష్ట్ర)

·        జంజీరా (మహారాష్ట్ర)

·        కారైకల్ (పుదుచ్చేరి)

·        మహాబలిపురం (తమిళనాడు)

కేంద్ర సాంస్కృతిక-పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ నేడు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా జవాబిస్తూ ఈ వివరాలు తెలిపారు.

***


(रिलीज़ आईडी: 2291911) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी