నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
పీఎంకేవీవై ద్వారా ఉపాధికల్పన
प्रविष्टि तिथि:
29 JUL 2026 4:22PM by PIB Hyderabad
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) ప్రస్తుత వెర్షను.. పీఎంకేవీవై 4.0..ను 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి అమలుచేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా, శిక్షణను పొందిన అభ్యర్థులకు వివిధ కెరియర్ మార్గాల్ని ఎంపిక చేసుకొనేలా సాధికారతను సమకూరుస్తారు. వారికి ఆన్-జాబ్ ట్రయినింగ్ (ఓజేటీ) పద్ధతిలో పరిశ్రమకు సంబంధించిన నైపుణ్య ఆధారిత పాఠ్యక్రమాలను బోధించి సమర్థులుగా తీర్చిదిద్దడం ఈ పథకం ఉద్దేశం.
నాణ్యతనీ, జవాబుదారీతనాన్నీ నిర్ధారించడానికి పీఎంకేవీవైని తరచుగా అంచనా వేస్తోంది. ఈ మధ్యే, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖకు చెందిన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అయిన ‘అరుణ్ జైట్లీ జాతీయ ఆర్థిక సంస్థ’ (ఏజేఎన్ఐఎఫ్ఎమ్) ‘పీఎంకేవీవై 4.0’పై స్వతంత్ర తృతీయ పక్షం పరిశీలనను చేపట్టింది. ఈ ప్రక్రియను అస్సాం రాష్ట్రంతో పాటు దేశమంతటా పూర్తి చేశారు. స్వల్ప కాలిక శిక్షణను (ఎస్టీటీ) పొందిన అభ్యర్థులకు ఉపాధికల్పన అవకాశాలను చెప్పుకోదగిన స్థాయిలో మెరుగుపరిచే దిశగా పీఎంకేవీవై తోడ్పడినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఉపాధిని పొందిన, స్వయంఉపాధికి మొగ్గు చూపిన ఎస్టీటీ అభ్యర్థులు పీఎంకేవీవై శిక్షణను పొందక ముందు 26.6 శాతంగా ఉంటే, శిక్షణను తీసుకున్న తరువాత 45.4 శాతానికి చేరారు. అంటే వీరి విషయంలో 18.8 శాతం వృద్ధి నమోదైంది. ఆదాయానికి సంబంధించిన ఫలితాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. శిక్షణ పూర్తి చేసి, ధ్రువపత్రాలను అందుకున్న తరువాత 41.4 శాతం ఎస్టీటీ అభ్యర్థులతో పాటు 48.9 శాతం రికగ్నిషన్ ఆఫ్ ప్రయర్ లెర్నింగ్ (ఆర్పీఎల్) అభ్యర్థులు తమ ఆదాయాన్ని పెంచుకున్నట్లు తేలింది.
కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికత్వం (ఎమ్ఎస్డీఈ) శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ జయంత్ చౌధరీ ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారాన్ని తెలియజేశారు.
***
(रिलीज़ आईडी: 2291285)
आगंतुक पटल : 9