గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మదనపల్లె ముస్తాబవుతోందిలా…!

प्रविष्टि तिथि: 27 JUL 2026 3:01PM by PIB Hyderabad

 

స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 స్ఫూర్తితో మదనపల్లె మున్సిపాలిటీ పురోగమిస్తోందిశాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణసుస్థిర పద్ధతులతో వనరుల పునరుద్ధరణ ద్వారా.. పట్టణ పారిశుద్ధ్యానికి సరికొత్త రూపునిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె పురపాలక సంఘం శాస్త్రీయసుస్థిర విధానాలతో పట్టణ పారిశుద్ధ్యంఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేస్తోందివేగవంతమైన పట్టణీకరణ పరిస్థితులూవెలువడుతున్న వ్యర్థాల్లో పెరుగుదల నేపథ్యంలో.. వాటిని ఎదుర్కోవడం కోసం ఒక క్రమబద్ధమైనసమగ్ర విధానాన్ని ఈ మున్సిపాలిటీ అవలంబించిందివ్యర్థాలను వేరు చేయడంశాస్త్రీయంగా వాటి ప్రాసెసింగ్వనరుల పునరుద్ధరణపై దృష్టి సారిస్తూ.. ‘వ్యర్థాల రహిత నగరం (జీరో వేస్ట్ సిటీ)గా మదనపల్లెను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మదనపల్లెలో రోజూ దాదాపు 62 టన్నుల పురపాలక ఘన వ్యర్థాలు వెలువడుతున్నాయిఇందులో 25.50 టన్నుల పొడి వ్యర్థాలు, 36 టన్నుల తడి వ్యర్థాలు, 0.50 టన్నుల గృహ సంబంధిత ప్రమాదకర వ్యర్థాలు ఉన్నాయిసమర్థంగా ఈ వ్యర్థాల నిర్వహణ కోసం.. వ్యర్థాలు వెలువడే చోటే వాటిని వేరుచేసే క్రమబద్ధమైన విధానాన్ని పట్టణమంతటా అమలు చేశారుస్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 లక్ష్యాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ... వ్యర్థ పదార్థాలను జీవవిచ్ఛిన్నజీవ విచ్ఛిన్నం కానిసృజనాత్మక పునర్వినియోగ వ్యర్థాలుగా వర్గీకరిస్తున్నారుశాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెసింగుకూమెరుగైన పునర్వినియోగ పద్ధతులకూపర్యావరణ హిత రీతిలో వ్యర్థాల తొలగింపునకూ ఇది దోహదపడుతోంది.

వికేంద్రీకృతసుస్థిర పద్ధతుల్లో జీవవిచ్ఛిన్న వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణపై మదనపల్లె పురపాలక సంఘం ప్రధానంగా దృష్టి సారిస్తోందిభారీగా వ్యర్థాలను వెలువరించే సంస్థలను తమ ప్రాంగణంలోనే కంపోస్టు తయారీ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారుప్రజలు కూడా ఇంటి వద్దే కంపోస్టు తయారీనీమిద్దె తోటల పెంపకాన్నీ అవలంబిస్తున్నారుదీంతో తడి వ్యర్థాలను వెలువడే చోటే నిర్వహించేందుకు వీలవుతుందిప్రతిరోజూ మున్సిపల్ కంపోస్టు యార్డులో విండ్రో కంపోస్టింగ్ పద్ధతి ద్వారా దాదాపు 15.50 టన్నుల తడి వ్యర్థాలను ప్రాసెస్ చేస్తున్నారుదీనివల్ల దాదాపు 4.65 టన్నుల ఎరువు తయారవుతుండగా.. పట్టణంలోని పార్కులుమొక్కల పెంపకంతోటలకు సంబంధించిన కార్యకలాపాల కోసం దీనిని ఉపయోగిస్తున్నారుఅదనంగా మరో టన్నుల తడి వ్యర్థాల నుంచి వర్మి కంపోస్టింగ్ ద్వారా దాదాపు 1.20 టన్నుల పోషక విలువలతో కూడిన ఎరువును తయారు చేస్తున్నారువ్యర్ధాల కోసం ఉపయోగించిన గోతుల్ని పూడ్చాల్సిన అవసరం లేకుండా.. వ్యర్థాల సుస్థిర వినియోగాన్నీ ప్రోత్సహిస్తోంది.


పట్టణంలో వెలువడే పొడి వ్యర్థాలను.. పునర్వినియోగించదగినపునర్వినియోగించలేని రకాలుగా ఇంటి వద్దనే క్రమబద్ధంగా వేరు చేస్తున్నారుపునర్వినియోగానుకూల పదార్థాలను.. పదార్థ పునరుద్ధరణ కేంద్రానికి (ఎంఆర్ఎఫ్పంపుతారుఅక్కడ వాటిని ప్రాసెస్ చేసివనరుల పునరుద్ధరణ కోసం ఆధీకృత పునర్వినియోగ యూనిట్లకు తరలిస్తారు.

పునర్వినియోగానికి వీలు కాని వ్యర్థాలను కో-ప్రాసెసింగ్ కోసం సిమెంటు పరిశ్రమలకు తరలిస్తున్నారుఇది వ్యర్థాల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడమే కాకుండామున్సిపాలిటీకి అదనపు ఆదాయం సమకూరేందుకు కూడా దోహదపడుతోందివెలువడే చోటే వ్యర్థాలను సరైన విధంగా వేరుచేయడం ద్వారా.. పునర్వినియోగానుకూల వ్యర్థాల ఉష్ణ జనక విలువను మదనపల్లె మెరుగుపరిచిందిఅలాగే డంపింగ్ ప్రదేశాలకు చేరే మిశ్రమ వ్యర్థాల పరిమాణాన్ని కనిష్ట స్థాయికి తగ్గించింది.

ఇంటింటికీ తిరిగి వ్యర్థాల సేకరణ కార్యక్రమాలు, ప్రస్తుత ‘రెడ్యూస్రీయూజ్రీసైక్లింగ్ (ఆర్ఆర్ఆర్)’ కేంద్రం ద్వారా.. -వ్యర్థాలుపాత దుస్తులుబొమ్మలుపుస్తకాలుపాదరక్షల వంటి వస్తువులను పురపాలక సంఘం సేకరిస్తోందిఈ వస్తువులను పునరుద్ధరించడమోపునర్వినియోగించడమోలేదా మురికి వాడల్లోనోనిరాశ్రయులకోవృద్ధాశ్రయాల్లోనో పంపిణీ చేయడమో చేస్తున్నారు.

వ్యర్థం నుంచి కళాత్మకత’ దిశగా మదనపల్లె మున్సిపాలిటీ కొన్ని కార్యక్రమాలను చేపట్టిందిపారేసిన టైర్లను ఇందుకోసం ఉపయోగిస్తోందివ్యర్థ పదార్థాలతో రూపొందించిన కళాకృతులతో ప్రభుత్వ స్థలాలనూపార్కులనూ సుందరీకరిస్తున్నారుఇది డంప్‌యార్డుల వద్ద వ్యర్థ రాహిత్యానికి (జీరో డంపింగ్దోహదపడడమే కాకుండాపర్యావరణ అవగాహనను కూడా పెంపొందిస్తుంది.

 

బయో మైనింగ్బయో రెమిడియేషన్ ద్వారా మదనపల్లె దాదాపు 36,512 మెట్రిక్ టన్నుల పాత వ్యర్థాలను విజయవంతంగా శుద్ధి చేసిదాదాపు 9.40 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకుందితిరిగి స్వాధీనం చేసుకున్న ఈ భూమిలో దాదాపు ఎకరాల్లో మొక్కలను పెంచి.. ఒకప్పుడు డంపింగ్‌ యార్డులుగా ఉన్న ప్రాంతాలను పచ్చని పట్టణ ప్రాంతాలుగా తీర్చిదిద్దారువ్యర్థాల నుంచి తయారు చేసిన ఇంధనం (ఆర్డీఎఫ్వంటి పునరుద్ధరించిన పదార్థాలను.. కో ప్రాసెసింగ్ కోసం సిమెంటు ప్లాంట్లకు పంపిస్తున్నారుఅలాగే లోతట్టు ప్రాంతాలను నింపడానికీశాస్త్రీయంగా వ్యర్థాల వినియోగాన్ని ప్రోత్సహించడానికీపర్యావరణాన్ని మెరుగుపరచడానికీ మట్టినీఇతర జడ పదార్థాలనూ ఉపయోగిస్తారు.

 

గోడలపై పెయింటింగులూ, చిత్రాలతో పారిశుద్ధ్యానికివ్యర్థాలను వేరు చేయడానికీ ప్రాచుర్యం కల్పిస్తున్నారుపారిశుద్ధ్యం వల్ల బహిరంగ ప్రదేశాలు చైతన్యవంతమైన అవగాహన వేదికలుగా మారాయిఎన్వీఆర్ లే అవుట్ లోని ‘వేస్ట్ టు ఆర్ట్ పార్కు’ ఆవిష్కరణకూసుస్థిరతకూ ప్రతీకగా నిలుస్తోందిపనికిరాని పదార్థాలను సృజనాత్మక పద్ధతిలో ఉపయోగకరమైనసౌందర్యవంతమైన బహిరంగ కళాకృతులుగా మలచగల తీరుకు ఇది అద్దం పడుతోంది.

స్వచ్ఛ భారత్ మిషన్ - అర్బన్ 2.0 లక్ష్యాలకు అనుగుణంగాబలమైన పరిపాలన నాయకత్వంశాస్త్రీయంగా వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలుక్రియాశీల సామాజిక భాగస్వామ్యం ద్వారా... చెత్త కుప్పలు లేనిచెత్తాచెదారం లేని నగరంగా మారే దిశగా మదనపల్లె క్రమంగా పురోగమిస్తోందికంపోస్టింగుపునర్వినియోగంసృజనాత్మక పునర్వినియోగంబయోమైనింగ్పాత వ్యర్థాల పునరుద్ధరణప్రజల భాగస్వామ్యంతో.. సుస్థిరమైనపర్యావరణపరంగా బాధ్యతాయుతమైన నగరాలను పట్టణ స్థానిక సంస్థలు నిర్మించగల తీరుకు మున్సిపాలిటీ అవలంబించే ఈ సమీకృత విధానం నిదర్శనం.

 

***


(रिलीज़ आईडी: 2290207) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil