బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు వాయువీకరణ లక్ష్యాలు

प्रविष्टि तिथि: 20 JUL 2026 4:24PM by PIB Hyderabad

జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్ కింద 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు వాయువీకరణ సామర్థ్యాన్ని సాధించాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇప్పటి వరకు సుమారు 22.6 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం గల ప్రాజెక్టులు కార్యాచరణలోకి రావడం లేదా అమలు దశలో ఉన్నాయి. వాటిలో

 

1. జిందాల్ స్టీల్ లిమిటెడ్ (జేఎస్‌ఎల్‌): దాదాపు 8 ఎంటీపీఏ (ప్రస్తుతం నడుస్తోంది)

 

2. తాల్చేర్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (టీఎఫ్‌ఎల్‌): దాదాపు 2.6 ఎంటీపీఏ (అమలు దశలో ఉంది)

 

3. రూ.8,500 కోట్ల ఆర్థిక ప్రోత్సాహక పథకం కింద ఆమోదించిన 8 ప్రాజెక్టులు: దాదాపు 12 ఎంటీపీఏ (అమలు దశలో ఉన్నాయి)

 

100 మిలియన్ టన్నుల  బొగ్గును వాయువుగా మార్చాలనే జాతీయ లక్ష్యాన్ని చేరుకోవడంలో మరింత పురోగతి సాధించడానికి రూ. 37,500 కోట్ల ఆర్థిక వ్యయంతో ఉపరితల బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం ప్రభుత్వం 2026 మే 13న మరో పథకాన్ని ఆమోదించింది. ఈ కొత్త పథకం ద్వారా సుమారు 75 ఎంటీపీఏ బొగ్గును వినియోగించే అవకాశం ఉంటుంది. ఇది 100 మిలియన్‌ టన్నుల బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ జాతీయ లక్ష్యాన్ని సాధించడంలో ఇది గణనీయంగా దోహదపడుతుందని అంచనా. 

 

బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను అధికంగా ఆకర్షించడానికి కొత్త పథకం కింద ఆర్థిక ప్రోత్సాహక వ్యవస్థను ప్రభుత్వం మరింత బలోపేతం చేసింది. 2024 జనవరి 24న ఆమోదించిన రూ. 8,500 కోట్ల పాత పథకంలో మూలధన వ్యయంపై గరిష్ట పరిమితులకు లోబడి 15 శాతం వరకు ప్రోత్సాహకం ఉండేది. నూతనంగా తీసుకొచ్చిన రూ. 37,500 కోట్ల పథకంలో బొగ్గు,లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అర్హత కలిగిన ప్లాంటు, యంత్రాల వ్యయంపై గరిష్ట పరిమితులకు లోబడి 20 శాతం వరకు ప్రోత్సాహకాలు అందిస్తుంది.

 

బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రక్రియ ద్వారా బొగ్గు నుంచి రసాయనాలు, మిథనాల్, సింథటిక్ సహజ వాయుల ఉత్పత్తులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీని కోసం ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడం, బొగ్గు లభ్యతను సులభతరం చేయడం, నియంత్రణ మద్దతును పెంచడం, అనుమతులను సరళీకృతం చేయడం, స్వదేశీ సాంకేతికతలను ప్రోత్సహించడం వంటి చర్యలు తీసుకుంటోంది. దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి అనుకూలమైన విధానపరమైన వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

 

 ఈ సమాచారాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే నేడు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు.

 

***


(रिलीज़ आईडी: 2286715) आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil