ప్రధాన మంత్రి కార్యాలయం
58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో స్వర్ణ పతకాలు సాధించిన భారతీయ విద్యార్థులను అభినందించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
19 JUL 2026 7:09PM by PIB Hyderabad
ప్రతిష్ఠాత్మక 58వ అంతర్జాతీయ రసాయన శాస్త్ర ఒలింపియాడ్లో భారత బృందం నాలుగు స్వర్ణ పతకాలను సాధించింది. ఈ ప్రపంచస్థాయి పోటీలో భారత్ తరపున అత్యుత్తమ ప్రదర్శన చేసిన దేబదత్త ప్రియదర్శి, హర్షిత్ సింఘాల్, కబీర్ చిల్లర్, సందీప్ కుచిలతో కూడిన భారత బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు. ఈ బృందం ప్రతిభ, అంకితభావం, విజ్ఞానశాస్త్రం పట్ల ఉన్న వారి అభిరుచి యావత్ దేశానికి గర్వకారణమన్నారు. ఇది అనేక మంది యువత రసాయన శాస్త్రాన్ని అభ్యసించి, అందులో రాణించడానికి స్ఫూర్తినిస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
భారత యువశక్తి ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేస్తూనే ఉంది!
58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో స్వర్ణ పతకాలు సాధించిన దేబదత్త ప్రియదర్శి, హర్షిత్ సింఘాల్, కబీర్ చిల్లర్, సందీప్ కుచిల బృందానికి అభినందనలు. ఈ ప్రతిష్ఠాత్మక వేదికపై భారత్ సాధించిన అత్యుత్తమ ప్రదర్శన ఇది.
వారి ప్రతిభ, అంకితభావం, విజ్ఞానశాస్త్రం పట్ల ఉన్న వారికున్న అభిరుచి యావత్ దేశానికి గర్వకారణం. రసాయన శాస్త్రాన్ని అభ్యసించి, అందులో రాణించడానికి ఇది మరింత మందికి స్ఫూర్తినిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2286432)
आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Manipuri
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Gujarati