ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

ఉత్తరప్రదేశ్‌లోని జాతీయ రహదారి- 19, వారణాసి రింగ్ రోడ్డు నడుమ


కొత్తగా 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్, మెట్ల మార్గాలు/ ర్యాంపు, పాదచారుల వంతెనల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం

ఎన్‌హెచ్ (ఓ) కింద రూ. 14447.64 కోట్ల మూలధన వ్యయంతో హ్యామ్ పద్ధతిలో ప్రాజెక్టు

प्रविष्टि तिथि: 15 JUL 2026 3:07PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరంలో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా.. జాతీయ రహదారి-19, వారణాసి రింగ్ రోడ్ మధ్య గంగా నది తీరం వెంబడి సరికొత్త లింక్/కనెక్టర్ కారిడార్ నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందిప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారుమొత్తం 46.039 కిలోమీటర్ల ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ‘మిశ్రమ వార్షిక చెల్లింపు విధానం (హ్యామ్)’లో చేపట్టనున్నారుదీని మొత్తం వ్యయం రూ.14,447.64 కోట్లు కాగా.. ఇందులో సివిల్ నిర్మాణ పనుల కోసం రూ.6,037.85 కోట్లు (జీఎస్టీ మినహా ప్రజా సదుపాయాల మార్పిడి వ్యయం సహా), జాతీయ రహదారుల (కింద భూసేకరణ కోసం రూ.541.11 కోట్లు కేటాయించారుఆరు వరుసల ఎత్తయిన ప్రధాన వాహన మార్గాన్నీప్రత్యేక ఆకర్షణగా నిలిచే కేబుల్ వంతెననూఅత్యాధునిక సాంకేతికతతో వాహనదారులూ పాదచారులిద్దరికీ సేవలందించే ప్రత్యేకమైన వంతెననూమెట్ల మార్గాలూర్యాంపు మార్గాలూలింక్ రోడ్లనూ ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్నారు.

 

ఈ ప్రాజెక్టు ద్వారా జాతీయ రహదారి-19, వారణాసి రింగ్ రోడ్డుల మధ్య అంతరాయాల్లేకుండా సాఫీగా ప్రయాణించవచ్చుదీనివల్ల నగర రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గడమే కాకుండానగరంలో రవాణా సదుపాయాలు మెరుగువుతాయిగంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా ఈ కారిడార్‌ను రూపొందించారుఈ ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాల్లో సగటు ప్రయాణ సమయం ప్రస్తుతం 60 నిమిషాలుగా ఉండగా.. అది 20 నిమిషాలకు తగ్గుతుందని అంచనాఅంటే దాదాపు 67 శాతం ప్రయాణ సమయం ఆదా అవుతుందిఅలాగే జాతీయ రహదారి-19 నుంచి కాశీ రైల్వే స్టేషన్‌కు చేరుకునే సమయం కూడా దాదాపు 50 నిమిషాల నుంచి 25 నిమిషాలకు తగ్గుతుందిదాంతో ప్రయాణికులకు 25 నిమిషాల సమయం (దాదాపు 50 శాతంకలిసివస్తుంది.

 

పీఎం గతిశక్తి జాతీయ బృహత్ప్రణాళికకు అనుగుణంగా నిర్మిస్తున్న ఈ కారిడార్.. బహు విధ రవాణా సాధనాల ద్వారా అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయనుందిప్రధాన జాతీయ రహదారులురైల్వే స్టేషన్లులాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయంరామ్‌నగర్ ఐడబ్ల్యూఏఐ ఓడరేవులకు అంతరాయాల్లేకుండా రాకపోకలు సాగించేందుకు వీలు కల్పిస్తుందిఅదే సమయంలో కాశీ విశ్వనాథ ఆలయంబనారస్ హిందూ విశ్వవిద్యాలయంనమో ఘాట్రామ్‌నగర్ కోటవారణాసి ఘాట్‌ల వంటి ప్రముఖ ఆధ్యాత్మికవిద్యాసాంస్కృతిక కేంద్రాలకు రవాణా సదుపాయాన్ని ఈ ప్రాజెక్టు గణనీయంగా మెరుగుపరుస్తుందిఈ విధంగా కీలక ఆర్థికసామాజికసరుకు రవాణా కేంద్రాలను అనుసంధానించడం ద్వారా.. ఈ ప్రాజెక్టు రవాణా సామర్థ్యాన్ని పెంచుతుందిరోడ్డు భద్రతను మెరుగుపరుస్తుందిపర్యాటకంతీర్థయాత్రలు మరింత సులభతరమవుతాయితూర్పు ఉత్తరప్రదేశ్‌లో సుస్థిర ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి ఈ ప్రాజెక్టు తోడ్పడుతుంది.

 

జాతీయ రహదారి-19, వారణాసి రింగ్ రోడ్డు (జాతీయ రహదారి – 135బీ), రామ్‌ నగర్/బీహెచ్‌యూఇతర ప్రధాన పట్టణ ప్రాంతాల మధ్య వేగవంతమైననియంత్రిత ప్రవేశం కలిగిన అనుసంధానాన్ని కల్పించడం ద్వారా.. వారణాసిచందౌలీలలోని రహదారులపై రద్దీని తగ్గించే విప్లవాత్మక పట్టణ రవాణా ప్రాజెక్టుగా ఈ కారిడార్‌ను రూపొందించారుఏటా 15 కోట్ల మందిరి పైగా పర్యాటకులుయాత్రికులు వారణాసిని సందర్శిస్తున్న నేపథ్యంలో.. కాశీ విశ్వనాథ ఆలయంబెనారస్ హిందూ విశ్వవిద్యాలయంనమో ఘాట్రామ్‌నగర్ కోటవారణాసి ఘాట్లుకాశీ రైల్వే స్టేషన్‌ వంటి ప్రముఖ మతపరమైనవిద్యాపరమైనసాంస్కృతిక ప్రదేశాలకు రవాణా సదుపాయాలను ఈ ప్రాజెక్టు గణనీయంగా మెరుగుపరుస్తుందిఅదే సమయంలో నగరంలోని ప్రస్తుత రహదారులపై రద్దీని గణనీయంగా తగ్గిస్తుందిబీహెచ్‌యూ/లంకసామ్నే ఘాట్ల మధ్య నిర్మించనున్న ఎత్తయిన మార్గంతో స్థానిక ప్రయాణాలనూఇతర ప్రధాన ప్రయాణాలనూ వేరు చేయడం ద్వారా.. అత్యంత రద్దీగా ఉండే లంక జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది.

 

నియంత్రిత రాకపోకల ద్వారా ఈ ప్రాజెక్టు రహదారి భద్రతను మెరుగుపరుస్తుంది. వాహన నిర్వహణ ఖర్చులనుఉద్గారాలను తగ్గిస్తుందిప్రయాణంలో విశ్వసనీయతను పెంచుతుందిప్రయాణాలుసరుకు రవాణాలో సామర్థ్యాన్ని పెంచుతుందిజనసాంద్రత అధికంగా ఉన్న పట్టణ కేంద్రం నుంచి ట్రాఫిక్‌ను మళ్లించడం ద్వారా... జాతీయ రహదారి-19, బీహెచ్‌యూ -రామ్‌నగర్ కారిడార్జాతీయ రహదారి-35లపై రద్దీని కూడా తగ్గిస్తుంది.

 

అనేక అద్భుతమైన ఇంజినీరింగ్ విశేషాలు ఈ ప్రాజెక్టులో ఉన్నాయిగంగానదిపై 910 మీటర్ల పొడవైన అద్భుతమైన కేబుల్ వంతెననూకాశీ విశ్వనాథుడి ఆలయానికి పాదచారులు తేలిగ్గా చేరుకునేందుకు 1.32 కిలోమీటర్ల ఎక్స్‌ట్రాడోజ్డ్ ఉమ్మడి వంతెనను నిర్మిస్తున్నారుఅలాగే ప్రస్తుత/ప్రతిపాదిత మాలవీయ వంతెనపై రైల్ ఓవర్ బ్రిడ్జిఅత్యవసరంగా వాహనాలను నిలిపి ఉంచేందుకు ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలుశబ్ద కాలుష్య నిరోధక ఏర్పాట్లువారణాసి సాంస్కృతిక వారసత్వ స్ఫూర్తిని చాటేలా ముఖద్వారాలపై లైటింగ్ వంటి విశేషాలున్నాయిఇవి రవాణా సామర్థ్యాన్ని పెంచడమే కాకుండానగర రూపురేఖలను మారుస్తాయివారణాసికి సరికొత్త హంగులను చేకూర్చి.. దేశంలోని అత్యంత ప్రధానమైన ఆధ్యాత్మికసాంస్కృతిక కేంద్రంగా నగరం స్థానాన్ని ఇవి మరింత సుస్థిరం చేయనున్నాయి.

 

పీఎం గతిశక్తి జాతీయ బృహత్ప్రణాళికకు అనుగుణంగా రూపొందించిన ఈ కారిడార్.. బహువిధ రవాణా అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందిఈ ప్రాజెక్టు ద్వారా ఒక ఆర్థిక కేంద్రం (చందౌలీ సెజ్), ఒక సామాజిక కేంద్రం (అభిలషణీయ జిల్లా అయిన చందౌలీ)తోపాటు ఆరు ప్రధాన సరుకు రవాణా కేంద్రాలైన లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయంకాశీ రైల్వే స్టేషన్బనారస్ రైల్వే స్టేషన్వారణాసి నగర రైల్వే స్టేషన్పండిత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్రామ్‌నగర్ ఐడబ్ల్యూఏఐ ఓడరేవులను పరస్పరం అనుసంధానించనున్నారుఈ ప్రధాన రవాణా కేంద్రాలనూకాశీ విశ్వనాథ ఆలయంబనారస్ హిందూ విశ్వవిద్యాలయంనమో ఘాట్రాంనగర్ కోటవారణాసి ఘాట్ల వంటి ప్రముఖ పర్యాటక స్థలాలతో అంతరాయాల్లేకుండా అనుసంధానించడం ద్వారా.. బహువిధ రవాణా సమన్వయాన్ని ఈ ప్రాజెక్టు మెరుగుపరుస్తుందిసరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడంతోపాటు.. పర్యాటకంతీర్థయాత్రలను మరింత సులభతరం చేస్తుందితద్వారా తూర్పు ఉత్తరప్రదేశ్‌లో సుస్థిర ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుంది.

 

మొత్తమ్మీద ప్రతిపాదిత గంగా ఎలివేటెడ్ కారిడార్ వారణాసిలో ఒక అత్యాధునిక, అత్యున్నత నగర రవాణా మార్గంగా నిలవనుందిమరింత వేగవంతమైనసురక్షితమైనఅత్యంత నమ్మకమైన రవాణా సదుపాయాన్ని అందించడంట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించడంబహువిధ రవాణా సమన్వయాన్ని బలోపేతం చేయడంపర్యాటకఆధ్యాత్మిక మౌలిక వసతులను పెంపొందించడం ద్వారా.. ఈ ప్రాజెక్టు నగరంలో రవాణా వ్యవస్థ రూపురేఖలను పూర్తిగా మార్చేస్తుందిపీఎం గతి శక్తివికసిత భారత్ దార్శనికతలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో సుస్థిర ఆర్థిక వృద్ధికి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు తోడ్పడనుంది.

 

***


(रिलीज़ आईडी: 2284985) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Malayalam , Urdu , Marathi , हिन्दी , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada