ప్రధాన మంత్రి కార్యాలయం
విజ్ఞానం, నైపుణ్యాలు, ఆరోగ్యం గురించి వివరించే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధాని
प्रविष्टि तिथि:
15 JUL 2026 12:12PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంస్కృత శ్లోకాన్ని పంచుకున్నారు. విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవడం, ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భారత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో దేశ యువత బలమైన శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నారు. ఈ లక్షణాలు వ్యక్తులను శక్తిమంతం చేయడమే కాకుండా.. దేశాభివృద్ధికి గణనీయమైన రీతిలో తోడ్పాటును అందిస్తాయి.
ప్రధానమంత్రి పంచుకున్న సంస్కృత శ్లోకం –
‘‘ధన్యానాముత్తమం దాక్ష్యం ధనానాముత్తమం శ్రుతమ్ |
లాభానాం శ్రేయ ఆరోగ్యం సుఖానాం తుష్టిరుత్తమా || ’’
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి పోస్టు:
విద్యతో వివేకం, నైపుణ్యంతో అభివృద్ధి సాధ్యమవుతుంది. మంచి ఆరోగ్యంతో ప్రతి సంకల్పమూ నెరవేరుతుంది. ఇప్పుడు మన యువత ఈ గుణాలను అలవర్చుకొని దేశ గుర్తింపును మరింత బలోపేతం చేస్తున్నారు.
ధన్యానాముత్తమం దాక్ష్యం ధనానాముత్తమం శ్రుతమ్ |
లాభానాం శ్రేయ ఆరోగ్యం సుఖానాం తుష్టిరుత్తమా ||
***
(रिलीज़ आईडी: 2284791)
आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam