సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

7.81 కోట్లకు పైగా యువత, 5.24 కోట్ల మందికి పైగా మహిళలు, 17 లక్షల విద్యా సంస్థలతో సహా దేశవ్యాప్తంగా 23 కోట్ల మందికి పైగా ప్రజలకు చేరువైన ఎన్ఎంబీఏ


ఆరోగ్యకరమైన, క్రమశిక్షణ గల యువతపై దృష్టి సారించే ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ దేశ నిర్మాణంలో కీలక కార్యక్రమం: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్

మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాల ఆధారిత విధానాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ప్రతిష్ఠాత్మక ప్రచారమే నషా ముక్త్ భారత్ అభియాన్: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రి శ్రీ రామ్‌దాస్ అథవాలే

యువత, మహిళలు, సమాజాన్ని భాగస్వాములను చేస్తూ మాదకద్రవ్య రహిత భారతదేశ నిర్మాణంపై దృష్టి సారించిన జాతీయ కార్యక్రమం నషా ముక్త్ భారత్ అభియాన్: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రి శ్రీ బి.ఎల్. వర్మ

प्रविष्टि तिथि: 08 JUL 2026 3:32PM by PIB Hyderabad

దేశంలో మాదకద్రవ్యాలను అరికట్టేందుకు కేంద్ర సామాజిక న్యాయంసాధికారత మంత్రిత్వ శాఖ ఆగస్టు 15, 2020న నషా ముక్త్ భారత్ అభియాన్ (ఎన్ఎంబీఏ)ను ప్రారంభించిందిఈ విషయంలో ఉమ్మడి కార్యాచరణ అవసరాన్ని గుర్తిస్తూ.. డ్రగ్స్ నివారణఅంచనాచికిత్సపునరావాసంతదుపరి సంరక్షణప్రజలకు సమాచారాన్ని చేరవేయటంసమాజంలో అవగాహన కల్పించటంతో సహా వివిధ కార్యక్రమాలను ఈ మంత్రిత్వ శాఖ సమన్వయం చేస్తుంది.

భారతదేశంలో మాదకద్రవ్యాల వ్యసనం.. పట్టణగ్రామీణ ప్రాంతాల్లోని వ్యక్తులుకుటుంబాలుసమాజాలపై ప్రభావం చూపుతున్న నిశ్శబ్ద సంక్షోభందీన్ని అరికట్టేందుకు ఎన్ఎంబీఏ ప్రారంభంలో 272 ప్రభావిత జిల్లాలను లక్ష్యంగా చేసుకునిఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించిందిదీనిద్వారా 7.81 కోట్లకు పైగా యువకులు, 5.24 కోట్ల మంది మహిళలు, 17 లక్షల విద్యాసంస్థలతో కలిపి మొత్తం 23 కోట్లకు పైగా ప్రజలను చేరుకుంది.

కేంద్ర సామాజిక న్యాయంసాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. దేశంలోని యువత ఆరోగ్యంగాక్రమశిక్షణతో ఉండేలా చూసేందుకు నషా ముక్త్ భారత్ అభియాన్ అత్యంత కీలకమైన దేశ నిర్మాణ కార్యక్రమంగా పనిచేస్తుందన్నారుభారతదేశాన్ని మాదకద్రవ్యాల రహిత దేశంగా మార్చేందుకు నార్కోటిక్స్ బ్యూరో వంటి నియంత్రణ సంస్థలురాష్ట్రజిల్లా ప్రభుత్వాలుపోలీసు శాఖఎన్జీవోలుఆసుపత్రులు మొదలైనవి సమన్వయంతో పనిచేసేలా ఎన్ఎంబీఏ దోహదపడిందని చెప్పారు.

మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సాక్ష్యాధారాల ఆధారిత విధానాన్ని బలోపేతం చేసేందుకు నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిష్ఠాత్మక ప్రచార కార్యక్రమమని సామాజిక న్యాయంసాధికారత శాఖ సహాయమంత్రి శ్రీ రామ్‌దాస్ అథవాలే తెలిపారుభారతదేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చాలనే ఉమ్మడి లక్ష్యం కోసం.. యువత భాగస్వామ్యంతో సంబంధిత విభాగాలను ఏకం చేస్తూ సమగ్రంగా ఈ అభియాన్ విధానం సాగుతుందని ఆయన తెలిపారు.

కేంద్ర సామాజిక న్యాయంసాధికారత శాఖ సహాయమంత్రి శ్రీ బి.ఎల్.వర్మ మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్న జాతీయ కార్యక్రమం నషా ముక్త్ భారత్ అభియాన్ అని తెలిపారుఈ ఉద్యమంలో యువతమహిళలుసమాజంలోని ఇతర సభ్యులను క్రీయాశీలకంగా భాగస్వాములను చేస్తున్నట్లు.. ముఖ్యంగా ఉన్నత విద్యా సంస్థలుయువజన క్లబ్బులుమహిళా సంఘాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారుడ్రగ్స్ వ్యసనం వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రతి పౌరుడికి అవగాహన కల్పించటమే ఈ ప్రచార ముఖ్య ఉద్దేశమని శ్రీ వర్మ చెప్పారుప్రాథమిక దశలోనే డ్రగ్స్ వాడకాన్ని నివారించటంసమాజ భాగస్వామ్యం ద్వారా ఈ ఉద్యమం మరింత ఆరోగ్యకరమైనసంతోషకరమైన సమాజాన్ని నిర్మిస్తుందనిమాదకద్రవ్యాల మహమ్మారిని అంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

ఎన్ఎంబీఏ ప్రధాన వాటాదారులులబ్ధిదారులు.. యువతమహిళలుపిల్లలువిద్యా సంస్థలుపౌర సమాజంయావత్ సమాజంఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా విస్తృత శ్రేణి కార్యక్రమాలు జరిగాయిఇవి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలనువాటాదారులను భాగస్వాములను చేశాయిమాదకద్రవ్యాల వ్యసనం సమస్యపై గతంలో లాగా కేవలం సంస్థల ప్రమేయానికే పరిమితం కాకుండా ఇప్పుడు సమాజం మొత్తాన్ని భాగస్వామ్యం చేసేలా మార్పు వచ్చిందిరాష్ట్రాలుజిల్లాలుఇతర వాటాదారులు ఈ అభియాన్‌ను బాధ్యతగా స్వీకరించటంతో ఇది ప్రజా ఉద్యమంగా మారింది.

జిల్లారాష్ట్రజాతీయ స్థాయిల్లోని వివిధ విభాగాలువాటాదారులతో కుదుర్చుకున్న భాగస్వామ్యాల ద్వారా ఎన్ఎంబీఏ లక్ష్యం క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలైందిఈ భాగస్వామ్యాలు పౌరుల్లో బాధ్యతను పెంచిమాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించి సామాజిక వివక్షను తగ్గించాయిఅంగీకారాన్నిజవాబుదారీతనాన్ని పెంపొందించాయి.

మాదకద్రవ్యాల వినియోగం మితిమీరివ్యసనంగా మార్చుకోవటం వల్ల సామాజికమానసికశారీరక సమస్యలు ఎదురవుతాయిఇది ఆరోగ్యాన్ని క్షీణించేలా చేయటమే కాకపెను సామాజిక సమస్యగా మారింది.

డ్రగ్స్ వ్యసనానికి గురైన బాధితులకు సాయం అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఉద్దేశించిన కార్యక్రమమే ఎన్ఎంబీఏ ప్రతిజ్ఞప్రజలు డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా వారిలో బాధ్యతాయుతమైన ప్రవర్తననుసామాజిక బాధ్యతను పెంపొందించటం ఈ ప్రతిజ్ఞ ఉద్దేశంఉమ్మడి లక్ష్యం కోసం భాగస్వాములందరూ కలిసి పనిచేసేలా ఐక్యతనునిబద్ధతను ప్రోత్సహించటం దీని లక్ష్యంఈ ప్రతిజ్ఞ.. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత క్రియాశీలకంగా పాల్గొనేలా చేస్తుంది.

హెల్ప్‌లైన్ నంబర్ 14446 ద్వారా మాదకద్రవ్యాల విముక్తిని ప్రోత్సహించేందుకు అందరూ కలిసి కృషి చేయాలి.

 

***


(रिलीज़ आईडी: 2282514) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Gujarati , Urdu , हिन्दी , Tamil