సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్ కేసరి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి.. స్మారక కార్యక్రమాన్ని రేపు కోల్‌కతాలో నిర్వహించనున్న సాంస్కృతిక మంత్రిత్వ శాఖ


కార్యక్రమ ముఖ్య అతిథిగా కేంద్ర హోం వ్యవహారాలు, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా

प्रविष्टि तिथि: 05 JUL 2026 7:01PM by PIB Hyderabad

భారత్ కేసరి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి రేపు.. అంటే 2026 జులై 6ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రెండు సంవత్సరాల పాటు అధికారిక స్మారక కార్యక్రమాలను నిర్వహించనుందిదీనిలో భాగంగా ఒక ప్రత్యేక స్మారక కార్యక్రమాన్ని ఈ నెల 6న ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర హోం వ్యవహారాలుసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొంటారుఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక శాఖపర్యటన శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీ సువేందు అధికారిపశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ మనోజ్ అగర్వాల్సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ అగర్వాల్ సహా ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు.

భారత్ కేసరి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని పురస్కరించుకొని రెండు సంవత్సరాల పాటు దేశవ్యాప్త స్మారక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు 2025లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకటించిందిదార్శనికత కలిగిన రాజనీతికోవిదుడువిద్యావేత్తపార్లమెంట్ సభ్యుడుజాతీయవాద నేత డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిరకాల వారసత్వాన్ని గౌరవించుకొనే లక్ష్యంతో ఈ దేశవ్యాప్త కార్యక్రమాలను ప్రకటించారు.  భారత్ రాజకీయసాంస్కృతికవిద్యాపారిశ్రామిక రంగాల రూపురేఖలను తీర్చిదిద్దడంలో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ విశేష తోడ్పాటును అందించారు.
ముఖ్య అతిథి శ్రీ అమిత్ షాతో పాటు ఇతర ప్రముఖులు కోల్‌కతా.. భవానీపూర్లో ఉన్న డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ నివాసంలో పుష్పాంజలి ఘటించి రేపటి కార్యక్రమానికి శుభారంభాన్ని అందిస్తారుదీని తరువాతముఖ్య అతిథి శ్రీ షా ఇకో పార్కుకు వెళ్లిడాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125 అడుగుల ఎత్తు విగ్రహానికి శంకుస్థాపన చేస్తారుఈ విగ్రహం దేశానికి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అందించిన చిరకాల తోడ్పాటును గౌరవించుకొనే దిశగా చేపడుతున్న ఒక చరిత్రాత్మక కార్యక్రమంగా నిలుస్తుంది.
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవితంతో పాటు ఆయన వారసత్వానికి అంకితం చేసిన ఒక ప్రత్యేక ప్రదర్శనను కూడా మిలన్ మేళా ప్రాంగణంలో ప్రారంభిస్తారుఅరుదైన ఫోటోలుపాత దస్తావేజులుఆకర్షణీయ మల్టీమీడియా ప్రదర్శనలు ఈ ఎగ్జిబిషన్లో భాగంగా ఉంటాయిడాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవన యాత్రఆదర్శాలువిద్యారంగంలో ఆయన తీసుకువచ్చిన సంస్కరణలుభారత్ ప్రజాస్వామ్య సంస్థలతో పాటు పారిశ్రామిక అభివృద్ధిని బలోపేతం చేయడంలో ఆయన పోషించిన కీలక పాత్రను ఈ ఎగ్జిబిషన్ వివరిస్తుంది.
మిలన్ మేళా ప్రాంగణంలో ఏర్పాటు చేసే స్మారక కార్యక్రమంలో వందే మాతరం గేయాన్ని ఆలపిస్తారుసీసీఆర్‌టీ ఆధ్వర్యంలో ‘‘సుర్సంస్కృతి ఏవమ్ రాష్ట్ర’’ పేరిట ఒక ఘన సంగీతమయ శ్రద్ధాంజలిని సమర్పిస్తారుఈ కార్యక్రమంలో భారత శాస్త్రీయజానపదసంప్రదాయ సంగీతానికి ప్రాతినిధ్యం వహించే 57 మంది నిపుణులైన కళాకారులు పాలుపంచుకుంటారుఈ కార్యక్రమం భారత సుసంపన్న సాంస్కృతిక వారసత్వంతో పాటు ఏకతా భావనకు అద్దం పడుతుందిఒక సంగీత రూపకంగా సంకల్పించిన ఈ కార్యక్రమాన్ని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ సాంస్కృతిక జాతీయవాదంజాతీయ సమైక్యతవిద్యనాగరికతా సంబంధిత విలువలతో కూడిన శాశ్వత ఆదర్శాలను పండుగ చేసుకొనేలా నిర్వహించనున్నారుసంగీత రూపకానికి పద్మశ్రీ తరుణ్ భట్టాచార్య దర్శకత్వం వహిస్తారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవితాన్నీతోడ్పాటునీ ప్రతిబింబించే ఒక లఘు చిత్ర ప్రదర్శన కూడా ఉంటుందిదీంతో పాటుడాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీకి చెందిన ప్రతిపాదిత 125 అడుగుల ఎత్తు విగ్రహానికి శంకుస్థాపన సన్నివేశాన్ని కళ్లకు కట్టే ప్రత్యేక వీడియోను కూడా ఆవిష్కరిస్తారు.
దేశమంతటా రెండు సంవత్సరాల పాటు నిర్వహించే ఈ స్మారకోత్సవం దేశ అగ్రగామి రూపకర్తలలో ఒకరి చిరకాల వారసత్వాన్ని సంరక్షిస్తూప్రోత్సహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను చాటనుందిఅలాగే ఈ ఉత్సవం.. జాతీయవాదంప్రజాసేవభారత సమైక్యతప్రగతి పట్ల తిరుగులేని అంకితభావాన్ని చాటిన మహనీయుని ఆదర్శాల స్ఫూర్తిని వర్తమాన తరంతో పాటు భావి తరాల వారికి కూడా స్ఫూర్తిని అందిస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2281443) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Gujarati , Tamil , Malayalam