ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి

प्रविष्टि तिथि: 05 JUL 2026 12:09PM by PIB Hyderabad

   కేంద్ర మాజీ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళి అర్పించారు. సమాజంలోని అణగారిన-బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన అవిరళ కృషి చేశారని పేర్కొన్నారు. ప్రజలకు, దేశానికి సేవ చేయడంలో ఆయన అంకితభావం సదా స్మరణీయమని వ్యాఖ్యానించారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

   “కేంద్ర మాజీ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ జయంతి సందర్భంగా ఈ రోజున ఆయనకు నా హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నాను. సమాజంలో వెనుకబడి, బలహీన వర్గాల ప్రజానీకం అభ్యున్నతి దిశగా ఆయన కృషి అనిర్వచనీయం. ప్రజలకు, దేశానికి సేవలందించడంలో ఆయన అంకితభావం చిరస్మరణీయం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2281436) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Tamil , Tamil , Malayalam