బొగ్గు మంత్రిత్వ శాఖ
‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సంయుక్తంగా నిర్వహించిన బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖలు
प्रविष्टि तिथि:
21 JUN 2026 2:01PM by PIB Hyderabad
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై) 2026ను బొగ్గు మంత్రిత్వ శాఖ, గనుల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఉత్సాహంగా, భారీ భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించాయి. న్యూఢిల్లీలోని నేతాజీ నగర్ జీపీఓఏ-3 వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రిత్వ శాఖల అధికారులు, సిబ్బందిలో సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఈ వేడుక మరోసారి చాటిచెప్పింది. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ ఇతివృత్తమైన ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా’కు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో గనుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ వీణా కుమారి డెర్మల్, బొగ్గు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ సంజీవ్ కుమార్ కాసితో పాటు రెండు మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.. వీరంతా ఎంతో ఉత్సాహంతో 2026 యోగా దినోత్సవ వేడుకల్లో భాగస్వాములై యోగాసనాలు వేశారు.
న్యూఢిల్లీలోని మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా కేంద్రానికి చెందిన యోగా నిపుణులు శ్రీమతి నిషు భందులా అరోరా, శ్రీమతి నిషితలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శారీరక దృఢత్వాన్ని పెంపొందించడం, శరీర సౌలభ్యాన్ని మెరుగుపరచడం, మానసిక స్థైర్యాన్ని బలోపేతం చేయడం, సంపూర్ణ శ్రేయస్సును పెంపొందించే లక్ష్యంతో.. పాల్గొన్న వారందరికీ యోగా గురువులు వివిధ ఆసనాలు, ప్రాణాయామం, ధ్యాన పద్దతులను నేర్పించారు.
ఈ సందర్భంగా గనుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ వీణా కుమారి డెర్మల్ మాట్లాడుతూ.. యోగాను రోజువారీ జీవితంలో ఒక అంతర్భాగంగా మార్చుకోవాల్సిన అవసరముందని చెప్పారు. ముఖ్యంగా కార్యాలయాల్లో గంటల తరబడి కూర్చుని పనిచేసే ఉద్యోగులు,అధికారులు యోగాను రోజువారీ అలవాటుగా మార్చుకోవాలని కోరారు. కార్యాలయాల్లో ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని.. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల కూర్చునే విధానం మెరుగవుతుందని, ఒత్తిడి తగ్గుతుందని, ఏకాగ్రత పెరుగడంతోపాటు మొత్తం ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పారు. మరింత ఆరోగ్యకరమైన, సమతుల్యమైన జీవనశైలి కోసం ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కొన్ని నిమిషాల సమయాన్ని యోగాకు కేటాయించాలని ప్రోత్సహించారు.
కార్యక్రమ ముగింపు ప్రసంగంలో బొగ్గు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ సంజీవ్ కుమార్ కాసి మాట్లాడుతూ.. ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఉద్యోగులు, అధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. యోగా శిక్షకులు, నిర్వాహకుల కృషిని అభినందించారు. యోగా కేవలం ఒక్క రోజు జరుపుకునే వేడుక మాత్రమే కాదని, శరీరాన్ని, మనసును బలోపేతం చేసే జీవితకాల సాధనగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవడమే కాకుండా, ఇతరులు కూడా దీనిని అనుసరించేలా ప్రోత్సహించడం ద్వారా అంతర్జాతీయ యోగా దినోత్సవ సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రెండు మంత్రిత్వ శాఖల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఉత్సాహాన్ని చాటారు. వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలో ఆరోగ్యాన్ని ఒక అంతర్భాగంగా మార్చుకోవాలనే వారి నిబద్ధతకు ఇది అద్దం పట్టింది. అందరూ కలిసికట్టుగా యోగా సాధన చేయడం వల్ల పాల్గొన్న వారిలో ఐక్యత, క్రమశిక్షణ, ఏకాగ్రత పెంపొందాయి.
ఈ వేడుకలు ముందస్తు ఆరోగ్య రక్షణ, పని ప్రదేశంలో శ్రేయస్సు, ఆరోగ్యకరమైన, ఉత్పాదకత గల సిబ్బందిని తయారు చేయాలనే ఉద్దేశంతో బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖల ఉమ్మడి నిబద్ధతను చాటిచెప్పాయి. సంపూర్ణ ఆరోగ్యం, శాశ్వత శ్రేయస్సును సాధించడానికి యోగాను రోజువారీ అలవాటుగా మార్చుకోవాలనే ప్రాధాన్యతను ఈ కార్యక్రమం మరోసారి స్పష్టం చేసింది.
***
(रिलीज़ आईडी: 2276413)
आगंतुक पटल : 16