ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద ప్రోత్సాహకాల పంపిణీ... తన ప్రసంగంలోని విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
19 JUN 2026 11:01PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద ప్రోత్సాహకాలను పంపిణీ చేసిన సందర్భంగా తన ప్రసంగంలోని ముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన వరుస పోస్టుల్లో శ్రీ మోదీ ఈ విధంగా పేర్కొన్నారు..
‘‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ద్వారా మన యువ మిత్రులకు తొలి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు, సంస్థలు కూడా యువత వెనుక ప్రభుత్వం అండగా నిలబడి ఉందని భావిస్తున్నాయి. దీనివల్ల వారి దృక్పథం కూడా మారుతుంది.’’
‘‘ఈ రోజు దేశంలోని అంకుర సంస్థలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు సరికొత్త శక్తితో కలిసి పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. దీనివల్ల మన యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి’’.
‘‘ప్రతిభ, నైపుణ్యం, ఆవిష్కరణల శక్తితోనే అభివృద్ధి చెందిన భారత్కు మార్గం సుగమం అవుతుంది. ఈ క్రమంలో పారిశ్రామిక రంగానికి నాదొక ప్రత్యేక విజ్ఞప్తి’’.
****
(रिलीज़ आईडी: 2275636)
आगंतुक पटल : 2