మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మత్స్య సంపద విలువ వ్యవస్థల బలోపేతం... ప్రపంచ సముద్ర ఆహార ఉత్పత్తుల మార్కెట్లో భారత పోటీని పెంపొందించడంపై విశాఖపట్నంలో జాతీయ సదస్సు


ఉత్పత్తుల మూలాల గుర్తింపు, స్థిరత్వ ధృవీకరణలు, విలువ జోడింపు, ఎగుమతుల విస్తరణతో పాటు అత్యంత విలువైన లోతట్టు సముద్ర వనరుల వినియోగంపై సాంకేతిక సమావేశాల్లో చర్చలు

प्रविष्टि तिथि: 07 JUN 2026 4:21PM by PIB Hyderabad

సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై 2026 జూన్ 5, 6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జాతీయ సదస్సు జరిగిందిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర వాణిజ్యపరిశ్రమల మంత్రిత్వ శాఖతో కలసి మత్స్యపశుసంవర్ధకపాడి పరిశ్రమాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన మత్స్య విభాగం ఈ సదస్సును నిర్వహించింది.  ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకేంద్ర వాణిజ్యపరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్కేంద్ర మత్స్యపశుసంవర్ధకపాడి పరిశ్రమాభివృద్ధిపంచాయతీ రాజ్ శాఖ  మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్కేంద్ర పౌర విమానయాన శాఖ  మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ చిరాగ్ పాశ్వాన్ మొదటి రోజు సదస్సులో పాల్గొన్నారు

ఈ సదస్సులో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు వివిధ రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొన్నారుసముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపీఈడిఏ), ఎగుమతుల తనిఖీ మండలి (ఈఐసీ), భారత ఆహార భద్రతప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ), జాతీయ మత్స్య పరిశ్రమాభివృద్ధి బోర్డు (ఎన్ఎఫ్డీబీనాబార్డ్ఎన్‌సీడీసీఎన్‌సీఈఎల్ఎస్ఎఫ్ఏసీ,  ఇన్వెస్ట్ ఇండియా వంటి ప్రముఖ జాతీయ సంస్థలు ఈ సదస్సులో భాగస్వామ్యమయ్యాయిసముద్ర ఉత్పత్తుల ఎగుమతుల రంగానికి పూర్తిస్థాయి ప్రాతినిధ్యం కల్పించేలా వాటి ఎగుమతిదారులుపరిశ్రమల సంఘాలుప్రాసెసర్లుస్టార్టప్‌లుఇతర అనుబంధ రంగాలకు చెందినవారు కూడా సదస్సుకు హాజరయ్యారు

భారత్ ను ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం గల సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతి దేశంగా నిలబెట్టడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయికేవలం పరిమాణం ఆధారిత ఎగుమతుల నుంచి విలువ ఆధారితఅత్యున్నత నాణ్యమైన ఉత్పత్తుల వైపు మారడంభారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల అంతర్జాతీయ బ్రాండ్‌ను బలోపేతం చేసేందుకు ఆవిష్కరణలుఅధునాతన సాంకేతికతలుమూలాలను గుర్తించే పటిష్టమైన వ్యవస్థలను ప్రోత్సహించడం వంటి కీలక అంశాలను చర్చించారుసమర్థవంతమైననిబంధనలకు అనుగుణమైన వాణిజ్యం కోసం కోల్డ్ చైన్ఎయిర్ కార్గోక్వారంటైన్ వసతులతో సహా ఎగుమతి మౌలిక సదుపాయాలురవాణా సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరాన్ని కూడా ఈ చర్చల్లో ప్రముఖంగా ప్రస్తావించారు.

ఉత్పత్తిలో గణనీయమైన వాటా కలిగిన మత్స్య సంపద (ఇన్‌ల్యాండ్ ఫిషరీస్)  ఎగుమతులను పెంచాల్సిన అవసరాన్ని,  తినేందుకు సిద్ధంగా ఉండే (రెడీ-టు-ఈట్ఉత్పత్తులుఅధిక విలువ కలిగిన చేపల జాతులు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఇంకా వినియోగంలోకి రాని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరాన్ని సమావేశంలో ప్రముఖంగా ప్రస్తావించారుసుస్థిరతనాణ్యత హామీనియంత్రణ నిబంధనల పాటింపుతో పాటు ప్రాసెసింగ్ సామర్థ్యాన్నివిలువ వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని మంత్రులు ప్రస్తావించారుసముద్ర ఆహార ఎగుమతుల రంగాన్ని మరింత పటిష్ఠంగాభవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రభుత్వ విధానం అవలంబించడంబహుళ రవాణా వ్యవస్థలను మెరుగుపరచడంపెట్టుబడులుఆవిష్కరణలుప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

మత్స్య శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ సాగర్ మెహ్రా ప్రస్తుత సంస్కరణలుప్రాధాన్యతా పథకాల ద్వారా ఉత్పత్తిని పెంచడంమూలాల గుర్తింపుధృవీకరణ వ్యవస్థలను బలోపేతం చేయడంసముద్ర లోతుఈఈజెడ్ వనరులలోని అపారమైన సామర్థ్యాన్ని వెలికితీయడం వంటి అంశాలపై ప్రసంగించారువాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి శ్రీ అజయ్ భదూ భారత ఎగుమతుల నిర్వహణమారుతున్న ప్రపంచ మార్కెట్ పోకడలుసముద్ర ఆహార ఎగుమతుల విస్తరణలో ఎఫ్‌టీఏల పాత్రమార్కెట్ వైవిధ్యీకరణమెరుగైన పోటీతత్వం గురించి వివరించారుఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ డిప్రవీణ్ప్రపంచ ప్రమాణాలతో పోల్చితే మనకున్న లోపాలను గుర్తిస్తూప్రాసెసింగ్విలువ ఆధారిత ఉత్పత్తులను పెంచాల్సిన అవసరాన్ని ప్రముఖంగా చెప్పారుఎగుమతి విలువను పెంచేందుకు కోల్డ్ చైన్ అభివృద్ధిప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలుగొలుసుకట్టు వ్యవస్థల అనుసంధానానికి మద్దతు ఇచ్చే కీలక పథకాలను ఆయన ప్రస్తావించారు.

మధ్యప్రదేశ్ ప్రభుత్వ మత్స్య శాఖ కార్యదర్శి శ్రీ స్వతంత్ర కుమార్ సింగ్ రైతుల ఆదాయంఉత్పత్తిని పెంచడానికి కేజ్ కల్చర్జలాశయాల ఆధారిత జలచరాల పెంపకంపై దృష్టి పెట్టాలని సూచించారుముత్యాల పెంపకం వంటి అత్యంత లాభదాయకమైన ప్రక్రియల వైపు మళ్లడం ద్వారా లోతట్టు జల్ జల మత్స్య సంపద ఎగుమతి సామర్థ్యాన్ని పెంచవచ్చని ఆయన స్పష్టం చేశారుఎగుమతుల తనిఖీ కౌన్సిల్ అధికారులు మార్కెట్ పరిధిని విస్తరించడానికి ధృవీకరణతనిఖీ వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు పటిష్టమైన నాణ్యతా ప్రమాణాలురసాయన అవశేషాల నియంత్రణయాంటీమైక్రోబియల్ ప్రమాణాలుడిజిటల్ పద్ధతిలో మూలాల గుర్తింపు వంటి అంతర్జాతీయ నిబంధనలను అమలు చేయాల్సిన ప్రాధాన్యతను వివరించారుపరిశ్రమలప్రోత్సాహకఅంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ)తో పాటు సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏఐ), ఇండియన్ ఫిష్‌మీల్ అండ్ ఫిష్ ఆయిల్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ (ఐఎఫ్ఏఎఫ్ఈఏ), ఇండియన్ మెరైన్ ఇంగ్రెడియెంట్స్ అసోసియేషన్ (ఐఎంఐఎమొదలైన పరిశ్రమల సంఘాలు మార్కెట్ అవకాశాలుపోటీతత్వంసుస్థిరతసముద్ర ఆహార సీఫుడ్ ఎగుమతులను ప్రభావితం చేసే కీలక సవాళ్లపై భాగస్వాముల అభిప్రాయాలను పంచుకున్నాయి.

ఈ చర్చల్లో సముద్ర ఆహార ఎగుమతి విలువ వ్యవస్థల సరఫరా వ్యవస్థలో... వ్యాధుల నిర్వహణపెరుగుతున్న పెట్టుబడి వ్యయాలునాణ్యమైన విత్తనాలు (చేప/రొయ్య పిల్లలు), క్వారంటైన్ వసతులు సరిగ్గా లభించకపోవడంరవాణాకోల్డ్ చైన్ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలలో లోపాలు వంటి కీలక సవాళ్లను వాటాదారులు ప్రముఖంగా ప్రస్తావించారుకఠినమైన ధ్రువీకరణ నిబంధనలుయాంటీబయాటిక్ ఔషధాలపై నియంత్రణలుమూలాల గుర్తింపు)తో పాటు లోతట్టు జల మత్స్య సంపద నుంచి ఎగుమతుల వాటా తక్కువగా ఉండటంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయిఅత్యంత విలువైన రకాలుకొత్త మార్కెట్ల వైపు విస్తరించాల్సిన అవసరాన్ని కూడా గుర్తుచేశారు.

2026 జూన్ 6వ తేదీన జరిగిన రెండో రోజు సదస్సులో రెండు ప్రత్యేక సాంకేతిక సమావేశాలు నిర్వహించారుసముద్ర ఆహార ఎగుమతుల్లో లక్ష కోట్ల రూపాయల స్థాయిని అధిగమించాలనే జాతీయ లక్ష్యానికి మద్దతుగాభారత సముద్ర ఆహార ఎగుమతి రంగాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన వ్యూహాత్మక చర్యలపై ఇందులో ప్రధానంగా దృష్టి పెట్టారుమత్స్య రంగంలో ధృవీకరణలుమూలాల గుర్తింపువిలువ ఆధారిత ఉత్పత్తులుసుస్థిరతసరికొత్త ఎగుమతి అవకాశాలకు సంబంధించిన అంశాలపై చర్చించడానికి విధానకర్తలుఎగుమతిదారులుపరిశ్రమల ప్రముఖులుపరిశోధకులుస్టార్టప్‌లుఎంఎస్ఎంఈలుఇతర వాటాదారులు ఈ సమావేశాల్లో ఒకచోటికి చేరారు.

విలువ జోడింపుధ్రువీకరణవిలువ మూలాల గుర్తింపు ద్వారా సముద్ర ఆహార ఎగుమతులకు ప్రోత్సాహం అనే అంశంపై నిర్వహించిన తొలి సాంకేతిక సమావేశానికి ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీ వీ స్వామి అధ్యక్షత వహించారుఎంపెడా ఛైర్మన్ పీ జవహర్ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సహాధ్యక్షులుగా వ్యవహరించారుఈ సమావేశంలో భారత సముద్ర ఆహార ఎగుమతుల పోటీతత్వాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తూ మూడు ప్రధాన అంశాలపై చర్చలు జరిగాయిఅవి: (i) ఎగుమతి మార్కెట్ల కోసం చేపల వేట ధ్రువీకరణకు తోడ్పడే గుర్తింపు వ్యవస్థలు. (ii) ఆక్వాకల్చర్చేపల వేట రంగాల్లో సుస్థిర ధ్రువీకరణ. (iii) సముద్ర ఆహార రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ)విధాన రూపకల్పన అవకాశాల పరిశీలన.

మారుతున్న అంతర్జాతీయ మార్కెట్ నిబంధనలనుముఖ్యంగా ప్రధాన ఎగుమతి దేశాల వేటాడిన మత్స్య సంపద ధ్రువీకరణ ప్రమాణాలను అందుకోవడానికి ఆక్వాకల్చర్సముద్ర మత్స్య రంగాలు రెండింటిలోనూ మూలాల గుర్తింపు వ్యవస్థల ప్రాధాన్యత పెరుగుతోందని ఈ చర్చలు స్పష్టం చేశాయిపారదర్శకతనిబంధనల అమలుమార్కెట్ పరిధిని మెరుగుపరచడానికి పటిష్టమైన డిజిటల్ గుర్తింపు వ్యవస్థలువాటాదారుల మధ్య మెరుగైన సమన్వయంవిలువ వ్యవస్థ అంతటా మరింత అనుసంధానం అవసరమని చర్చల్లో స్పష్టం చేశారుమార్కెట్ పరిధిని విస్తరించడానికివినియోగదారుల నమ్మకాన్ని పెంపొందించడానికి అవసరమైన సుస్థిర ధృవీకరణ విధానాలుబాధ్యతాయుతమైన ఉత్పత్తి పద్ధతులను కూడా ఈ సదస్సులో పరిశీలించారుభారతీయ ధృవీకరణ వ్యవస్థలను ప్రోత్సహించడంసుస్థిరత చర్యలను బలోపేతం చేయడంభారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంచడంపై ప్రతినిధులు చర్చించారుసముద్ర ఆహార  రంగం కోసం ప్రతిపాదిత పీఎల్ఐ  విధానంపై జరిగిన చర్చలు ప్రధానంగా విలువ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడంఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడంపెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి పెట్టాయినిర్దేశిత విధానపరమైన మద్దతుమౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ప్రపంచ సముద్ర ఆహార విలువ వ్యవస్థలలో భారత్ స్థానాన్ని బలోపేతం చేయడంపై కూడా ఈ చర్చల్లో ప్రముఖంగా ప్రస్తావించారు

సముద్ర ఆహార ఎగుమతుల పురోగతిలో మత్స్యఆక్వాకల్చర్ స్టార్టప్‌లుఎంఎస్ఎంఈ ల పాత్ర” అనే అంశంపై జరిగిన రెండవ సాంకేతిక సమావేశానికి  కేంద్ర మత్స్యపశుసంవర్ధకపాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ మత్స్య విభాగం సంయుక్త కార్యదర్శి (లోతట్టు జల మత్స్య సంపదశ్రీ సాగర్ మెహ్రాఐసీఏఆర్ డీడీజీ (మత్స్య విభాగండాక్టర్ జెకెజెనాఎన్ఎఫ్‌డీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ బికెబెహరాకేంద్ర మత్స్య విభాగం సంయుక్త కార్యదర్శి (మెరైన్డాక్టర్ సురభి రాయ్ సంయుక్తంగా అధ్యక్షత వహించారుఈ సదస్సులో ఆవిష్కరణలువిలువ ఆధారిత ఉత్పత్తులుమార్కెట్ వైవిధ్యీకరణ ద్వారా సముద్ర ఆహార ఎగుమతులను పెంచడంలో స్టార్టప్‌లుపారిశ్రామికవేత్తలుఎంఎస్ఎంఈల పాత్రను విశ్లేషించారుఈ చర్చలను మూడు ప్రధాన ఉప అంశాలుగా విభజించారు: (i) విలువ జోడింపు,  ఎగుమతుల ప్రోత్సాహం, (ii) అత్యంత విలువైన లోతైన సముద్ర వనరుల వినియోగం, (iii) ఎగుమతి అవకాశాల విస్తరణ.

మత్స్య రంగంలో ఆవిష్కరణలువిలువ ఆధారిత ఉత్పత్తులుఎగుమతుల విస్తరణను పెంపొందించడానికి స్టార్టప్‌లుఎంఎస్ఎంఈలకు అనుకూలమైన పటిష్టమైన వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరాన్ని ఈ చర్చలు ప్రముఖంగా పేర్కొన్నాయిచర్చలు ప్రధానంగా ప్రాసెసింగ్పంట అనంతర  మౌలిక సదుపాయాల బలోపేతంఅధిక విలువ కలిగినప్రత్యేక సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రోత్సాహంట్యూనా వంటి లోతట్టు సముద్ర మత్స్య వనరుల్లోని వినియోగంలోకి రాని సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడంఅలాగే సముద్ర శైవలాల (సీవీడ్సాగుఅలంకార మత్స్య పెంపకంముత్యాల రకాల జల చరాల పెంపకంశీతల జల మత్స్య పెంపకం వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల ద్వారా ఎగుమతి అవకాశాలను విస్తరించడంపై కేంద్రీకృతమయ్యాయిభారత అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంచడానికిఉపాధి అవకాశాలను సృష్టించడానికిసముద్ర ఆహార ఎగుమతుల్లో స్థిరమైన వృద్ధిని వేగవంతం చేయడానికి దోహదపడే విధానపరమైన చర్యలుసాంకేతికతను అలవర్చుకోవడంనైపుణ్యాభివృద్ధిధృవీకరణలుబ్రాండింగ్మెరుగైన మార్కెట్ అనుసంధానాల అవసరాన్ని ప్రతినిధులు ప్రముఖంగా చెప్పారు.

భారత సముద్ర ఆహార ఎగుమతి రంగాన్ని బలోపేతం చేయాలనే కేంద్ర మంత్రిత్వ శాఖలురాష్ట్ర ప్రభుత్వాలుపరిశ్రమల ప్రతినిధులుఎగుమతిదారులుపరిశోధనా సంస్థలు,  పారిశ్రామికవేత్తల ఉమ్మడి సంకల్పంతో సదస్సు ముగిసిందిసుస్థిర ఉత్పత్తివిలువ ఆధారిత ఉత్పత్తులుమూలాల గుర్తింపుధృవీకరణలుమౌలిక సదుపాయాల అభివృద్ధిఆవిష్కరణలు మార్కెట్ వైవిధ్యీకరణ వంటి అన్ని అంశాలను కలుపుకుంటూ ఒక సమన్వయ విధానంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఈ చర్చలు స్పష్టం చేశాయిఈ సదస్సు ద్వారా వెలువడిన సిఫార్సులు రాబోయే రోజుల్లో విధానాల రూపకల్పనకు సముద్ర ఆహార ఎగుమతుల్లో భారత అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంపొందించే లక్ష్యిత చర్యలకు ఎంతగానో దోహదపడతాయని భావిస్తున్నారు.

సముద్ర ఆహార ఎగుమతులు ఇప్పటికే బలమైన వృద్ధినినిలకడను ప్రదర్శిస్తున్న తరుణంలోప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసే  విధానం ద్వారా మత్స్య రంగంలో దాగి ఉన్న పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సదస్సు పునరుద్ఘాటించిందిసముద్ర ఆహార ఎగుమతుల్లో లక్ష కోట్ల రూపాయల స్థాయిని అధిగమించే దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణానికి ఈ సదస్సు ఫలితాలు ఊతమిస్తాయని ఆశిస్తున్నారుమత్స్యకారులురైతులుప్రాసెసర్లుస్టార్టప్‌లు ఎంఎస్ఎంఈలకు కూడా ఇవి మరిన్ని మెరుగైన అవకాశాలను కల్పిస్తాయనిప్రపంచ మార్కెట్లలో నాణ్యమైనసుస్థిరమైన సముద్ర ఆహార ఉత్పత్తులను అందించే నమ్మకమైన సరఫరాదారుగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు.

 

***


(रिलीज़ आईडी: 2270192) आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Kannada