ప్రధాన మంత్రి కార్యాలయం
ఐక్యత, పరస్పర సహకారం, సమష్టి సంకల్పానికున్న శక్తిని వివరించే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
03 JUN 2026 9:00AM by PIB Hyderabad
ఐక్యత, పరస్పర సహకారమనే బంధాలతో ప్రజలందరూ ఏకమైనప్పుడు దేశానికున్న శక్తి అనేక రెట్లు పెరుగుతుందని తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు. భారత ప్రజలకున్న ఈ సమష్టి సంకల్పంతోనే ప్రగతిపథంలో దేశం కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి:
ఐక్యత, పరస్పర సహకారమనే సూత్రంతో ప్రజలు ఏకమైనప్పుడు, దేశానికున్న శక్తి అనేక రెట్లు పెరుగుతుంది. భారత ప్రజలకున్న ఈ సమష్టి సంకల్పంతోనే అభివృద్ధిలో నూతన శిఖరాలను మన దేశం అధిరోహిస్తోంది.
ధూమాయంతే వ్యపేతాని జ్వలంతి సహితాని చ।
ధృతరాష్ట్రోల్ముకానీవ జ్ఞాతయో భరతర్షభ।।
ఒక చెక్క ముక్క విడిగా తన శక్తిని ప్రదర్శించలేదు. అనేక చెక్క ముక్కలు కలిసినప్పుడు అవి పూర్తిస్థాయిలో వెలుగునీ, వెచ్చదనాన్నీ అందించగలవు. అదే విధంగా ఒక దేశం పురోగతి, సంక్షేమం, బలం దాని ప్రజల ఐక్యత, పరస్పర సహకారం, సామూహిక సంకల్పంపై ఆధారపడి ఉంటాయి.
***
(रिलीज़ आईडी: 2268248)
आगंतुक पटल : 65
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam