రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

సముద్ర రక్షణ కార్యక్రమాన్ని ముగించి… కొచ్చికి చేరుకున్న ఐఓఎస్‌ సాగర్ (ఐఎన్‌ఎస్‌ సునయన)


సాగర్ నుంచి మహాసాగర్ వరకు.. హిందూ మహాసముద్రంలో ప్రాంతీయ సముద్ర సహకారాన్ని, ఉమ్మడి భద్రతను బలోపేతం చేస్తున్న భారత నౌకాదళం

నాడు పోస్టు చేయడమైనది: 20 MAY 2026 6:21PM by PIB Hyderabad

భారత నౌకాదళం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఐఓఎస్‌ సాగర్ సముద్రయాన మిషన్ విజయవంతంగా ముగిసిందిహిందూ మహాసముద్ర ప్రాంతంలో (ఐఓఆర్‌సుదీర్ఘ కాలంపాటు వివిధ దేశాల మీదుగా సాగిన నౌకా యాత్ర ముగింపు సందర్భంగా మే 20, 2026న కొచ్చిలో ఐఎన్‌ఎస్‌ సునయనకు భారత నౌకాదళం ఘన స్వాగతం పలికింది. 16 భాగస్వామ్య దేశాలకు చెందిన 38 మంది సిబ్బందితో కలిసి సాగిన ఈ సంయుక్త మిషన్‌ హిందూ సముద్ర ప్రాంతంలో విశ్వసనీయమైనభద్రతా భాగస్వామిగా భారత్ ఎదుగుదలకు నిదర్శనంగా నిలిచిందిఈ ప్రాంతంలోని నౌకాదళాల మధ్య పరస్పర సహకారాన్నిసమర్థతనుసామర్థ్యాలను పెంపొందించటానికి భారత్‌ చూపిస్తున్న నిరంతర నిబద్ధతకు ఈ యాత్ర మరోసారి చాటిచెప్పింది.

భారత నౌకాదళంభాగస్వామ్య దేశాలు (బంగ్లాదేశ్‌ఇండోనేషియాకెన్యామలేషియామారిషస్మాల్దీవులుమొజాంబిక్మయన‌్మార్‌సీషెల్స్‌సింగపూర్‌దక్షిణాఫ్రికాశ్రీలంకటాంజానియాథాయిలాండ్‌తైమూర్‌ లెస్టేయునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమం... ఈ ప్రాంతంలో నిర్వహించిన అత్యంత సమగ్రమైన బహుళజాతి కార్యాచరణల్లో ఒకటిగా నిలిచింది.

'ఒకే సముద్రంఒకే లక్ష్యంస్ఫూర్తిని ప్రతిబింబిస్తూ.. ప్రాంతీయ భాగస్వామ్యంఉమ్మడి కార్యకలాపాల ద్వారా సమ్మిళితసహకారనియమబద్ధమైన సముద్ర వ్యవస్థను పెంపొందించటంలో భారత నౌకాదళ నిబద్ధతను ఐఓఎస్‌ సాగర్‌ ప్రదర్శించింది.

భారతదేశ సముద్ర తీర ప్రాంతాల రక్షణఅభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన సాగర్ప్రాంతంలోని అందరికీ భద్రతఅభివృద్ధి.. మహాసాగర్‌అన్ని ప్రాంతాల భద్రతఅభివృద్ధికి పరస్పరసమగ్ర పురోగతి వంటి కీలక కార్యక్రమాల ఆశయాలకు అనుగుణంగానే ఈ మిషన్‌ ఉందిహిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాలన్నింటికీ ఉమ్మడి రక్షణప్రాంతీయ స్థిరత్వంసముద్ర రంగంలో వృద్ధిని సాధించటమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం.

కొచ్చి హార్బర్‌కు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ సునయనకు నీటి ఫిరంగులతో ఘన స్వాగతం పలికారునేవల్ ఫాస్ట్‌ ఇంటర్‌సెప్టర్‌ క్రాఫ్ట్‌ల రక్షణలో వచ్చిన ఈ నౌకకుదక్షిణ నేవీ కమాండ్‌లోని సీనియర్‌ అధికారులు స్వాగతం పలికారుఐఓఎస్ సాగర్ ఫ్లాగ్-ఇన్ వేడుకకు దక్షిణ నేవీ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా ముఖ్య అతిథిగా హాజరయ్యారుఓడ తిరిగొచ్చిన సందర్భంగా.. సుదీర్ఘ ప్రయాణంలో వివిధ దేశాల సిబ్బంది ప్రదర్శించిన వృత్తి నైపుణ్యంసమన్వయంఅసాధారణమైన సమష్టి కృషిని ఆయన ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందిని ఉద్దేశించి దక్షిణ ఎఫ్‌ఓసీఐఎన్‌సీ మాట్లాడారుభాగస్వామ్య నౌకాదళాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించటానికిహిందూ మహా సముద్ర ప్రాంతంలో (ఐఓఆర్‌ఎదురవుతున్న భద్రతా సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం చేస్తున్న ప్రయత్నాలకు ఐఓఎస్‌ సాగర్‌ నిదర్శనమని ఆయన అన్నారుఈ ప్రాంతంలో సురక్షితమైనస్థిరమైనసుసంపన్నమైన సముద్ర వాతావరణాన్ని కల్పించేందుకు ప్రాంతీయ నౌకాదళాల మధ్య నిరంతర భాగస్వామ్యంపరస్పర సహకారంకార్యాచరణ సమన్వయం ఎంతో అవసరమని స్పష్టం చేశారు.

ఉమ్మడి శిక్షణపరస్పర చర్చలుసహకార కార్యాచరణ కార్యకలాపాల ద్వారా నౌకాదళాల మధ్య సహకారాన్నిసమన్వయాన్నిపరస్పర అవగాహనను ఈ యాత్ర మరింత పెంచిందని ఆయన అన్నారుఇలాంటి కార్యక్రమాలు సముద్రపు దొంగతనాలుఅక్రమ చేపల వేటఆయుధాలుమాదక ద్రవ్యాల అక్రమ రవాణాస్మగ్లింగ్‌సముద్రంలో ఇతర అసాధారణ ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రాంతీయ నౌకాదళాల శక్తిని బలోపేతం చేస్తాయి.

ఏప్రిల్‌ 2, 2026న ముంబయిలో ఐఓఎస్‌ సాగర్‌ నౌకను రక్షణ శాఖ సహాయమంత్రి శ్రీ సంజయ్‌ సేథ్‌ ప్రారంభించారుఈ యాత్రలో భాగంగా మాలెఫుకెట్‌జకార్తాసింగపూర్యాంగూన్చత్తోగ్రామ్‌కొలంబో నౌకాశ్రయాలను ఈ ఓడ సందర్శించింది.

ఈ ప్రయత్నంలో భాగంగా ప్రయాణ విన్యాసాలునౌకల మధ్య పరస్పర సంభాషణలునిపుణుల అభిప్రాయ మార్పిడి కార్యక్రమాలుసమన్వయ సముద్ర విన్యాసాలుసముద్ర భద్రతపై చర్చలుభాగస్వామ్య దేశాల నౌకాదళాలుసముద్ర సంస్థలతో వృత్తిపరమైన సమావేశాలు జరిగాయిఈ కార్యక్రమాలు హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర భద్రతరక్షణనౌకాయాన స్వేచ్ఛను కాపాడటం పట్ల ఉమ్మడి నిబద్ధతను మరింత బలోపేతం చేశాయి.

ఈ మోహరింపునకు ముందు వివిధ దేశాల సిబ్బంది.. కొచ్చిలోని దక్షిణ నేవీ కమాండ్‌లో సముద్ర నైపుణ్యాలునావిగేషన్అగ్నిమాపక చర్యలునష్ట నివారణకమ్యూనికేషన్‌ విధానాలువీబీఎస్‌ఎస్ కార్యకలాపాలుఅధునాతన బ్రిడ్జ్‌మ్యాన్‌షిప్‌ అంశాలపై సమగ్ర హార్బర్ శిక్షణ పొందారువృత్తిపరమైన పరస్పర సహకారాన్నికార్యాచరణ సామర్థ్యాన్ని మరింత పెంపొందించుకోవటానికి కొచ్చిలో జరిగిన ఐఓఎన్‌ఎస్‌ మారిటైమ్ ఎక్సర్‌సైజ్ ఐఎంఈఎక్స్‌ టేబుల్ టాప్ ఎక్సర్‌సైజ్‌లోనూ ఈ సిబ్బంది పాల్గొన్నారు.

భారతదేశ సముద్రతీర విస్తరణప్రాంతీయ భాగస్వామ్య కార్యక్రమాల్లో ఐఓఎస్‌ సాగర్‌ విజయం కీలక ఘట్టంగా నిలిచిందిహిందూ మహాసముద్ర ప్రాంతంలో విశ్వసనీయమైన భాగస్వామ్యాలను ఏర్పరచటంఉమ్మడి నౌకాదళ సామర్థ్యాన్ని పెంపొందించటంసహకార భద్రతను ప్రోత్సహించటం పట్ల భారత నౌకా దళానికున్న నిరంతర నిబద్ధతను ఇది స్పష్టం చేస్తుంది.

 

****


(రిలీజ్ ఐడి: 2263962) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil , Malayalam